Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Holiday: సంచలన నిర్ణయం.. వారం రోజుల పాటు పాఠశాలలకు సెలవులు

అసలు దేశ వ్యాప్తంగా వర్షాలు దించికొడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఎఫెక్ట్‌ ఇంకా చూపుతోంది. దీంతో భారీ వర్షాల ధాటికి కొన్ని రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కారణంగా పాఠశాలలు మూసివేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇక తెలుగు రాష్ట్రాల్లో..

School Holiday: సంచలన నిర్ణయం.. వారం రోజుల పాటు పాఠశాలలకు సెలవులు
School Holiday
Follow us
Subhash Goud

|

Updated on: Jul 24, 2024 | 9:12 AM

అసలు దేశ వ్యాప్తంగా వర్షాలు దించికొడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఎఫెక్ట్‌ ఇంకా చూపుతోంది. దీంతో భారీ వర్షాల ధాటికి కొన్ని రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కారణంగా పాఠశాలలు మూసివేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగానే వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలను వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ ధీరజ్ సింగ్ మంగళవారం ఈ సమాచారాన్ని అందించారు. అయితే కన్వర్ యాత్ర మార్గంలో వచ్చే అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కళాశాలలను మాత్రమే జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఉత్తారఖండ్‌లో కూడా వర్షాలు బాగానే ఉన్నాయి.

ఈ ఏడాది కన్వర్ యాత్రకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని డీఎం తెలిపారు. హరిద్వార్‌లోని వివిధ వాహనాల్లో ప్రధాన రహదారుల గుండా గంగాజలాన్ని సేకరించడానికి పెద్ద సంఖ్యలో శివ భక్తులు ఇక్కడికి వస్తారు. అన్ని కన్వార్ రూట్లలో ఇంత రద్దీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Gold Price Today: నిర్మలా సీతారామన్ దెబ్బకు బంగారం ధర ఢమాల్.. మరీ ఇంతలానా..?

ఇవి కూడా చదవండి

పశ్చిమ ఉత్తరప్రదేశ్ నలుమూలల నుండి లక్షలాది మంది కన్వర్ యాత్రికులు గంగాజల్‌ను సేకరించడానికి హరిద్వార్‌కు వస్తారు. సహారన్‌పూర్, ఘజియాబాద్, హాపూర్, మీరట్, బాగ్‌పట్, ముజఫర్‌నగర్‌తో సహా అన్ని జిల్లాల రోడ్లపై కన్వర్ యాత్రికుల జాతర ఉంది. కన్వర్ ఫెయిర్ దృష్ట్యా, ఢిల్లీ మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, మీరట్ హైవేతో సహా అన్ని రోడ్లపై రూట్ డైవర్షన్ కూడా చేశారు.

ఇది కూడా చదవండి: Budget 2024: ఐదు కిలోల ఉచిత రేషన్ గడువు పెంపు.. ఎందుకో తెలుసా?

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి