AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! ఇన్వెస్టర్లు బీ అలర్ట్‌..

భారతదేశంలో బంగారం, వెండి, రాగి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే ధరలు చారిత్రక రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గుల మధ్య పెట్టుబడిదారుల దృష్టి ఇప్పుడు మరొక లోహం వైపు ఆకర్షితులవుతోంది. బంగారం, వెండిని అధిగమించిన రాగి కంటే ఎక్కువగా ఏ లోహం కొనుగోలు చేయబడుతుందో మీకు తెలుసా? ఇది తక్కువ ధరకే ఊహించలేని ప్రయోజనాలను అందిస్తుంది.

బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! ఇన్వెస్టర్లు బీ అలర్ట్‌..
Lithium Investment Guide
Jyothi Gadda
|

Updated on: Jan 13, 2026 | 9:27 PM

Share

రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం, వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అదే సమయంలో రాగి ధర కూడా వేగంగా పెరుగుతోంది. ఇంతలో నిపుణులు మరొక లోహం గురించి ముఖ్యమైన అంచనాలు వెల్లడించారు. బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గుల మధ్య పెట్టుబడిదారుల దృష్టి ఇప్పుడు మరొక లోహం వైపు ఆకర్షితులవుతోంది. ఆ లోహం లిథియం. ప్రపంచ మార్కెట్లో ఇప్పుడు లిథియం డిమాండ్ ఆశ్చర్యకరమైన స్థాయిలో పెరిగింది.

ఇటీవలి కాలంలో పెట్టుబడిదారులు బంగారం, వెండి, ప్లాటినంతో పాటు ఇతర లోహాలపై దృష్టి సారిస్తున్నారు. ప్లాటినం, రాగి ధరలు ఇప్పటికే పెరిగాయి. లిథియం కూడా అదే జాబితాలో చేరింది. తక్కువ ధరకు లభించే ఈ లోహం భవిష్యత్తులో పెద్ద లాభాలను ఆర్జించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

భారతదేశంలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు. అది సంప్రదాయం, భద్రతకు చిహ్నం. వివాహాలు, పండుగలు, ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో బంగారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే బంగారాన్ని పెట్టుబడి ఆస్తిగా చూసే వారి సంఖ్య పెరుగుతోంది. కానీ, ఆధునిక సాంకేతిక యుగంలో లిథియం అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, కెమెరాలు మొదలైన అనేక ఎలక్ట్రానిక్ పరికరాల్లో లిథియం ఉపయోగించబడుతుంది. క్లీన్ ఎనర్జీ రంగంలో కూడా దీని ప్రాముఖ్యత పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి

లిథియం-అయాన్ బ్యాటరీలు ఎక్కువ కాలం పనిచేస్తాయి. వేగంగా ఛార్జ్ అవుతాయి. తక్కువ బరువుతో ఎక్కువ శక్తిని అందిస్తాయి. అందుకే వీటిని ఎలక్ట్రిక్ వాహనాలలో (EVలు) విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో EVల వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున లిథియం డిమాండ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద లిథియం నిల్వలు కలిగిన దేశం ఆస్ట్రేలియా. తరువాత చిలీ, అర్జెంటీనా, బొలీవియా, చైనా ఉన్నాయి. భారతదేశంలో లిథియం నిల్వలు పరిమితంగా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్‌లోని కొన్ని ప్రదేశాలలో అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో దేశీయ డిమాండ్ పెరిగితే, లిథియం దిగుమతులపై ఆధారపడటం పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి