June 09, 2026
Subhash
దేశవ్యాప్తంగా లక్షల మంది వాహనదారులకు ఊరట కల్పించేలా కేంద్రప్రభుత్వం కీలక ఆలోచన చేస్తోంది. ఇది డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి శుభార్తే.
ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు గడువు 20 ఏళ్ల వరకు ఉంటుంది. అయితే దీనిని 20 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది కేంద్ర ప్రభుత్వం.
అదే జరిగితే డ్రైవింగ్ లైసెన్స్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఏకంగా 50 ఏళ్ల వరకు చెల్లుబాటులో ఉంటుంది.
డ్రైవింగ్ లైసెన్స్ కాలపరిమితితో పాటు మరిన్ని ప్రతిపాదనలు రహదారి మంత్రిత్వశాఖ పరిశీలనలో ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా సమాచారం.
ప్రస్తుతం ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే 20 ఏళ్ల వరకు మాత్రమే చెల్లబాటు అయ్యేలా జారీ చేస్తు్న్నారు. ఆపై అవసరమైన పత్రాలు సమర్పించి లైసెన్స్ను రెన్యువల్ చేయించుకోవాలి.
కొన్ని సందర్భాల్లో వైద్య ధ్రువీకరణ పత్రం కూడా అవసరం పడుతుంది. ఈ క్రమంలోనే కాలపరిమితిని 50 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
దీనివల్ల రెన్యువల్పై రావాల్సిన ఆదాయం తగ్గిపోతుందని రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు.
మరోవైపు వాహన యాజమాన్య హక్కు (వెహికల్ ఓనర్షిప్) బదిలీ, పర్మిట్ రెన్యువల్ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ చేయడం వంటి అంశాలనూ పరిశీలిస్తున్నట్లు రవాణా మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.