గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితుల మెనూ ఇదే…
India Lockdown: కరోనా వైరస్.. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అటు పాజిటివ్ కేసులు కూడా గంటగంటకూ పెరుగుతున్నాయి. ఇక ఇండియాలో అయితే కరోనా వేగంగా విస్తరిస్తోంది. కేంద్రం లాక్ డౌన్ ప్రకటించినా కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రతను నియంత్రించడానికి ఇరు రాష్ట్రాల సీఎంలు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 348 […]
India Lockdown: కరోనా వైరస్.. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అటు పాజిటివ్ కేసులు కూడా గంటగంటకూ పెరుగుతున్నాయి. ఇక ఇండియాలో అయితే కరోనా వేగంగా విస్తరిస్తోంది. కేంద్రం లాక్ డౌన్ ప్రకటించినా కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రతను నియంత్రించడానికి ఇరు రాష్ట్రాల సీఎంలు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 348 కేసులు నమోదు కాగా.. తెలంగాణలో ఆ సంఖ్య 453కి చేరింది.
మరోవైపు కరోనా బాధితులు చికిత్స కోసం ఒకే గదిలో రెండు వారాలకుపైగా ఉండాల్సి వస్తుంది. దీని వల్ల కొందరు రోగులు మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురవుతారు. అలాంటివారికి మానసిక ధైర్యాన్ని చెప్పడమే కాకుండా సరైన పౌష్టిక ఆహారాన్ని ఇవ్వడం కూడా ఎంతో ముఖ్యం. ఈ క్రమంలోనే గాంధీ ఆసుపత్రి వైద్యులు కరోనా పాజిటివ్ రోగులకు మంచి పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ.. వారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
రోగుల్లో ఇమ్యునిటీ(వ్యాధినిరోధక శక్తి)ని పెంచే విధంగా వాళ్లు కోరుకున్న ఆహారం ఇస్తున్నామని డాక్టర్లు చెప్పారు. ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, చపాతీ, దోశ, పాలు, టీ, బ్రెడ్ ఇస్తుండగా.. లంచ్కు రైస్, 2 రకాల కూరలు, కోడిగుడ్డు, సాంబార్, పెరుగు.. అలాగే సాయంత్రం బాదంపప్పు, జీడిపప్పు, ఇతర పండ్లను ఇస్తున్నారు. ఇక డిన్నర్లో రైస్, చపాతీతో పాటు రోజుకు 4 లీటర్ల మినరల్ వాటర్ బాటిళ్లను అందజేస్తున్నామని గాంధీ డాక్టర్లు పేర్కొన్నారు.
For More News:
ధరలు పెంచితే ఏడేళ్ల జైలు.. నిత్యావసర వస్తు చట్టం అమలు..
ఆ మూడింటిని జూన్ వరకు బంద్ చేస్తారా..?
కరోనా కరాళ నృత్యం.. ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలు దాటిన కేసులు..
దేశంలో 6 వేలకు చేరుతున్న పాజిటివ్ కేసులు.. ఏయే రాష్ట్రంలో ఎలా ఉందంటే..
‘తబ్లీఘీ జమాత్’ ఘటన.. కేంద్రం, అజిత్ దోవల్పై మహారాష్ట్ర హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..
కోహ్లీ అంటే ఆస్ట్రేలియా క్రికెటర్లకు భయం..
మద్యం అమ్మకాలకు అనుమతివ్వండి.. 10 రాష్ట్రాల సీఎంలకు లేఖలు..