Electric scooters: కేవలం రూ.45 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. అద్భుతమైన ఫీచర్స్..!
Electric scooters: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కస్టమర్లు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను..
Electric scooters: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కస్టమర్లు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కొన్ని ఈవీ వాహనాలు విడుదల కాగా, మరికొన్ని వాహనాలు విడుదల అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక దేశంలో అత్యంత తక్కువకు లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ తమదే అని కోమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రకటించింది. గత ఏడాది జూన్ నెలలో విడుదల చేసిన కోమాకి ఎక్స్ జీటీ-ఎక్స్1 ఎలక్ట్రిక్ స్కూటర్ను రెండు మోడళ్లలో విడుదల చేసినట్లు వెల్లడించింది. జెల్ బ్యాటరీ మోడల్ ధర రూ. 45 వేల కంటే తక్కువ. లిథియం అయాన్ బ్యాటరీ మోడల్ రూ. 60వేల ధరకు లభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే కోమాకి ఎక్స్ జీటీ-ఎక్స్1 చాలా తక్కువ ధరకే లభిస్తున్నట్లు కోమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రకటించింది. ఇప్పటి వరకు కోమాకి ఎక్స్ జిటి-ఎక్స్1 స్కూటర్లను రూ. 25 వేల వరకు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.
120 కిలోమీటర్ల వరకు ప్రయాణం..
ఈ-స్కూటర్ ఎకో మోడ్లో120 కిలోమీటర్ల వరకు ప్రయాణించనున్నట్లు తెలిపింది. ఇందులో సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్, సైజ్ అప్ బీఐఎస్ వీల్స్ ఉన్నట్లు పేర్కొంది. కొమాకి ఎక్స్ జీటీ-ఎక్స్1లో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్, భారీ బూట్, స్మార్ట్ డ్యాష్, రిమోట్ సెన్సార్లు, రిమోట్ లాక్ ఫీచర్స్ పొందుపర్చారు. కోమాకి తన లిథియం అయాన్ బ్యాటరీ స్కూటర్లకు 2+1(1 సంవత్సరం సర్వీస్ వారెంటీ) సంవత్సరాలు, లీడ్ యాసిడ్ బ్యాటరీ స్కూటర్లకు 1 సంవత్సరం వారెంటీ అందిస్తోంది. పెట్రోల్ ధరలు, కాలుష్యం మారుతున్న నేపథ్యంలో మార్పు అనేది జరుగుతుందని, ప్రజలు మార్పును స్వీకరించడం ప్రారంభించారు. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతుండటంతో రోడ్లపై మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను వస్తాయని కోమాకి ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా తెలిపారు.