Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్చి 30న శ్రీ రామ నవమి .. ఏయే బ్యాంకులకు సెలవు.. ఎక్కడ పనిచేస్తాయో తెలుసా..? 

కొన్ని రాష్ట్రాల్లో శ్రీ రామనవమి కారణంగా మార్చి 30, గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సెలవు ప్రకటించాయి. ఇలా బ్యాంకు సెలవులు ఆయా రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. రామ నవమి సందర్భంగా ఏయే బ్యాంకులకు సెలవు ప్రకటించారు. నగరాల వారిగా పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..

మార్చి 30న శ్రీ రామ నవమి .. ఏయే బ్యాంకులకు సెలవు.. ఎక్కడ పనిచేస్తాయో తెలుసా..? 
Bank Holidays
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 29, 2023 | 4:36 PM

దేశవ్యాప్తంగా శ్రీరామనవమిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దేశంలోని అన్ని ఆలయాల్లో అట్టహాసంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంక్ హాలిడే క్యాలెండర్ ప్రకారం, కొన్ని రాష్ట్రాల్లో శ్రీ రామనవమి కారణంగా మార్చి 30, గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సెలవు ప్రకటించాయి. ఇలా బ్యాంకు సెలవులు ఆయా రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. రామ నవమి సందర్భంగా ఏయే బ్యాంకులకు సెలవు ప్రకటించారు. నగరాల వారిగా పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..

అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, హైదరాబాద్ – తెలంగాణ, జైపూర్, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పాట్నా, రాంచీ, సిమ్లాలలో బ్యాంకులకు హాలీడే ప్రకటించారు. RBI తన అధికారిక వెబ్‌సైట్- https://www.rbi.org.in/ లో బ్యాంక్ సెలవుల జాబితాను జారీ చేస్తుంది. సెంట్రల్ బ్యాంక్ సెలవులను మూడు కేటగిరీల క్రింద విభజిస్తుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవు, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్, బ్యాంకుల ఖాతాల ముగింపు.

సెలవుల కారణంగా బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు శాఖల్లో డబ్బును విత్‌డ్రా చేయడం, డిపాజిట్ చేయడం సాధ్యం కాదు. అయితే, ఈ రోజుల్లో ATMలు, మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. శ్రీ రామ నవమి సందర్భంగా భారతదేశంలోని అనేక నగరాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. అగర్తల, ఐజ్వాల్, బెంగళూరు, చెన్నై, గౌహతి, అమరావతి (ఆంధ్రప్రదేశ్), ఇంఫాల్, జమ్మూ, కొచ్చి, కోల్‌కతా, న్యూఢిల్లీ, సహా అనేక ఇతర నగరాల్లో బ్యాంకులు హాలీడే ప్రకటించాయి. పనాజీ, రాయ్‌పూర్, షిల్లాంగ్, శ్రీనగర్, తిరువనంతపురం మార్చి 30, 2023న తెరిచి ఉంటాయి. అంటే ఈ నగరాల్లోని ప్రజలు ఈ రోజున తమ బ్యాంకింగ్ లావాదేవీలను సాధారణంగానే నిర్వహించగలుగుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..