AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC DyEO Merit List: ఏపీపీఎస్సీ డిప్యూటీ ఈవో పోస్టులకు 1:100 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 38 పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ వెలువరించగా తాజాగా నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెలువరించింది. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేసింది. మొత్తం 3,957 మంది అభ్యర్ధులు మెయిన్‌ పరీక్షకు ఎంపికయ్యారు..

APPSC DyEO Merit List: ఏపీపీఎస్సీ డిప్యూటీ ఈవో పోస్టులకు 1:100 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడి
APPSC DEO Merit List
Srilakshmi C
|

Updated on: Jun 28, 2024 | 3:39 PM

Share

అమరావతి, జూన్‌ 28: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 38 పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ వెలువరించగా తాజాగా నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెలువరించింది. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేసింది. మొత్తం 3,957 మంది అభ్యర్ధులు మెయిన్‌ పరీక్షకు ఎంపికయ్యారు. మెరిట్‌ జాబితాను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఏపీ డిప్యూటీ ఈవో ప్రిలిమినరీ పరీక్ష మెరిట్ జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఏపీ లాసెట్ 2024 ఫలితాల్లో టాపర్లు వీరే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ వివిధ లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్, పీజీ లా సెట్‌ ఫలితాలు గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. లాసెట్‌ ఫలితాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రెక్టార్‌ ప్రొఫెసర్‌ వరప్రసాదమూర్తి విడుదల చేశారు. మొత్తం 19,224 మంది అభ్యర్ధులు పరీక్ష రాయగా.. వీరిలో 17,117 మంది ఉత్తీర్ణత సాధించినట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ తెలిపారు. తాజా ఫలితాల్లో మూడేళ్ల లా కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్‌ పరీక్షలో తిరుపతి జిల్లాకు చెందిన యామల కృష్ణ చైతన్య 104 మార్కులతో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించాడు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన హర్షవర్ధన్‌ రాజు 103లతో రెండో ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చెల్లుబోయిన రేవంత్‌రాయ్‌ 98 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు.

ఇవి కూడా చదవండి

ఇక ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన పీజీలాసెట్‌ విజయనగరం జిల్లాకు చెందిన కుసుమ అగర్వాల్‌ 92 మార్కులతో తొలి ర్యాంకు, తెలంగాణలోని మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన విజయనందిని 91 మార్కులతో సెకండ్‌ ర్యాంకు, ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన విజయ ఆదిత్య 88 మార్కులతో థార్డ్‌ ర్యాంకు సాధించారు. రెండేళ్ల పీజీ విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన అభినీత్‌ జాసన్‌ 96 మార్కులతో తొలి ర్యాంకు, గుంటూరు జిల్లాకు చెందిన నూకల దీప్తి 95 మార్కులతో రెండో ర్యాంకు, ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన నువ్వుల జాహ్నవి 94 మార్కులతో మూడో ర్యాంకులు సాధించారు.

ఆంధ్రప్రదేశ్‌ లాసెట్, పీజీలాసెట్‌-2024 ర్యాంకు కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?