EPF Interest Rate: ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి.. కానీ వారికి మాత్రమే..!

భారతదేశంలో జనాభాకు తగినట్లు ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన సంపాదన ఉన్నప్పుడే భవిష్యత్ అవసరాల కోసం సొమ్మను పొదుపు చేయాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని యజమాని, ఉద్యోగి సమాన వాటా సొమ్ము పెట్టుబడి పెట్టేలా ఉద్యోగుల కోసం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ పథకాన్ని అందుబాటులో ఉంచింది.

EPF Interest Rate: ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి.. కానీ వారికి మాత్రమే..!
Money
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 27, 2024 | 5:45 PM

భారతదేశంలో జనాభాకు తగినట్లు ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన సంపాదన ఉన్నప్పుడే భవిష్యత్ అవసరాల కోసం సొమ్మను పొదుపు చేయాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని యజమాని, ఉద్యోగి సమాన వాటా సొమ్ము పెట్టుబడి పెట్టేలా ఉద్యోగుల కోసం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ పథకాన్ని అందుబాటులో ఉంచింది. సాధారణంగా పెరిగిన ఖర్చుల కారణంగా ఉద్యోగులు పొదుపు వైపు వెళ్లరనే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్భంద పొదుపు  పథకంగా ఈపీఎఫ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 20 మంది కార్మికులు ఉన్న సంస్థలోని ప్రతి ఉద్యోగి తన పేరు మీద ఈపీఎఫ్ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్‌లో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్‌లో పెట్టుబడికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

సాధారణంగా యజమాని అందించిన జీతం ఆధారంగా ఈపీఎఫ్ కటింగ్స్ ఉంటాయి. అయితే ఆ మొత్తం కంటే ఎక్కువ సొమ్ము పొదుపు చేసే సదుపాయం ఉద్యోగులకు ఉంది. ఉద్యోగి జీతం ఆధారంగా కనీసం జీతంలో 30 శాతం పొదుపు చేయవచ్చు. అయితే ఉద్యోగి ఎంత పొదుపు చేసినా యజమాని మాత్రం తన వాటా కింద కేవలం ప్రాథమిక జీతంలో 12 శాతం మాత్రమే చెల్లిస్తాడు. అయితే పొదుపు మొత్తానికి ఈపీఎఫ్ అందించే అధిక వడ్డీ వస్తుంది. సాధారణంగా 20 సంవత్సరాల వయస్సులో ఓ వ్యక్తి ఉద్యోగంలో చేరితే అతని జీతం రూ. 20000 అనుకుందాం. ఇప్పుడు అతను తన ఉద్యోగంలో సగటున 5 శాతం ఇంక్రిమెంట్ పొందుతాడు. అతని ఈపీఎఫ్ సహకారం 12 శాతం, యజమాని పింఛన్ ప్లాన్ కాకుండా 3.67 శాతం పొదుపు చేస్తారు. అయితే ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతం ఉంటే ఉద్యోగి పదవీ విరమణ వరకు పని చేస్తే రూ.2,20,10,562 సంపాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

అయితే ఉద్యోగులు పొదుపు కోసం కేవలం ఈపీఎఫ్ పథకంపైనే ఆధారపడకుండా మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ పొదుపు సాధనాల్లో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పీపీఎఫ్, బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లు లేదా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక మొత్తాలను పొందే అవకాశం ఉంటుంది. ప్రతి ఉద్యోగి ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్లతో పాటు ఇతర పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త