Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: ప్రయాణికులకు శుభవార్త.. ఈ మార్గాలలో 5 కొత్త వందే భారత్ రైళ్లు

వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచడానికి రైల్వేలు వందే భారత్ రైళ్లను ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభిస్తున్నాయి. ఇప్పుడు త్వరలో ఒకటి రెండు కాదు ఐదు వందే భారత్ రైళ్లను బహుమతిగా అందుకోబోతున్నాం. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) నుంచి త్వరలో ఐదు వందే భారత్ రైళ్లు నడపబోతున్నాయి. 16 కోచ్‌లతో కూడిన ఈ నారింజ రంగు రైళ్ల తుది తనిఖీ కొనసాగుతోంది...

Vande Bharat: ప్రయాణికులకు శుభవార్త.. ఈ మార్గాలలో 5 కొత్త వందే భారత్ రైళ్లు
Vande Bharat Express Train
Follow us
Subhash Goud

|

Updated on: Jul 26, 2024 | 1:29 PM

వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచడానికి రైల్వేలు వందే భారత్ రైళ్లను ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభిస్తున్నాయి. ఇప్పుడు త్వరలో ఒకటి రెండు కాదు ఐదు వందే భారత్ రైళ్లను బహుమతిగా అందుకోబోతున్నాం. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) నుంచి త్వరలో ఐదు వందే భారత్ రైళ్లు నడపబోతున్నాయి. 16 కోచ్‌లతో కూడిన ఈ నారింజ రంగు రైళ్ల తుది తనిఖీ కొనసాగుతోంది. ఈ రైళ్ల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.

ఈ మార్గాల్లో వందే భారత్ రైళ్లు:

రైల్వే బోర్డు త్వరలో వారి గమ్యస్థానాలను నిర్ణయిస్తుంది. 16 కోచ్‌లతో కూడిన ఈ ఆరెంజ్ రైళ్ల తుది తనిఖీ ప్రస్తుతం జరుగుతోంది. ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)  అధికారి ప్రకారం, ఈ వందే భారత్ రైళ్లు ఏ మార్గంలో నడపాలో రైల్వే బోర్డు నిర్ణయిస్తుంది. వందే భారత్ రైళ్లు ప్రస్తుతం చెన్నై నుండి తిరునల్వేలి, మైసూర్, కోయంబత్తూర్, విజయవాడలకు నడుస్తున్నాయి. ఈ ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో వేలాది రైళ్ల కోచ్‌లు తయారు అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Metro Train: మెట్రో రైళ్లు, స్టేషన్‌లలో రీల్స్‌.. 1600 మందికి జరిమానా.. షాకిచ్చిన అధికారులు

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ 1,536 LHB (Linke-Hofmann-Busch కోచ్. ఇది అనేది ఇండియన్ రైల్వేస్ ప్యాసింజర్ కోచ్.) కోచ్‌లు, 650 కంటే ఎక్కువ వందే భారత్ కోచ్‌లతో సహా 3,515 రైలు కోచ్‌లను తయారు చేయడానికి ప్రణాళిక వేసింది. ప్రస్తుతం వందేభారత్ రైళ్లలో ఎనిమిది లేదా 16 కోచ్‌లు ఉన్నాయి.

త్వరలో 24 కోచ్‌లతో వందేభారత్ రైళ్లు:

భవిష్యత్తులో వందేభారత్ రైళ్లను 20, 24 కోచ్‌లతో నడుపుతామని ఐసీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఈ వందే భారత్ మెట్రోల టెస్ట్ రన్ కూడా నిర్వహించబడింది. దక్షిణ రైల్వే ప్రాంతీయ రైలు సలహా కమిటీ మాజీ సభ్యుడు ఆర్ పాండియ రాజా చెన్నై, నాగర్‌కోయిల్ మధ్య వందేభారత్ సేవను డిమాండ్ చేశారు. మదురై, తిరుచ్చికి వెళ్లే ప్రయాణికుల ప్రయాణాన్ని సులభతరం చేసే వందే భారత్ రైలును తెన్కాసి మీదుగా చెన్నై, తిరువనంతపురం కలుపుతూ ఉండాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Nestle: మ్యాగీ తయారీ కంపెనీ ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?

అంతే కాకుండా శబరిమల సీజన్‌లో ఈ రైళ్ల సంఖ్యను పెంచేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఒకటి ఉదయం చెన్నై నుంచి, మరొకటి తిరువనంతపురం నుంచి ఒకేసారి ప్రారంభించాలి. ఇది కాకుండా తిరునల్వేలి నుంచి బెంగళూరుకు వందేభారత్ రైళ్లను ప్రారంభించడం వల్ల దక్షిణాది జిల్లాల ప్రయాణికులకు మేలు జరుగుతుంది.

ఇది కూడా చదవండి: JioFiber: యూజర్లకు గుడ్‌న్యూస్‌.. భారీ డిస్కౌంట్‌తో జియో ఫైబర్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి