May 13, 2026
Subhash
బంగారం, వెండి కొనుగోలుదారులకు ఇది బ్యాడ్న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే బంగారం, వెండి రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి.
ప్రస్తుతం వార్త రాసే సమయానికి 10 గ్రాముల బంగారంపై 8 వేలకుపైగా పెరిగింది. అదే వెండిపై 20 వేల రూపాయల వరకు పెరిగింది.
అయితే మే 13న ఉదయం తులంపై ఏకంగా 13 వేల వరకు పెరిగింది. కానీ మధ్యాహ్నం సమయానికి కాస్త తగ్గి రూ.8 వేల వరకు పెరుగుదల ఉంది.
ప్రస్తుతం హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,62,000 రూపాయల వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,48,500 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
ఇదే ధర ముంబై, కోల్కతా, బెంగళూరులలో కొనసాగుతోంది. ఇక్కడ కూడా తులం బంగారం ధర 1,62,000 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో అయితే కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,62,150 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,48,650 రూపాయల వద్ద కొనసాగుతోంది.
వెండి ధర 20 వేల రూపాయలు పెరిగిన తర్వాత కిలో వెండి హైదరాబాద్లో 3,30,000 రూపాయల వద్ద కొనసాగోతోంది. అదే ఇతర ప్రాంతాల్లో 3,10,000 రూపాయల వద్ద కొనసాగుతోంది.
కేంద్రం బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని భారీగా పెంచిన తర్వాత ఒక్కసారిగా ఈ ధరల్లో మార్పులు వచ్చింది. దీంతో కొనుగోలుదారులకు భారమనే చెప్పాలి.