AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET PG 2024 Internship Cut-Off Date: నీట్‌ పీజీ ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ పొడిగింపుకు సుప్రీం ‘నో’

నీట్‌-పీజీ 2024 పరీక్షను జూన్‌ 23న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే నీట్‌-పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ను పొడిగించాలంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిధేశ్‌ అనే విద్యార్ధి సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే దీనిని విచారణకు తీసుకోవడానికి అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. దీనిపై వాదనలు విన్న చీఫ్‌ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కటాఫ్‌ను..

NEET PG 2024 Internship Cut-Off Date: నీట్‌ పీజీ ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ పొడిగింపుకు సుప్రీం 'నో'
NEET PG 2024 Internship Cut-Off Date
Srilakshmi C
|

Updated on: May 01, 2024 | 3:55 PM

Share

అమరావతి, మే 1: నీట్‌-పీజీ 2024 పరీక్షను జూన్‌ 23న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే నీట్‌-పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ను పొడిగించాలంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిధేశ్‌ అనే విద్యార్ధి సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే దీనిని విచారణకు తీసుకోవడానికి అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. దీనిపై వాదనలు విన్న చీఫ్‌ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కటాఫ్‌ను పొడిగించలేమని స్పష్టం చేసింది. దీనిపై సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని అనుమతిస్తూ ధర్మాసనం పిటిషనర్‌కు సూచించింది. కాగా ఈ ఏడాది నీట్‌-పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఆగస్టు 15వ తేదీని ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ తేదీగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.

రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కళాశాల ప్రవేశ పరీక్ష వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను జూన్ 8వ తేదీన నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో జూన్ 1న లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ పరీక్ష తేదీని జూన్‌ 1వ తేదీకి బదులుగా జూన్‌ 8వ తేదీకి వాయిదా వేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌ మైనారిటీ గురుకులాల్లో 2024-25 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీ నరసింహారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఐదో తరగతితోపాటు ఎనిమిదో తరగతి, జూనియర్ కాలేజీల్లో ఫస్ట్‌ ఇయర్‌కు కూడా ప్రవేశాలు కల్పించనున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు సంబంధిత పాఠశాల, కాలేజీల్లో మే 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌లో  ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఏపీ ప్రజల కోసం మరో వందే భారత్ ట్రైన్.. షెడ్యూల్ రిలీజ్
ఏపీ ప్రజల కోసం మరో వందే భారత్ ట్రైన్.. షెడ్యూల్ రిలీజ్
"ఇండస్ట్రీలో అబ్బాయిలను కూడా కమిట్‌మెంట్ అడుగుతారు"
గుడ్లను ఫ్రిజ్‌లో పెడితే పాడవుతాయా.. పుకార్లు కాదు వాస్తవాలు..
గుడ్లను ఫ్రిజ్‌లో పెడితే పాడవుతాయా.. పుకార్లు కాదు వాస్తవాలు..
తెలంగాణలోనూ 'అఖండ 2' సినిమా టిక్కెట్‌ ధరలు భారీగా పెంపు..
తెలంగాణలోనూ 'అఖండ 2' సినిమా టిక్కెట్‌ ధరలు భారీగా పెంపు..
ఆన్‌లైన్‌లో ఆఫర్లు చూసి హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకుంటున్నారా..?
ఆన్‌లైన్‌లో ఆఫర్లు చూసి హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకుంటున్నారా..?
'రాహుల్ గాంధీకి ఎన్నికల వ్వవస్థపై అవగాహన లేదు'
'రాహుల్ గాంధీకి ఎన్నికల వ్వవస్థపై అవగాహన లేదు'
కల్యాణ్ మా కులపోడే.. కన్నడ అమ్మాయి బిగ్ బాస్ కప్పు కొట్టకూడదు..
కల్యాణ్ మా కులపోడే.. కన్నడ అమ్మాయి బిగ్ బాస్ కప్పు కొట్టకూడదు..
మీరు వాడే నెయ్యి స్వచ్ఛతపై అనుమానం ఉందా.? ఇలా చెయ్యండి..
మీరు వాడే నెయ్యి స్వచ్ఛతపై అనుమానం ఉందా.? ఇలా చెయ్యండి..
అద్దె కోసమని వచ్చారు.. ఆ తర్వాతే అసలు పని కానిచ్చారు
అద్దె కోసమని వచ్చారు.. ఆ తర్వాతే అసలు పని కానిచ్చారు
75 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. ఐక్యతకు నిదర్శనం ఈ చర్చి..ధ్వజ స్తంభం..
75 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. ఐక్యతకు నిదర్శనం ఈ చర్చి..ధ్వజ స్తంభం..