రైల్వే ట్రాక్ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
రైల్వే ట్రాక్ పక్కన రైతులు చేసిన పనికి అరగంటపాటు రైలు నిలిచిపోయింది. రైల్వే పక్కన ఉన్న పొలాల్లో రైతులు పంట వ్యర్ధాలను తగులబెట్టడంతో మంటలు పెద్దగా ఎగసిపడి రైల్వే ట్రాక్ మొత్తం దట్టంగా పొగ కమ్మేసింది. దీంతో రైలును నిలిపివేశారు లోకో పైలట్. వరంగల్ జిల్లా ఎలుగూరు - నెక్కొండ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న ఎండిన పొలాలకు రైతులు నిప్పు పెట్టడంతో, మంటలు ఒక్కసారిగా రైల్వే ట్రాక్ వరకు వ్యాపించాయి.
పొలాల నుంచి ఎగసిపడిన మంటలు, దట్టమైన పొగ ట్రాక్ను కమ్మేయడంతో లోకోపైలట్ అప్రమత్తమయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన అధికారులు సికింద్రాబాద్ నుండి భద్రాచలం వెళ్తున్న కాకతీయ ఎక్స్ప్రెస్ను సుమారు 30 నిమిషాల పాటు అక్కడే నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు తగ్గుముఖం పట్టిన తర్వాత రైల్వే ట్రాక్ సురక్షితంగా ఉందని నిర్ధారించుకున్నాక రైలును తిరిగి పంపించారు. రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే ట్రాక్ పక్కన పొలాల్లో వ్యర్థాలను తగులబెట్టడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలు రైలు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని పోలీసులు హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం :
మరో సీజన్ ప్లాన్ చేస్తోన్న..మనీ హెయిస్ట్
షూటింగ్ అప్డేట్స్.. ఏ హీరో ఎక్కడ ఉన్నాడంటే?
ఏంటీ ? వీళ్ల మధ్య ఉన్నది భార్య భర్తల బంధం కాదా?
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

