కరోనాపై పోరు: టీటీడీ ఉదార భావం.. భారీ విరాళంతో పాటు..!

కరోనాపై ప్రభుత్వాలు చేస్తోన్న పోరుకు పలువురు ఆర్థికంగా సహకరిస్తున్నారు. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తమకు తోచినంత విరాళాలను ప్రభుత్వాలకు అందిస్తున్నారు.

కరోనాపై పోరు: టీటీడీ ఉదార భావం.. భారీ విరాళంతో పాటు..!
Follow us

| Edited By:

Updated on: Apr 07, 2020 | 9:09 AM

కరోనాపై ప్రభుత్వాలు చేస్తోన్న పోరుకు పలువురు ఆర్థికంగా సహకరిస్తున్నారు. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తమకు తోచినంత విరాళాలను ప్రభుత్వాలకు అందిస్తున్నారు. అంతేకాదు ఆధ్యాత్మిక సంస్థలు సైతం కరోనాపై పోరుకు తమ వంతు సహకారం అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ తిరుమల తిరుపతి దేవస్థానం ఏపీ ప్రభుత్వానికి భారీ విరాళాన్ని ప్రకటించింది. టీటీడీ తరఫున రూ. 19కోట్లు ఏపీ ప్రభుత్వానికి ఇస్తున్నట్లు టీటీడీ ఎగ్జిగ్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.

ఇప్పటికే రూ.8కోట్లు చిత్తూరు జిల్లా అధికారులకు ఇచ్చామని.. మరో రూ.11కోట్లను త్వరలో ఏపీ ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన అన్నారు. ఇక తిరుమలపై వస్తోన్న అసత్య ప్రచారాలను నమ్మకండని ఆయన కోరారు. భక్తులకు మాత్రమే దర్శనం లేదని.. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారికి జరగాల్సిన అన్ని పూజలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. అంతేకాదు ఆదివారం శ్రీవారికి వసంతోత్సవం కూడా జరిగినట్లు అనిల్ తెలిపారు.

మరోవైపు లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా మంది నిరాశ్రయులు అవ్వగా.. వారిని ఆదుకునేందుకు టీటీడీ రంగంలోకి దిగింది. వలస కూలీలతో పాటు యాచకులను ఆదుకునేందుకు రోజుకు లక్షా 20వేల ఫుడ్ ప్యాకెట్లను టీటీడీ అధికారులు పంపిణీ చేస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజన ప్యాకెట్లను వారికి అందించడం ద్వారా.. ఆకలితో అలమటిస్తోన్న వందల జీవితాలను వారు కాపాడుతున్నారు. లాక్‌డౌన్ ముగిసేవరకు తాము భోజన ప్యాకెట్లను పంపిణీ చేస్తామని టీటీడీకి సంబంధించిన ఓ అధికారి తెలిపారు. అంతేకాదు తిరుమల కొండపై ఉన్న విశ్రాంతి గృహాల్లోనూ కొంతమందికి ఆశ్రయం ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్: భారీగా తగ్గిన అంబానీ ఆస్తులు.. ఎంత తగ్గాయంటే..!