AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కాలేజ్ మారినా ప్రేమించమని వెంటాడి వేధించాడు.. చివరకు పోలీసులకు చేతికి చిక్కాడు

ఇంటర్ లో వేరు వేరు చోట్ల చదువుకున్నారు. ఇద్దరూ ఎప్పుడూ తారసపడలేదు. అయితే ఆ యువతి ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ కోసం ఒంగోలులోని క్విజ్ కాలేజ్ లో చేరింది. ఈ విషయం ఇద్దరికీ ఉమ్మడిగా ఉన్న స్నేహితుల ద్వారా దుర్గా ప్రసాద్ కు తెలిసింది. ఆమె నంబర్ సేకరించి అప్పటి నుండి తిరిగి ప్రేమించాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. అయితే ఆ యువతి మాత్రం ఆ యువకుడి ప్రేమను అంగీకరించలేదు.

Andhra Pradesh: కాలేజ్ మారినా ప్రేమించమని వెంటాడి వేధించాడు.. చివరకు పోలీసులకు చేతికి చిక్కాడు
Andhra Pradesh
T Nagaraju
| Edited By: |

Updated on: Nov 14, 2023 | 1:19 PM

Share

ప్రేమించమని వెంటపడటం.. ప్రేమించను అన్నందుకు కత్తులతో దాడి చేస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. పదవ తరగతిలో చిగురించిన ప్రేమ బిటెక్ కు వచ్చిన తర్వాత ప్రపోజ్ చేసే స్థాయికి వచ్చింది. అయితే  ఆ యువతి మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ అటు వంటి ఉద్దేశం లేదని చెప్పడంతోనే ప్రియుడు కత్తితో దాడి చేశాడు. అసలేం జరిగిందంటే..

పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం ముండ్రు వారిపాలెంకు చెందిన విద్యార్ధిని విజయవాడలో ఆరు నుండి పదవ తరగతి వరకూ చదువుకుంది. అక్కడ తనతో పాటు చదువుకున్న దుర్గా ప్రసాద్ పదవ తరగతిలో పరిచయం అయ్యాడు. అప్పుడే ప్రేమించానంటూ చెప్పడంతో ఆ విద్యార్ధిని వ్యతిరేకించింది. ఆ తర్వాత ఈ విషయం ఇద్దరూ మరిచిపోయారు.

ఇంటర్ లో వేరు వేరు చోట్ల చదువుకున్నారు. ఇద్దరూ ఎప్పుడూ తారసపడలేదు. అయితే ఆ యువతి ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ కోసం ఒంగోలులోని క్విజ్ కాలేజ్ లో చేరింది. ఈ విషయం ఇద్దరికీ ఉమ్మడిగా ఉన్న స్నేహితుల ద్వారా దుర్గా ప్రసాద్ కు తెలిసింది. ఆమె నంబర్ సేకరించి అప్పటి నుండి తిరిగి ప్రేమించాలంటూ వేధించడం మొదలు పెట్టాడు.

ఇవి కూడా చదవండి

అయితే ఆ యువతి మాత్రం ఆ యువకుడి ప్రేమను అంగీకరించలేదు. తన వెంట పడవద్దని హెచ్చరిస్తూనే ఉంది. ఇంటర్ తోనే చదువు ఆపేసిన దుర్గా ప్రసాద్ .. దీపావళి సెలవుల్లో ఆ యువతి స్వగ్రామమైన ముండ్రువారి పాలెం వెళ్లినట్లు తెలుసుకున్నాడు.

విజయవాడ నుండి ఆ యువతి స్వగ్రామానికి వెళ్లాడు. నేరుగా ఆ యువతి ఇంటికే వెళ్లాడు. బయట నిలబడి ఆమెను పిలిచాడు. దీంతో ఎవరా పిలుస్తుందని ఆ యువతి బయటకు వచ్చింది. వెంటనే అతను తన వద్ద నున్న కత్తిని ఆమె మెడ మీద పెట్టి కోసేశాడు.  ఆ యువతి కేకలు వేయడంతో ఇంట్లోని నుండి వచ్చిన బంధువులు దుర్గా ప్రసాద్ ను పట్టుకున్నారు.

కత్తితో దాడి చేయడంతో ఆ యువతికి గాయమయింది. వెంటనే ఆమెను వినుకొండలోని ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయువకుడిని శావల్యాపురం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సండే స్పెషల్.. ఫిష్ కుర్మా ఇలా వండితే తినేకొద్దీ తినాలనిపిస్తుంది
సండే స్పెషల్.. ఫిష్ కుర్మా ఇలా వండితే తినేకొద్దీ తినాలనిపిస్తుంది
ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీకి వాడే ప్లాస్టిక్‌ గిన్నెల్లో కాలకూట విషం
ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీకి వాడే ప్లాస్టిక్‌ గిన్నెల్లో కాలకూట విషం
ఎంత డబ్బు సంపాదించినా.. నిలవడం లేదా..? ఈ పక్షుల ఫోటోలు ఇంట్లో..
ఎంత డబ్బు సంపాదించినా.. నిలవడం లేదా..? ఈ పక్షుల ఫోటోలు ఇంట్లో..
బ్రాయిలర్ vs నాటు కోడి.. ఇందులో ఏది బెస్ట్..
బ్రాయిలర్ vs నాటు కోడి.. ఇందులో ఏది బెస్ట్..
ట్రాఫిక్ కష్టాలకు టాటా.. బెజవాడ వాసులకు భలే గుడ్ న్యూస్..
ట్రాఫిక్ కష్టాలకు టాటా.. బెజవాడ వాసులకు భలే గుడ్ న్యూస్..
మిత్రమా.. సమ్మర్‌ వచ్చేస్తోంది.. ఏసీ స్కామ్‌ గురించి మీకు తెలుసా?
మిత్రమా.. సమ్మర్‌ వచ్చేస్తోంది.. ఏసీ స్కామ్‌ గురించి మీకు తెలుసా?
చేపల కూర నుంచి నీచు వాసన పోవట్లేదా?.. ఇలా కడిగితే సరి
చేపల కూర నుంచి నీచు వాసన పోవట్లేదా?.. ఇలా కడిగితే సరి
14ఏళ్లకే హీరోయిన్.. 300లకు పైగా సినిమాలు..
14ఏళ్లకే హీరోయిన్.. 300లకు పైగా సినిమాలు..
అయ్యో నా పతి దేవుడ్ని కిడ్నాప్ చేశారంటూ భార్య వర్రీ..
అయ్యో నా పతి దేవుడ్ని కిడ్నాప్ చేశారంటూ భార్య వర్రీ..
టీ20 వరల్డ్ కప్ సెమీస్‌కు వెళ్లేది ఈ జట్లే..గ్రోక్ షాకింగ్ జోస్యం
టీ20 వరల్డ్ కప్ సెమీస్‌కు వెళ్లేది ఈ జట్లే..గ్రోక్ షాకింగ్ జోస్యం