AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic Price: కన్నీళ్లు పెట్టిస్తున్న వెల్లుల్లి ధర.. రికార్డ్‌ స్థాయిలో పరుగులు

దేశంలోనే అతిపెద్ద వెల్లుల్లి మార్కెట్‌లలో ఒకటైన గుజరాత్‌లోని జామ్‌నగర్ మండిలో శనివారం కిలో వెల్లుల్లి టోకు ధర రూ.300 నుంచి రూ.350కి చేరుకోగా, గత కొద్దిరోజులుగా కిలో రూ.350పైగా పెరిగింది. దేశంలోని వివిధ మార్కెట్లలో దీని రిటైల్ ధరలు కిలో రూ.500 నుంచి రూ.550కి చేరాయి. పెరుగుతున్న వెల్లుల్లి ధరలు సామాన్య ప్రజల వంటగది బడ్జెట్‌పై ప్రభావం చూపుతోంది. అదే సమయంలో ఇది రెస్టారెంట్ యజమానులపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతోంది. దీనికి విరుద్ధంగా దేశంలోనే..

Garlic Price: కన్నీళ్లు పెట్టిస్తున్న వెల్లుల్లి ధర.. రికార్డ్‌ స్థాయిలో పరుగులు
Garlic Price
Subhash Goud
|

Updated on: Feb 18, 2024 | 6:41 AM

Share

ఎన్నికలకు ముందు ఈసారి ద్రవ్యోల్బణంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. ఇది వరకు ఉల్లి ధర కన్నీళ్లు పెట్టిస్తుండగా, ఇప్పుడు వెల్లుల్లి ధరతో సతమతమవుతున్నారు. ధరల్లో వెల్లుల్లి సరికొత్త రికార్డు సృష్టించింది. రిటైల్ మార్కెట్‌లో ఉల్లి ధర రూ.30 నుంచి రూ.40 మధ్యలో ఉండగా, ప్రస్తుతం వెల్లుల్లి ధర రూ.550 దాటింది. హోల్‌సేల్‌ మార్కెట్‌లో కూడా కిలో వెల్లుల్లి ధర రూ.350కి పైగా పలుకుతోంది. సామాన్యులు తమ రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని ఉపయోగిస్తారు. ఫార్మా పరిశ్రమలో కూడా దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. వెల్లుల్లి నూనె దాదాపు అన్ని నొప్పులను తగ్గించే బామ్స్, ఇతర వాటిలో ఉపయోగిస్తుంటారు. భారతదేశంలో గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వెల్లుల్లి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.

టోకు ధర రూ.350 దాటింది:

దేశంలోనే అతిపెద్ద వెల్లుల్లి మార్కెట్‌లలో ఒకటైన గుజరాత్‌లోని జామ్‌నగర్ మండిలో శనివారం కిలో వెల్లుల్లి టోకు ధర రూ.300 నుంచి రూ.350కి చేరుకోగా, గత కొద్దిరోజులుగా కిలో రూ.350పైగా పెరిగింది. దేశంలోని వివిధ మార్కెట్లలో దీని రిటైల్ ధరలు కిలో రూ.500 నుంచి రూ.550కి చేరాయి. పెరుగుతున్న వెల్లుల్లి ధరలు సామాన్య ప్రజల వంటగది బడ్జెట్‌పై ప్రభావం చూపుతోంది. అదే సమయంలో ఇది రెస్టారెంట్ యజమానులపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతోంది. దీనికి విరుద్ధంగా దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్‌ అయిన లాసల్‌గావ్‌లో టోకు ఉల్లి ధరలు క్వింటాల్‌కు రూ.100 నుంచి రూ.200 వరకు మాత్రమే స్వల్పంగా పెరిగాయి. ఇక్కడ టోకు ఉల్లి ధర కిలో రూ.15కు మాత్రమే ఉంది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రోజువారీ ధరల పర్యవేక్షణ డేటా ప్రకారం.. ఢిల్లీ రిటైల్ మార్కెట్‌లో ఉల్లి ధరలు కిలోకు రూ.30గా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఉల్లి ధరలను నియంత్రించేందుకు రెండు నెలల క్రితం ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో మండీల్లో పంటకు గిట్టుబాటు ధర రావడంతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనేక రాష్ట్రాల రైతులు ఢిల్లీకి పాదయాత్రలు చేస్తుండగా, మహారాష్ట్రకు చెందిన ఉల్లి రైతులు కూడా వారితో చేరుతున్నారు. అయితే ఢిల్లీ వెలుపల శంభు సరిహద్దు సమీపంలో ప్రభుత్వం రైతులను నిలిపివేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి