AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ampere EV Scooter: బడ్జెట్ ప్రియులకు గుడ్‌న్యూస్.. లైసెన్స్ లేకపోయినా రోడ్లపై రయ్..రయ్..!

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు సౌకర్యంగా ఉండే ఈవీ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు అనువుగా ఉండే సూపర్ ఈవీలను అన్ని కంపెనీలు లాంచ్ చేస్తున్నాయి. వారి కొనుగోలు శక్తి మేరకు అందుబాటులో ఉండే ధరల్లో ఈ ఈవీలను లాంచ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఆంపియర్ రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేని కొత్త ఈవీ లాంచ్ చేసింది. ఆంపియర్ కంపెనీ లాంచ్ చేసిన ఈవీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Ampere EV Scooter: బడ్జెట్ ప్రియులకు గుడ్‌న్యూస్.. లైసెన్స్ లేకపోయినా రోడ్లపై రయ్..రయ్..!
Reo 80
Nikhil
|

Updated on: Apr 11, 2025 | 4:28 PM

Share

ఆంపియర్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ భారతదేశంలో రియో 80 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ తక్కువ-స్పీడ్ ఈ-స్కూటర్ బ్రాండ్‌కు సంబంధించి ప్రస్తుత ఫ్లాగ్ప్‌పై రియోను అప్‌డేట్ చేస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 25 కి.మీ/గం వేగాన్ని చేరుకుంటుంది. రియో 80 ఎక్స్-షోరూమ్ ధర రూ. 59,900 వద్ద ప్రవేశ పెట్టాు. ఈ స్కూటర్ కొనుగోలుకు ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యారు. ఈ స్కూటర్ డెలివరీలు ఈ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

రియో 80 ఒకసారి ఛార్జ్ చేస్తే 80 కిలో మీటర్ల రేంజ్ ని అందిస్తుంది. ఈ స్కూటర్ ఎల్ఎఫ్‌పీ బ్యాటరీతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కలర్ ఎల్‌సీడీ క్లస్టర్, కీలెస్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్‌ ఆకట్టకుంటాయి. ఆంపియర్ రియో 80లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. అలాగే ఈ-స్కూటర్ నాలుగు రంగులలో లభిస్తుంది. నలుపు, ఎరుపు, నీలం, తెలుపు. రియో 80 తక్కువ వేగవంతమైన ఈ-స్కూటర్ కాబట్టి దీన్ని నడపడానికి మీకు లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

ఆంపియర్ రియో 80 స్కూటర్ ఆవిష్కరణ గురించి గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ కె. విజయ కుమార్ మాట్లాడుతూ ఆంపియర్‌లో హార్ గల్లీ ఎలక్ట్రిక్‌ని ప్రారంభించాలనే దార్శనికతతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. సరికొత్త ఆంపియర్ రియో 80ని ప్రారంభించడంతో భారతదేశంలోని కస్టమర్లకు ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. ప్రతి రైడర్, వారి బడ్జెట్ లేదా అవసరంతో సంబంధం లేకుండా ఆంపియర్ నుంచి సురక్షితమైన, నమ్మదగిన, స్మార్ట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎంపికను అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు వివరించారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి