AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘తబ్లీఘీ జమాత్’ ఘటన.. కేంద్రం, అజిత్ దోవల్‌పై మహారాష్ట్ర హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..

Coronavirus Outbreak: ఢిల్లీలో ఇటీవల జరిగిన నిజాముద్దీన్ మార్కజ్ కార్యక్రమం విషయంలో ఆ రాష్ట్ర పోలీసులు, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ వ్యవహరించిన తీరుపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ విమర్శించారు. ఈమేరకు బుధవారం ఆయన ఓ లేఖను విడుదల చేసి.. అందులో ఢిల్లీలో తబ్లీఘి జమాత్ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించిందని.. దానికి పోలీసులు ఎలా పర్మిషన్ ఇచ్చారనే ప్రశ్నలను లేవనెత్తారు. మర్కజ్‌కు హాజరైన వారి సహాయంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇతర […]

'తబ్లీఘీ జమాత్' ఘటన.. కేంద్రం, అజిత్ దోవల్‌పై మహారాష్ట్ర హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..
Ravi Kiran
|

Updated on: Apr 09, 2020 | 2:12 PM

Share

Coronavirus Outbreak: ఢిల్లీలో ఇటీవల జరిగిన నిజాముద్దీన్ మార్కజ్ కార్యక్రమం విషయంలో ఆ రాష్ట్ర పోలీసులు, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ వ్యవహరించిన తీరుపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ విమర్శించారు. ఈమేరకు బుధవారం ఆయన ఓ లేఖను విడుదల చేసి.. అందులో ఢిల్లీలో తబ్లీఘి జమాత్ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించిందని.. దానికి పోలీసులు ఎలా పర్మిషన్ ఇచ్చారనే ప్రశ్నలను లేవనెత్తారు.

మర్కజ్‌కు హాజరైన వారి సహాయంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇతర రాష్ట్రాల్లో కరోనావైరస్ వ్యాప్తి చేసిందంటూ అనిల్ దేశ్‌ముఖ్ ఆరోపించారు. “బీజేపీ ప్రభుత్వం దేశమంతా కరోనావైరస్ వ్యాప్తి చెందడానికి మతపరమైన కార్యక్రమానికి అనుమతించిందని” ఆయన అన్నారు. ‘మార్చి 14,15 తేదిల్లో వాసాయిలో జరగాల్సిన నిజాముద్దీన్ మర్కజ్ అభినందన సభకు అనుమతులను మహారాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ కార్యక్రమంలో కోసం వారు ఫిబ్రవరి 5న అనుమతి కోరగా.. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యం రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని మంత్రి చెప్పారు.

అనిల్ దేశ్‌ముఖ్ కేంద్రానికి రాసిన లేఖలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఢిల్లీ పోలీసులు, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్‌కు ఎనిమిది ప్రశ్నలు సంధించారు. “డోవల్ తెల్లవారుజామున 2 గంటలకు మర్కజ్ చీఫ్ మౌలానా సాద్‌ను కలవడానికి వెళ్ళారు. ఎన్‌ఎస్‌ఏ అతన్ని కలవడానికి ఎందుకు వెళ్ళింది? అక్కడ డోవల్ లేదా ఢిల్లీ పోలీసుల పని ఏమిటి? డోవల్, ఢిల్లీ పోలీస్ చీఫ్ ఇంకా ఈ విషయంపై ఎందుకు మాట్లాడలేదు.? మౌలానా, అజిత్ దోవల్ మధ్య జరిగిన చర్చ ప్రజలకు తెలియజేయాలి “అని దేశ్‌ముఖ్ డిమాండ్ చేశారు. అంతేకాక “మళ్ళీ, డోవల్‌ను కలిసిన తరువాత మౌలానా ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు? అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు.? మౌలానాతో ఎన్ఎస్ఎకు ఎలాంటి సంబంధం ఉంది.?” అని మంత్రి ప్రశ్నించారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిజాముద్దీన్ మర్కజ్‌కు ఢిల్లీ పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారని ఆయన అడిగారు. “నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ తబ్లిఘి జమాత్ సంఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్నా కూడా పోలీసులు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఆపలేదు. ఈ సమావేశం వల్లే కరోనా వైరస్ ఇతర రాష్ట్రాలకు వ్యాప్తి చెందింది. ఈ ఘటనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పూర్తిగా బాధ్యత వహిస్తుందని దేశ్‌ముఖ్ ఆరోపించారు. అయితే ఈ విషయంపై మీడియా ఆయన్ని సంప్రదించాలని ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.

కాగా, ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ మర్కజ్ వల్ల దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఇప్పటివరకు దేశంలో 5734 కేసులు నమోదు కాగా.. అత్యధికంగా 1135 పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి.

For More News:

ధరలు పెంచితే ఏడేళ్ల జైలు.. నిత్యావసర వస్తు చట్టం అమలు..

ఆ మూడింటిని జూన్ వరకు బంద్ చేస్తారా..?

కరోనా కరాళ నృత్యం.. ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలు దాటిన కేసులు..

దేశంలో 6 వేలకు చేరుతున్న పాజిటివ్ కేసులు.. ఏయే రాష్ట్రంలో ఎలా ఉందంటే..

కోహ్లీ అంటే ఆస్ట్రేలియా క్రికెటర్లకు భయం..

మద్యం అమ్మకాలకు అనుమతివ్వండి.. 10 రాష్ట్రాల సీఎంలకు లేఖలు..

కరోనా కల్లోలం.. అమెరికాలో ఒక్క రోజులోనే 1,940 మంది మృతి..

‘పుష్ప’కు ఆరో వేలు.. అసలు ట్విస్ట్ ఇదేనా..

గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితుల మెనూ ఇదే…