Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ప్రయాణికుల నుంచి రూ.80 వేల కోట్లు సంపాదించిన రైల్వే.. ఎలాగో తెలుసా?

Indian Railways: భారత రైల్వే ఆదాయం పెరిగిపోతోంది. వివిధ మార్గాల ద్వారా రైల్వే ఆదాయం రికార్డు స్థాయిలో వస్తోంది. ప్రయాణికుల నుంచి లక్షల కోట్ల రూపాయల వరకు మన రైల్వేకు వస్తోంది. భారతదేశంలో వందే భారత్ వంటి ప్రీమియం రైళ్ల సంఖ్య గత కొన్ని సంవత్సరాలుగా పెరిగింది..

Indian Railways: ప్రయాణికుల నుంచి రూ.80 వేల కోట్లు సంపాదించిన రైల్వే.. ఎలాగో తెలుసా?
Follow us
Subhash Goud

|

Updated on: Feb 03, 2025 | 8:18 PM

భారతదేశంలో వందే భారత్ వంటి ప్రీమియం రైళ్ల సంఖ్య గత కొన్ని సంవత్సరాలుగా పెరిగింది. ఈ పెంపుతో రైల్వేలే అత్యధికంగా లబ్ధి పొందుతున్నాయి. గత కొన్నేళ్లుగా రైల్వే ఆదాయాలు పెరిగాయి. అందులో ప్యాసింజర్ రైళ్ల సహకారం కూడా పెరిగింది. ఇది కాకుండా ప్రీమియం తత్కాల్ వంటి సేవల వల్ల రైల్వే ఆదాయాలు పెరిగాయి. 2022లో 80 రైళ్లకు ప్రీమియం తత్కాల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా రైల్వే రూ. 500 కోట్లు ఆర్జించింది. వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లకు డిమాండ్ పెరగడం వల్ల 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ రైళ్ల ఆదాయం సుమారు రూ.92,800 కోట్లకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో పాటు రైల్వేల నికర ఆదాయం కూడా పెరగనుందని అంచనా.

2018-19 నుంచి 2022-23 వరకు ఫ్లెక్సీ ఛార్జీలు, తత్కాల్, ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల ద్వారా రైల్వే తన మొత్తం ఆదాయంలో 5 శాతం పొందిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. తత్కాల్ టిక్కెట్లపై ఛార్జీలు కూడా మారుతూ ఉంటాయి. స్లీపర్ క్లాస్ కోసం ఇది రూ. 100-200 వరకు ఉంటుంది. అదే సమయంలో ఏసీ చైర్‌కార్‌కు రూ.125 నుంచి రూ.225, ఏసీ 3 టైర్‌కు రూ.300-400, ఏసీ 2 టైర్‌కు రూ.400-500, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు రూ.400 నుంచి రూ.500 వరకు ఉండవచ్చు.

నికర ఆదాయాలు రెట్టింపు అవుతాయని అంచనా:

2025-26లో రైల్వే నికర ఆదాయం రెండింతలు పెరిగి రూ.3,041.3 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తోంది. రానున్న రోజుల్లో ప్రయాణికులు, సరుకు రవాణా రద్దీ పెరగడమే ఈ పెరుగుదల వెనుక కారణం. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్‌లో రైల్వే నిధులను ప్రభుత్వం ఉంచింది. అయితే మొదటిసారిగా రూ.3 లక్షల కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని, దీనివల్ల రైల్వే ఆదాయాలు మెరుగుపడతాయని అంచనా.

200 వందే భారత్‌ రైళ్లు

100 కొత్త అమృత్ భారత్ రైళ్లు, 50 నమో భారత్ రైళ్లు, స్లీపర్, చైర్ కార్ వెర్షన్‌లతో సహా దాదాపు 200 వందే భారత్ రైళ్లు తయారు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ బడ్జెట్‌లో రూ. 4.6 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేర్చామని చెప్పారు. చాలా చోట్ల కొత్త లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, నాలుగింతలు ట్రాక్‌ల అవసరం ఉన్నందున ఇది చాలా పెద్ద విషయమని ఆయన అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీకూ కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం సమస్యలు ఉన్నాయా?
మీకూ కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం సమస్యలు ఉన్నాయా?
అయ్యబాబోయ్..నాగార్జున అసలు పేరు ఇది కాదా..షాకింగ్ సీక్రెట్ రివీల్
అయ్యబాబోయ్..నాగార్జున అసలు పేరు ఇది కాదా..షాకింగ్ సీక్రెట్ రివీల్
ఇంత సింపుల్ లుక్‌లో అంత అందంగా ఎలా ఉన్నావు భాను..క్యూట్ ఫొటోస్
ఇంత సింపుల్ లుక్‌లో అంత అందంగా ఎలా ఉన్నావు భాను..క్యూట్ ఫొటోస్
పాకిస్థాన్‌ దిగజారినా.. హుందాగా బదులిచ్చిన టీమిండియా!
పాకిస్థాన్‌ దిగజారినా.. హుందాగా బదులిచ్చిన టీమిండియా!
తల్లిగా నటించిన హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..చివరకు
తల్లిగా నటించిన హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..చివరకు
సాయి పల్లవికి క్రేజీ అనుభవం.. అందరి ముందే ముద్దు పెట్టిన ఫ్యాన్
సాయి పల్లవికి క్రేజీ అనుభవం.. అందరి ముందే ముద్దు పెట్టిన ఫ్యాన్
రూ.100 కోట్లు దాటేసిన తండేల్.. కాలర్ ఎగరేసిన హీరో
రూ.100 కోట్లు దాటేసిన తండేల్.. కాలర్ ఎగరేసిన హీరో
కాసులు కురిపించే స్కీమ్‌.. ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే కోటీశ్వరులే..
కాసులు కురిపించే స్కీమ్‌.. ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే కోటీశ్వరులే..
సామాన్యుడి కారు ధరకు రెక్కలు.. రేటు పెంచేసి షాక్ ఇచ్చిన కంపెనీ
సామాన్యుడి కారు ధరకు రెక్కలు.. రేటు పెంచేసి షాక్ ఇచ్చిన కంపెనీ
సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా లోన్‌ పొందండి!
సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా లోన్‌ పొందండి!