AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వారందిరికి ఉచిత విద్యుత్.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

రాష్ట్రంలోని బీసీ వర్గాలకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. బీసీ వర్గాల సంక్షేమం, జీవనోపాధి అభివృద్ధి కోసం ఉచిత విద్యుత్ పథకం అందిస్తున్నట్టు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాల ప్రజలు ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి పేర్కొంది.

ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వారందిరికి ఉచిత విద్యుత్.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Ap Free Electricity Scheme
Anand T
|

Updated on: May 15, 2026 | 8:08 PM

Share

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ వర్గాల సంక్షేమం, వారి జీవనోపాధి అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన బీసీ వర్గాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పథకం ద్వారా రజకులు, స్వర్ణకారులు, నాయీ బ్రాహ్మణులు, అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన అర్హులైన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతుందని ఆయన పేర్కొన్నారు.

వృత్తుల వారీగా ఉచిత విద్యుత్ వివరాలు

  • నాయీ బ్రాహ్మణులు (సెలూన్ షాపులు ) – నెలకు 200 యూనిట్ల వరకు ఉచితం.
  • రజకులు (లాండ్రీ షాప్‌లకు) – నెలకు 150 యూనిట్ల వరకు ఉచితం
  • స్వర్ణకారులు – నెలకు 100 యూనిట్ల వరకు ఉచితం
  • బీపీఎల్ కుటుంబాలు- నెలకు 100 యూనిట్ల వరకు ఉచితం.

దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు

జిల్లాలోని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. అర్హత గల వారు ఈ క్రింది పత్రాలతో సంబంధిత APSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ (AE) కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • కుల ధృవీకరణ పత్రం
  • ప్రస్తుత విద్యుత్ బిల్లు / సర్వీస్ నంబర్
  • ఎస్టాబ్లిష్‌మెంట్ సర్టిఫికేట్

అత్యంత వెనుకబడిన వర్గాల పరిధిలోకి వచ్చే దాసరి, దొమ్మర, జంగం, జోగి, దమ్మలి, ముత్యాలమ్మవాండ్లు మొదలైన 32 ఉప కులాలకు చెందిన లబ్ధిదారులకు ఎలాంటి ఎస్టాబ్లిష్‌మెంట్ సర్టిఫికేట్ అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించిన ఈ గొప్ప అవకాశాన్ని జిల్లాలోని అర్హులైన వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us