AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నాలుగేళ్ల బిడ్డతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య.. ఏం జరిగిందో?

జగిత్యాల జిల్లాలో ఘోర విషాదం జరిగింది. ఏం కష్టం వచ్చిందో ఏమోగానీ నాలుగు యేళ్ల కూతురుతో కలిసి ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘట జగిత్యాల జిల్లాసారంగాపూర్ మండలం అర్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్పల్లి గ్రామానికి చెందిన బొండ్ల మౌనిక అనే వివాహిత నాలుగేళ్ల కూతురితో కలిసి బుధవారం రాత్రి ఊరిలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య..

Telangana: నాలుగేళ్ల బిడ్డతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య.. ఏం జరిగిందో?
Telangana Crime
Srilakshmi C
|

Updated on: Jun 27, 2024 | 8:36 PM

Share

జగిత్యాల, జూన్‌ 27: జగిత్యాల జిల్లాలో ఘోర విషాదం జరిగింది. ఏం కష్టం వచ్చిందో ఏమోగానీ నాలుగు యేళ్ల కూతురుతో కలిసి ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘట జగిత్యాల జిల్లాసారంగాపూర్ మండలం అర్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్పల్లి గ్రామానికి చెందిన బొండ్ల మౌనిక అనే వివాహిత నాలుగేళ్ల కూతురితో కలిసి బుధవారం రాత్రి ఊరిలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో తీవ్రంగా మనస్థాపం చెందిన మౌనిక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో గురువారం ఉదయం మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. మృతురాలు మౌనిక భర్తను పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరో ఘటన.. బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతంతో తల్లీ, కొడుకు మృతి!

ఆంధ్రప్రదేశ్‌ ఏలూరు జిల్లాలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం జరిగి తల్లికొడుకు మృతి చెందారు. జిల్లాలోని ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గురువారం తడి బట్టలు తీగలపై ఆరేస్తుండగా పొరబాటున కరెంట్ వైర్లకు తడి బట్టలు తగిలాయి. దీంతో తల్లీ దొండపాటి నాగరత్నం, ఆమె కుమారుడు రామదాసు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పల్నాడు జిల్లాలో మరో ఘటన.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

పల్నాడు జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వినుగొండ మండలం కొత్తపాలెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టడంతో.. అందులో ఈ విషాదం జరిగింది. కారులో గుంటూరు జిల్లా లక్ష్మీపురానికి చెందిన టీటీడీ విశ్రాంత ఉద్యోగి సోమసి బాలగంగాధర్‌ శర్మ కుటుంబం ప్రయాణిస్తుంది. కర్ణాటకలోని బళ్లారి నుంచి గుంటూరుకు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాలగంగాధర్‌ శర్మ, ఆయన భార్య యశోద, కారు డ్రైవర్‌ మృతి చెందగా.. బాల గంగాధర్‌ శర్మ కుమారుడు హెచ్‌ఎస్‌వై శర్మ, ఆయన భార్య నాగ సంధ్య, వీరి పిల్లలు కార్తిక్‌, అనుపమ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
దుష్టులతో వాదనలు వద్దు... దూరంగా ఉండటమే తెలివి!
దుష్టులతో వాదనలు వద్దు... దూరంగా ఉండటమే తెలివి!
వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే!
వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే!