నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !! చివరికి ??

బంగారం, డైమండ్స్ స్మగ్లింగ్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు కేటుగాళ్లు. ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలతో అధికారులనే విస్మయానికి గురి చేస్తున్నారు. తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో… నూడుల్స్‌ ప్యాకెట్లలో దాచిన వజ్రాలను కస్టమ్స్ టీమ్ స్వాధీనం చేసుకుంది. అలాగే బ్యాగేజీ, శరీర భాగాల్లో ఉంచి.. అక్రమంగా తరలిస్తున్న గోల్డ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సొత్తు విలువ రూ.6.46 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !! చివరికి ??

|

Updated on: Apr 25, 2024 | 8:18 PM

బంగారం, డైమండ్స్ స్మగ్లింగ్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు కేటుగాళ్లు. ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలతో అధికారులనే విస్మయానికి గురి చేస్తున్నారు. తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో… నూడుల్స్‌ ప్యాకెట్లలో దాచిన వజ్రాలను కస్టమ్స్ టీమ్ స్వాధీనం చేసుకుంది. అలాగే బ్యాగేజీ, శరీర భాగాల్లో ఉంచి.. అక్రమంగా తరలిస్తున్న గోల్డ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సొత్తు విలువ రూ.6.46 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు గత వీకెండ్‌లో రూ.4.44 కోట్ల విలువైన 6.815 కేజీల గోల్డ్, రూ.2.02 కోట్ల విలువైన డైమండ్స్ స్వాధీనం చేసుకున్నామని, నలుగురు పాసింజర్స్‌ను అరెస్టు చేశామని సోమవారం రాత్రి అధికారులు వెల్లడించారు. ముంబై నుంచి బ్యాంకాక్‌ వెళుతున్న ఓ ఇండియాన్ బ్యాగేజీలోని నూడ్సుల్స్‌ ప్యాకెట్లలో డైమండ్స్ గుర్తించామని, అనంతరం ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. శ్రీలంక కేపిటల్ సిటీ కొలంబో నుంచి ముంబై వచ్చిన ఓ ఫారెన్ మహిళ తన లోదుస్తుల్లో గోల్డ్ దాచి పెట్టి తీసుకొస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆమె దగ్గర నుంచి 321 గ్రాముల బరువైన గోల్డ్ సీజ్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??

రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!

హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు

అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ??

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి !!

Follow us