AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF Interest Rate: ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి.. కానీ వారికి మాత్రమే..!

భారతదేశంలో జనాభాకు తగినట్లు ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన సంపాదన ఉన్నప్పుడే భవిష్యత్ అవసరాల కోసం సొమ్మను పొదుపు చేయాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని యజమాని, ఉద్యోగి సమాన వాటా సొమ్ము పెట్టుబడి పెట్టేలా ఉద్యోగుల కోసం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ పథకాన్ని అందుబాటులో ఉంచింది.

EPF Interest Rate: ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి.. కానీ వారికి మాత్రమే..!
Money
Nikhil
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jul 27, 2024 | 5:45 PM

Share

భారతదేశంలో జనాభాకు తగినట్లు ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన సంపాదన ఉన్నప్పుడే భవిష్యత్ అవసరాల కోసం సొమ్మను పొదుపు చేయాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని యజమాని, ఉద్యోగి సమాన వాటా సొమ్ము పెట్టుబడి పెట్టేలా ఉద్యోగుల కోసం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ పథకాన్ని అందుబాటులో ఉంచింది. సాధారణంగా పెరిగిన ఖర్చుల కారణంగా ఉద్యోగులు పొదుపు వైపు వెళ్లరనే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్భంద పొదుపు  పథకంగా ఈపీఎఫ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 20 మంది కార్మికులు ఉన్న సంస్థలోని ప్రతి ఉద్యోగి తన పేరు మీద ఈపీఎఫ్ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్‌లో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్‌లో పెట్టుబడికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

సాధారణంగా యజమాని అందించిన జీతం ఆధారంగా ఈపీఎఫ్ కటింగ్స్ ఉంటాయి. అయితే ఆ మొత్తం కంటే ఎక్కువ సొమ్ము పొదుపు చేసే సదుపాయం ఉద్యోగులకు ఉంది. ఉద్యోగి జీతం ఆధారంగా కనీసం జీతంలో 30 శాతం పొదుపు చేయవచ్చు. అయితే ఉద్యోగి ఎంత పొదుపు చేసినా యజమాని మాత్రం తన వాటా కింద కేవలం ప్రాథమిక జీతంలో 12 శాతం మాత్రమే చెల్లిస్తాడు. అయితే పొదుపు మొత్తానికి ఈపీఎఫ్ అందించే అధిక వడ్డీ వస్తుంది. సాధారణంగా 20 సంవత్సరాల వయస్సులో ఓ వ్యక్తి ఉద్యోగంలో చేరితే అతని జీతం రూ. 20000 అనుకుందాం. ఇప్పుడు అతను తన ఉద్యోగంలో సగటున 5 శాతం ఇంక్రిమెంట్ పొందుతాడు. అతని ఈపీఎఫ్ సహకారం 12 శాతం, యజమాని పింఛన్ ప్లాన్ కాకుండా 3.67 శాతం పొదుపు చేస్తారు. అయితే ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతం ఉంటే ఉద్యోగి పదవీ విరమణ వరకు పని చేస్తే రూ.2,20,10,562 సంపాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

అయితే ఉద్యోగులు పొదుపు కోసం కేవలం ఈపీఎఫ్ పథకంపైనే ఆధారపడకుండా మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ పొదుపు సాధనాల్లో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పీపీఎఫ్, బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లు లేదా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక మొత్తాలను పొందే అవకాశం ఉంటుంది. ప్రతి ఉద్యోగి ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్లతో పాటు ఇతర పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి