ఏపీ పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం.. క్వారంటైన్కు 25 మంది పోలీసులు..!
విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం రేగింది. ఇటీవల అనారోగ్యంతో ఉన్న మహిళను పోలీసులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం రేగింది. ఇటీవల అనారోగ్యంతో ఉన్న మహిళను పోలీసులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఆ సమయంలో నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కరోనా సోకినట్లు తేలింది. దీంతో మహిళలను ఆసుపత్రికి తరలించడంలో భాగస్వామ్యం అయిన 25 మంది పోలీసులను క్వారంటైన్కు తరలించారు.
మరోవైపు ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో 60 కొత్త కేసులు నమోదు కాగా.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 821కు చేరింది. కొత్తగా గుంటూరు జిల్లాలో 15, కర్నూలు జిల్లా 19, చిత్తూరు జిల్లా 6, కడప జిల్లా 5, ప్రకాశం జిల్లా 4, కృష్ణా జిల్లాలో 3, అనంతపురంలో 8కేసులు నమోదయ్యాయి. కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 25 మంది మృత్యువాతపడ్డారు.
Read This Story Also: లాక్డౌన్తో.. ప్రపంచం శుభ్రంగా.. అడవులు అందంగా..