AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!

రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!

Phani CH
|

Updated on: Apr 25, 2024 | 8:15 PM

Share

భారత రైల్వే.. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతి రోజూ లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా భారత రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపడం, ఐఆర్‌సీటీసీలో సులభంగా టికెట్స్‌ లభించేలా వివిధ చర్యలు చేపడుతోంది రైల్వేశాఖ. అంతేకాకుండా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కూడా చర్యలు చేపడుతూనే ఉంది.

భారత రైల్వే.. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతి రోజూ లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా భారత రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపడం, ఐఆర్‌సీటీసీలో సులభంగా టికెట్స్‌ లభించేలా వివిధ చర్యలు చేపడుతోంది రైల్వేశాఖ. అంతేకాకుండా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కూడా చర్యలు చేపడుతూనే ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలం నుంచి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా వేసవి రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని IRCTCతో కలిసి తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ఎకానమీ మీల్స్‌ పేరుతో విజయవాడ రైల్వే అధికారులు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా జనరల్‌ బోగీల్లో ప్రయాణించే వారి కోసం బోగీల వద్దే నేరుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, రెండు రకాల భోజనాలను అందిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు

అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ??

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి !!

రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు

కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం