AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nestle: మ్యాగీ తయారీ కంపెనీ ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?

భారతదేశంలోని ప్రజలు మ్యాగీ నూడుల్స్‌ను చాలా ఇష్టపడతారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ మ్యాగీ అంటే పిచ్చి. అందుకే దేశంలో మ్యాగీని విరివిగా కొంటారు. దీన్ని తయారు చేస్తున్న నెస్లే కంపెనీకి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా మారింది. మ్యాగీని భారత్‌లో విక్రయించడం ద్వారా కంపెనీ భారీగా సంపాదిస్తోంది. మ్యాగీ తయారీ కంపెనీ నెస్లే ఇండియా 2024-25 ఆర్థిక..

Nestle: మ్యాగీ తయారీ కంపెనీ ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?
Maggi
Subhash Goud
|

Updated on: Jul 26, 2024 | 12:02 PM

Share

భారతదేశంలోని ప్రజలు మ్యాగీ నూడుల్స్‌ను చాలా ఇష్టపడతారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ మ్యాగీ అంటే పిచ్చి. అందుకే దేశంలో మ్యాగీని విరివిగా కొంటారు. దీన్ని తయారు చేస్తున్న నెస్లే కంపెనీకి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా మారింది. మ్యాగీని భారత్‌లో విక్రయించడం ద్వారా కంపెనీ భారీగా సంపాదిస్తోంది. మ్యాగీ తయారీ కంపెనీ నెస్లే ఇండియా 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలను ఇటీవల విడుదల చేసింది. క్యూ1 ఫలితాల్లో కంపెనీ లాభం ఏడాది ప్రాతిపదికన 7 శాతం పెరిగి రూ.746 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.698 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మ్యాగీని విక్రయించడం ద్వారా కంపెనీ ప్రతిరోజు రూ.53 కోట్లు ఆర్జించింది.

ఆదాయం రూ.4,813.95 కోట్లు

కార్యకలాపాల ద్వారా నెస్లే ఇండియా ఆదాయం వార్షిక ప్రాతిపదికన 3.33% వృద్ధిని నమోదు చేసింది. FY 2025 మొదటి త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 4,813.95 కోట్లుగా ఉంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఆదాయం అంటే 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ. 4,658.53 కోట్లు.

ఇవి కూడా చదవండి

మొత్తం ఆదాయం 3.65% పెరిగింది:

మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ 2025) కంపెనీ మొత్తం ఆదాయం వార్షిక ప్రాతిపదికన (YoY) 3.65% వృద్ధితో రూ. 4,853 కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 4,682 కోట్లుగా ఉంది. అదే సమయంలో కంపెనీ మొత్తం ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 8.33% తగ్గింది. ఫలితాల తర్వాత నెస్లే షేర్లు 2.50% పడిపోయి రూ.2,477 వద్ద ముగిసింది. గత ఏడాది కాలంలో ఈ షేరు కేవలం 8.81% మాత్రమే పెరిగింది.

భారతదేశంలో వాటా ఎంత?

నెస్లే ఇండియా లిమిటెడ్ బహుళజాతి కంపెనీ నెస్లే భారతీయ అనుబంధ సంస్థ. ఇది భారతదేశంలో 28 మార్చి 1959న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం హర్యానాలోని గుర్గావ్‌లో ఉంది. కంపెనీ ఆహారం, పానీయాలు, చాక్లెట్, మిఠాయి వంటి ఉత్పత్తులను తయారు చేస్తుంది. నెస్లే ఇండియాలో మాతృ సంస్థ నెస్లేకు 60% కంటే ఎక్కువ వాటా ఉంది. నెస్లే ఇండియాకు దేశవ్యాప్తంగా 9 ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us