YS Bharathi Reddy: వైసీపీ కేడర్‌లో ఫుల్ జోష్.. సోదరుడు దినేష్‌రెడ్డితో కలిసి భారతి ఇంటింటి ప్రచారం

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్‌ భారతి రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్‌ నామినేషన్‌ తర్వాత పులివెందుల నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ఇంటింటికీ తిరుగుతున్నారు. అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

YS Bharathi Reddy: వైసీపీ కేడర్‌లో ఫుల్ జోష్.. సోదరుడు దినేష్‌రెడ్డితో కలిసి భారతి ఇంటింటి ప్రచారం
Ys Bharathi Reddy Campaign
Follow us

|

Updated on: May 05, 2024 | 12:41 PM

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్‌ భారతి రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్‌ నామినేషన్‌ తర్వాత పులివెందుల నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ఇంటింటికీ తిరుగుతున్నారు. అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ.. వారి సాదకబాధకాలు వింటున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు భారతి.

తాజాగా.. సోదరుడు దినేష్‌రెడ్డితో కలిసి వేముల మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు వైయస్‌ భారతి. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఐదేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల్ని స్థానికులకు వివరించారు. అటు.. ఎన్నికల ప్రచారం సందర్భంగా వేముల మండల ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఏపీలో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుపై ధీమాగా ఉన్న క్యాడర్‌లో జోష్‌ నింపుతూ.. మెరుగైన పాలనపై భరోసా ఇస్తూ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు భారతి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…