New rules: పెట్టుబడిదారులకు అలెర్ట్.. అక్టోబర్ నుంచి కీలక నియమాల మార్పు

ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ ఒకటి నుంచి కొత్త తైమాసికం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పలు అంశాలపై కొత్త నిబంధలు అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటి వరకూ అమలులో ఉన్న వాటికి బదులు కొత్త మార్గదర్శకాలను బ్యాంకులు అమలు చేయనున్నాయి. బ్యాంకులు అందించే వివిధ రకాల కార్డులతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వివిధ రకాల చార్జీలు అమలువుతాయి. అక్టోబర్ ఒకటి నుంచి వాటిలో అనేక మార్పులు రానున్నాయి.

New rules: పెట్టుబడిదారులకు అలెర్ట్.. అక్టోబర్ నుంచి కీలక నియమాల మార్పు
Investment
Follow us

|

Updated on: Sep 28, 2024 | 4:45 PM

ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ ఒకటి నుంచి కొత్త తైమాసికం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పలు అంశాలపై కొత్త నిబంధలు అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటి వరకూ అమలులో ఉన్న వాటికి బదులు కొత్త మార్గదర్శకాలను బ్యాంకులు అమలు చేయనున్నాయి. బ్యాంకులు అందించే వివిధ రకాల కార్డులతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వివిధ రకాల చార్జీలు అమలువుతాయి. అక్టోబర్ ఒకటి నుంచి వాటిలో అనేక మార్పులు రానున్నాయి. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో ఆమోదించిన పలు అంశాలు కూడా అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన మార్పులపై అందరికీ అవగాహన అవసరం. కొత్త త్రైమాసికం అక్టోబర్ నుంచి అమల్లోకి రానుంది, ఈ సందర్భంగా మీ పెట్టుబడులు తదితర వాటికి సంబంధించి కొన్ని మార్పులు జరుగుతాయి. వీటిలో సేవింగ్ ఖాతా చార్జీలు, డెబిట్ ఖాతా చార్జీలు, క్రెడిట్ కార్డు నియమాలు, చిన్న పొదుపు ఖాతాల నిబంధనలు ఉన్నాయి. వీటితో పాటు టీడీఎస్ రేట్లు, ఆధార్ కార్డు నియమాలు తదితర వాటిని సవరించారు. ఇవన్నీ అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి.

మారుతున్న నియమాలు ఇవే

  • ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య యోజన (ఎస్ఎస్వై) తదితర చిన్న పొదుపు ఖాతాలలో కొత్త సర్దుబాట్లు జరుగుతాయి.
  • ఐసీఐసీఐ డెబిట్ కార్డుదారులకు కొన్నిప్రయోజనాలు అమలవుతాయి. వారు ఖర్చు చేసినదాన్ని బట్టి ఎయిర్ పోర్టు లాంజ్ తదితర యాక్సెస్ ను పొందుతారు. ఇందుకోసం మునుపటి త్రైమాసికం (జూలై, ఆగస్టు, సెప్టెంబర్)లలో కనీసం రూ.పదివేల లావాదేవీలు జరపాలి.
  • హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డులకు కొన్ని నిబంధనలు మారనున్నాయి. ముఖ్యంగా తన రివార్డులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. స్మార్ బై ప్లాట్ ఫాం నుంచి యాపిల్ ప్రోడక్టులపై రికార్డు పాయింట్లను రీడిమ్ చేసుకునేందుకు గతంలో ఎలాంటి నిబంధనలు లేవు. కానీ ఇప్పుడు ఒక త్రైమాసికంలో ఒక్క ప్రోడక్టుపై మాత్రమే రీడిమ్ చేసుకోవాలి.

టీడీఎస్ రేటులో మార్పులు

  • సెక్షన్ 194డీఏలోని జీవిత బీమా పాలసీలకు సంబంధించిన చెల్లింపును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు.
  • సెక్షన్ 194జీ లోని లాటరీ టిక్కెట్ల విక్రయంపై కమిషన్ తదితర వాటిని రెండు శాతానికి తగ్గించనున్నారు.
  • సెక్షన్ 194ఎం లోని నిర్ధిష్ట వ్యక్తలు, అభిభాజ్య హిందూ కుటుంబం ద్వారా నిర్దిష్ట మొత్తాల చెల్లింపును 5 నుంచి 2 శాతానికి తగ్గించారు.
  • సెక్షన్ 194 ఓ లోని ఇ-కామర్స్ లో పాల్గొనే ఇ-కామర్ ఆపరేటర్ ద్వారా నిర్దిష్ట మొత్తాలను చెల్లించడాన్ని 1 శాతం నుంచి 0.1 శాతానికి తగ్గించారు.

స్ఠిరాస్థి అమ్మకంపై టీడీఎస్

సెక్షన్ 194 ఐఏ ప్రకారం రూ.50 లక్షలకు మించి స్థిరాస్తి విక్రయానికి సంబంధించిన చెల్లింపులపై తప్పనిసరి 1 శాతం టీడీఎస్ ఉండాలని చెబుతుంది. ప్రతి కొనుగోలుదారు, అమ్మకందారు ఆస్తి విలువ రూ.50 లక్షల కంటే తక్కువగా ఉంటే టీడీఎస్ ఫైల్ చేయాలా, వద్దా అనే దానిపై గతంలో సమస్య ఉండేది. ఇప్పుడు దీనిపై స్పష్టత వచ్చింది. ఒక్కో షేర్ రూ.50 లక్షల కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఆస్తి మొత్తం విలువ దానికి మించితే టీడీఎష్ ఫైల్ చేయాలి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ చార్జీలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) సేవింగ్ ఖాతాలకు వర్తించే కొన్ని ఆన్ క్రెడిట్ సేవల ఖర్చులకు సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి. కనీస సగటు బ్యాలెన్స్ నిర్వహణ, డిమాండ్ డ్రాప్ట్ లను జారీ చేయడం, చెక్కులపై చార్జీలు ఉంటాయి. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పాత బ్యాంకులు జారీ చేసిన చెక్కు బుక్ లు నడిచాయి. అక్టోబర్ ఒకటి నుంచి అవి చెల్లవు, ఆయా బ్యాంకుల ఖాతాదారులు పీఎన్ బీ నుంచి కొత్త చెక్ బుక్కులు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పెట్టుబడిదారులకు అలెర్ట్.. అక్టోబర్ నుంచి కీలక నియమాల మార్పు
పెట్టుబడిదారులకు అలెర్ట్.. అక్టోబర్ నుంచి కీలక నియమాల మార్పు
పండగకు ముందు సామాన్యులకు షాక్‌.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు
పండగకు ముందు సామాన్యులకు షాక్‌.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు
రెండోసారి తండ్రైన జబర్దస్త్ వినోద్.. ఫ్యామిలీ వీడియో వైరల్
రెండోసారి తండ్రైన జబర్దస్త్ వినోద్.. ఫ్యామిలీ వీడియో వైరల్
లంచావతారులను ఏసీబీ అధికారులు ఎలా ట్రాప్ చేస్తారు..?
లంచావతారులను ఏసీబీ అధికారులు ఎలా ట్రాప్ చేస్తారు..?
వెరైటీ కోసం ఐస్ క్రీమ్‌ని ఇలా కూడా చేస్తారా! కేసు పెట్టమంటున్న..
వెరైటీ కోసం ఐస్ క్రీమ్‌ని ఇలా కూడా చేస్తారా! కేసు పెట్టమంటున్న..
త్వరలో స్టాక్ మార్కెట్‌లో ఐపీవో జాతర..!
త్వరలో స్టాక్ మార్కెట్‌లో ఐపీవో జాతర..!
చేపలు తినడం వల్ల 5 అద్భుతమైన ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే..
చేపలు తినడం వల్ల 5 అద్భుతమైన ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే..
తొక్కే కదా అని చిన్న చూపు చూసేరు.. ఉల్లి తొక్కతో లాభాలెన్నో
తొక్కే కదా అని చిన్న చూపు చూసేరు.. ఉల్లి తొక్కతో లాభాలెన్నో
కొంపముంచిన డిప్యూటీ సీఎం తనయుడి రీల్స్ పిచ్చి..
కొంపముంచిన డిప్యూటీ సీఎం తనయుడి రీల్స్ పిచ్చి..
పవన్ కళ్యాణ్ దెబ్బ.. విజయ్ దేవరకొండ సినిమాకు అనుకోని కష్టం.!
పవన్ కళ్యాణ్ దెబ్బ.. విజయ్ దేవరకొండ సినిమాకు అనుకోని కష్టం.!