AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSCHE: ఇక బీకాం, ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ఎంట్రీ-ఎగ్జిట్‌ విధానం.. ఉన్నతస్థాయి సిలబస్‌!

తెలంగాణ రాష్ట్రంలో బీకాం, బీబీఏ, ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ఎంట్రీ-ఎగ్జిట్‌ విధానం అమలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నతస్థాయికమిటీ సిఫారసు చేసింది. సిలబస్‌ను ఆధునికీకరించి, కొత్త పాఠ్య ప్రణాళికను అమలు చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిపుణుల కమిటీని నియమించింది..

TGSCHE: ఇక బీకాం, ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ఎంట్రీ-ఎగ్జిట్‌ విధానం.. ఉన్నతస్థాయి సిలబస్‌!
Higher Education In Telangana
Srilakshmi C
|

Updated on: Feb 27, 2025 | 9:46 AM

Share

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి బీకాం, బీబీఏ, ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ఎంట్రీ-ఎగ్జిట్‌ విధానం అమలు చేయనున్నారు. ఈ మేరకు ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు చేసింది. సిలబస్‌ను ఆధునికీకరించి, కొత్త పాఠ్య ప్రణాళికను అమలు చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీకి ఛైర్మన్‌గా బాలకిష్టారెడ్డి.. హెచ్‌సీయూ నుంచి బెల్లంకొండ రాజశేఖర్‌, ఓయూ నుంచి విద్యాధర్‌రెడ్డి, జేఎన్‌టీయూహెచ్‌ నుంచి సింధు, ఓయూ నుంచి అప్పారావు, ఎంజీయూ నుంచి రమేశ్‌కుమార్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కామర్స్‌-హైదరాబాద్‌ నుంచి ఎస్‌ రాజేశ్వర్‌రావు.. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

ఈ కమిటీ తొలి సమావేశం మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు చేశారు. కామర్స్, మేనేజ్‌మెంట్, లా కోర్సుల సిలబస్‌లో చేయాల్సిన మార్పులపై కమిటీ నివేదికను రూపొందించింది. ఏడాది తర్వాత పలు కారణాల వల్ల చదువు కొనసాగించలేకపోయినా.. మళ్లీ వీలున్నపుడు చేరేలా ఎంట్రీ-ఎగ్జిట్‌ విధానాన్ని కూడా అమలు చేయాలని సిఫారసు చేసింది. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది.

నేడు, రేపు జేఈఈ దరఖాస్తుల తప్పుల సవరణకు ఛాన్స్.. పరీక్షలు ఎప్పుడంటే?

జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2025 సెషన్‌ 2 ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ఫిబ్రవరి 25తో ముగిసిన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్స్‌ 2 ఆన్‌లైన్‌ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) గురు, శుక్రవారాల్లో (ఫిబ్రవరి 27, 28న) అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. ఇక జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పరీక్ష ఏప్రిల్‌ 1 నుంచి 8 మధ్య తేదీల్లో నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..