AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తులం గోల్డ్‌ ఎంతుందో తెలుసా.?

బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా క్రితం కాస్త శాంతించిన బంగారం ధర మళ్లీ పెరిగింది. ఒకానొక సమయంలో రూ. 70 వేల లోపు చేరిన తులం బంగారం ధర మళ్లీ రూ. 72 వేలు దాటేసింది. అయితే గత రెండు రోజులుగా బంగారం ధరల పెరుగుదలకు కాస్త బ్రేక్‌ పడిందని చెప్పాలి. మంగళవారం కూడా బంగారం...

Gold Price Today: బంగారం కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తులం గోల్డ్‌ ఎంతుందో తెలుసా.?
Gold Price
Narender Vaitla
|

Updated on: Aug 20, 2024 | 6:29 AM

Share

బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా క్రితం కాస్త శాంతించిన బంగారం ధర మళ్లీ పెరిగింది. ఒకానొక సమయంలో రూ. 70 వేల లోపు చేరిన తులం బంగారం ధర మళ్లీ రూ. 72 వేలు దాటేసింది. అయితే గత రెండు రోజులుగా బంగారం ధరల పెరుగుదలకు కాస్త బ్రేక్‌ పడిందని చెప్పాలి. మంగళవారం కూడా బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర తగ్గుముఖం పట్టింది. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశరాజధాని ఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 66,840కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,910వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,690గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,760 వద్ద కొనసాగుతోంది.

* ఇక చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,690, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,760గా ఉంది.

* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,690గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 72,760 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో ఈరోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,690గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,760 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూను ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి ధరలో కూడా తగ్గుదల కనిపించింది. మంగళవారం కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు.. కోల్‌కతా, జైపూర్ వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 85,900గా ఉంది. ఇక ముంబయి, పుణెలో కిలో వెండి రూ. 85,900 వద్ద కొనసాగుతోంది. అలాగే.. చెన్నైతోపాటు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర గరిష్టంగా రూ. 90,900 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..