AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Scheme: గర్భిణీ స్త్రీలకు రూ.25 వేలు.. ఆ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకం

గర్భిణులు, నవజాత శిశువుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ పథకాల ప్రయోజనం వారికి ఆర్థిక సహాయం అందించడానికి అమలు చేస్తున్నాయి..

Women Scheme: గర్భిణీ స్త్రీలకు రూ.25 వేలు.. ఆ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకం
Women Scheme
Subhash Goud
|

Updated on: Feb 19, 2023 | 12:36 PM

Share

గర్భిణులు, నవజాత శిశువుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ పథకాల ప్రయోజనం వారికి ఆర్థిక సహాయం అందించడానికి అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం పేద శ్రామిక మహిళల కోసం ఒక అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పేరు మాతృత్వ శిశు ఏవం బాలికా మదద్ యోజన. ఇందులో గర్భిణులకు రూ.25 వేలు ఆర్థిక సాయం అందుతుంది. ఈ పథకంలోని ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.

మహిళలు, నవజాత శిశువుల ప్రయోజనం కోసం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలోని నిరుపేద మహిళలకు, గర్భిణులు లేదా ఇటీవలే ప్రసవించిన లేదా భవిష్యత్తులో ప్రసవించబోతున్న వారి కోసం ఈ పథకం ప్రారంభించింది. మాతృత్వ శిశు, బాలికా మదద్ యోజన ఉద్దేశ్యం ప్రసవానికి ముందు, తరువాత మహిళలకు విశ్రాంతినిచ్చే ఉద్దేశ్యంతో వారికి ఆర్థిక సహాయం అందించడం.

ఎఫ్‌డీ సౌకర్యం అందుబాటులో..

ఈ పథకంలో మహిళకు ఆడపిల్ల పుడితే రూ.25వేలు, కొడుకు పుడితే రూ.20వేలు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందజేస్తారు. ప్రభుత్వ ఉద్యోగిరాలై ఏదైనా కారణంగా అబార్షన్‌ అయితే రెండు నెలల జీతం ఇవ్వనుంది. మొదటి లేదా రెండవ సంతానం ఆడపిల్ల అయితే, లేదా బిడ్డను దత్తత తీసుకున్నట్లయితే రూ.25,000 సహాయం కూడా అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు మీరు ఈ డబ్బును FDలో కూడా పొందవచ్చు. ఇందులో కనీసం 3 నెలల జీతం కూడా మెడికల్ మొత్తంగా ఇస్తారు.

ఇవి కూడా చదవండి

మీరు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, మీరు తప్పనిసరిగా ఉత్తరప్రదేశ్ పౌరులై ఉండాలి. ఇందులో మహిళా దరఖాస్తుదారు వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. నమోదు చేసుకున్న కార్మిక మహిళలు ప్రయోజనాలు పొందుతారు. ఈ పథకంలో 2 మంది పిల్లల వరకు మాత్రమే ఆర్థిక సహాయం పొందవచ్చు.

ఈ పథకం పొందాలంటే ఎలాంటి పత్రాలు కావాలి?

ఈ ప్లాన్‌లో మీ దగ్గర కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉండాలి. ఈ పథకంలో దరఖాస్తు కోసం బ్యాంక్ పాస్ పుస్తకం, నమోదిత గుర్తింపు కార్డు, పిల్లల (అబ్బాయి/అమ్మాయి) జనన ధృవీకరణ పత్రం, లేబర్ కార్డ్, ఆధార్ కార్డుతో పాటు మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికేట్, అంగన్‌వాడీ ప్రోగ్రామ్ ఇచ్చిన రిజిస్ట్రేషన్ అవసరం.

ఇలా దరఖాస్తు చేసుకోండి

మీరు ఈ పథకంలో దరఖాస్తు చేయాలనుకుంటే, ముందుగా మీరు దాని అధికారిక వెబ్‌సైట్ https://upbocw.in/index.aspx కి వెళ్లండి . ఇక్కడ మీరు స్కీమ్ కామన్ అప్లికేషన్ ఫారమ్‌పై క్లిక్ చేయాలి. దీని తర్వాత ఫారమ్ పీడీఎఫ్‌ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి. ఆ తర్వాత జాగ్రత్తగా నింపండి. మీరు ఫారమ్‌తో అవసరమైన అన్ని పత్రాలను జతచేయాలి. మీ ఫారమ్ పూర్తి అయినప్పుడు, దానిని సంబంధిత విభాగానికి సమర్పించండి. మీరు ఫారమ్‌ను సమర్పించినప్పుడు, కొన్ని రోజుల తర్వాత మీరు దాని ప్రయోజనాన్ని పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి