మరో సీజన్ ప్లాన్ చేస్తోన్న..మనీ హెయిస్ట్
ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఇండియాలో విశేష ఆదరణ పొందిన వెబ్ సిరీస్ మనీ హెయిస్ట్. ఐదో సీజన్ సెన్సేషన్ సృష్టించిన తర్వాత, మేకర్స్ "The world of Money Heist continues" అంటూ టీజర్ రిలీజ్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇది పాత కథనానికి కొనసాగింపా లేక కొత్త ప్రపంచమా అనే దానిపై స్పష్టత లేకపోవడంతో, ఫ్యాన్స్ తదుపరి అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గ్లోబల్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న సూపర్ హిట్ వెబ్ సిరీస్ మనీ హెయిస్ట్. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ షోకు ఇండియాలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. కోవిడ్ సమయంలో ఇండియన్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిన మనీ హెయిస్ట్, ఐదు సీజన్లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా సీజన్ ఫైవ్ ను రెండు వాల్యూమ్స్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రిలీజ్ సమయంలో కార్పొరేట్ కంపెనీలు ఏకంగా హాలిడే ప్రకటించాయంటే దాని క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.గ్లోబల్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసిన మనీ హెయిస్ట్ సీజన్ ఫైవ్ ను ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్ లోనూ స్ట్రీమ్ చేశారు. దీంతో లోకల్ ఆడియన్స్ కూడా ప్రొఫెసర్ పాత్రకు గ్రాండ్ గా సెండాఫ్ ఇచ్చారు. తాజాగా మనీ హెయిస్ట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్.
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు
ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !
ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు
భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పాము..
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత

