China Air Pollution: ఐదేళ్ల క్రితం కాలుష్య కోరల్లో చైనా.. ఈ యుద్ధంలో చైనా ఎలా గెలిచిందో తెలుసా..!

ఐదేళ్ల క్రితం చైనాలో వాయు కాలుష్యం పెద్ద సమస్య. పొగమంచు కమ్ముకోవడంతో ఆకాశం కూడా కనిపించలేదు. పాఠశాలలు, కళాశాలలు మూసి వేసి అందరూ మాస్క్‌లు ధరించాలని సూచించారు. చాలా రోజులుగా ఎండలు కనిపించని పరిస్థితి నెలకొంది. తమ దేశంలో వేగంగా క్షీణిస్తున్న వాయు కాలుష్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. చైనా 2013లో నేషనల్ ఎయిర్ క్వాలిటీ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేసింది. ఇందుకోసం రూ.19 వేల కోట్ల విలువైన పథకాలను రెడీ చేసి ప్రభుత్వం ఆమోదించి వెంటనే అమలు చేసింది. ఈ పథకాల వలన కొందరికి ఇబ్బందులు పెంచినప్పటికీ..  ప్రభుత్వం మాత్రం తాను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంది.

China Air Pollution: ఐదేళ్ల క్రితం కాలుష్య కోరల్లో చైనా.. ఈ యుద్ధంలో చైనా ఎలా గెలిచిందో తెలుసా..!
China War Against Pollution
Follow us

|

Updated on: Nov 14, 2023 | 9:16 AM

దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ వాయు కాలుష్యం పెరిగిపోయింది. దీపావళి వేళ పెద్ద ఎత్తున టపాసులు పేల్చడంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఇటీవలి వర్షం కారణంగా కాలుష్య సమస్య కాస్త సద్దుమణిగినా దీపావళితో పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. ఢిల్లీ కాలుష్య కోరల నుంచి కాస్త బయటపడిందని ఊపిరిపీల్చుకునేలోపే దీపావళి తర్వాత పరిస్థితులు మళ్లీ ప్రమాదకరంగా మారాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌ తదితర ప్రాంతాల్లో భారీగా బాణసంచా కాల్చడంతో రాజధాని పరిసర ప్రాంతాలను కాలుష్య పొగ కమ్మేసింది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ మొత్తం 400కి చేరుకుంది. వాస్తవానికి ఇప్పుడు చలి కూడా పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితిలో ఆకాశంలో పొగ మంచు, విషపూరిత గాలులు వేగంగా పెరుగుతోంది. అయితే ఇలాంటి పరిస్థితినే గతంలో చైనా ఎదుర్కొంది. అయితే ఇప్పుడు చైనా పొగమంచును పూర్తిగా నియంత్రించింది. ఈ నేపథ్యంలో చైనా నుంచి కూడా మనం చాలా నేర్చుకోవాలి.

ఐదేళ్ల క్రితం చైనాలో వాయు కాలుష్యం పెద్ద సమస్య. వాయుకాలుష్యం కారణంగా ఏటా 5 లక్షల మంది చనిపోతున్నంత దారుణంగా పరిస్థితి తయారైంది. పొగమంచు కారణంగా ఆకాశం కూడా కనిపించలేదు. పాఠశాలలు, కళాశాలలు మూసి వేసి అందరూ మాస్క్‌లు ధరించాలని సూచించారు. చాలా రోజులుగా ఎండ వేడి కూడా నేల మీద పడని పరిస్థితి నెలకొంది. అప్పటి చైనా పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. గత ఐదేళ్లలో చైనాలో PM2.5 (పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5) మూడింట ఒక వంతు తగ్గింది.

అతిసూక్ష్మ ధూళికణాలు

గాలిలో ఉండే ప్రమాదకరమైన సూక్ష్మ కణాలు ఊపిరితిత్తులను పాడుచేస్తాయి. సూక్ష్మ కణాలు. 2.5 దాటితే గాలి విషపూరితం అవుతుంది. అతిసూక్ష్మ ధూళికణాలు మానవ జుట్టు వెడల్పు కంటే 30 రెట్లు చిన్నవి. అవి గాలి ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి ఊపిరితిత్తులపై పొరను ఏర్పరుస్తాయి, దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.

ఇవి కూడా చదవండి

చైనాలో నేషనల్ ఎయిర్ క్వాలిటీ యాక్షన్ ప్లాన్ అమలు

తమ దేశంలో వేగంగా క్షీణిస్తున్న వాయు కాలుష్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. చైనా 2013లో నేషనల్ ఎయిర్ క్వాలిటీ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేసింది. ఇందుకోసం రూ.19 వేల కోట్ల విలువైన పథకాలను రెడీ చేసి ప్రభుత్వం ఆమోదించి వెంటనే అమలు చేసింది. ఈ పథకాల వలన కొందరికి ఇబ్బందులు పెంచినప్పటికీ..  ప్రభుత్వం మాత్రం తాను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంది.

చైనా ఎలాంటి చర్యలు తీసుకుందంటే..

ముందుగా పాతవి, పనికిరాని వాహనాలు అనుమతిని పూర్తిగా రద్దు చేశారు. బీజింగ్, షాంఘై, గ్వాంగ్‌జౌల్లో కార్ల వాహనాల వాడకం సంఖ్యను తగ్గించారు. వాయుకాలుష్య కర్మాగారాలన్నీ నగరం వెలుపల ఇతర ప్రాంతాలకు తరలించారు. చాలా ఫ్యాక్టరీలు పూర్తిగా మూసివేశారు. నగరాల్లో స్వచ్ఛమైన గాలి కోసం అనేక రకాల కారిడార్లను ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో చెట్లు నాటాయి. ఫ్యాక్టరీల్లో బొగ్గు వినియోగాన్ని పూర్తిగా నిలిపివేశారు. కొత్త ప్లాంట్‌కు అనుమతి ఇవ్వడం నిలిపివేశారు. ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించారు.

పొయ్యిల వినియోగంపై నిషేధం

2013లో బీజింగ్‌లోని 4 మిలియన్లకు పైగా గృహాలు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఇంధనంగా బొగ్గును ఉపయోగించేవారు. చలి నుంచి రక్షణ కోసం బొగ్గు వినియోగం అధికంగా ఉండేది. దీంతో బొగ్గు వినియోగాన్ని  ప్రభుత్వం నిషేధించింది. దీని స్థానంలో సహజ వాయువు లేదా హీటర్‌లతో భర్తీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం తర్వాత బీజింగ్‌లో పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. 2014లో మూతపడిన ఫ్యాక్టరీల సంఖ్య 392. ఈ కర్మాగారాల్లో సిమెంటు, బట్టలు మొదలుకొని రసాయనాల వరకు అన్నీ తయారయ్యేవి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ… తక్కువ వడ్డీకే రుణాలు
వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ… తక్కువ వడ్డీకే రుణాలు
పెరుగుతో బెల్లం కలిపి తింటున్నారా..? ఏమవుతుందో తెలుసా..?
పెరుగుతో బెల్లం కలిపి తింటున్నారా..? ఏమవుతుందో తెలుసా..?
తెలంగాణ ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ సాధించిన అభిమాని.. సమంత పోస్ట్
తెలంగాణ ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ సాధించిన అభిమాని.. సమంత పోస్ట్
కీలక నిర్ణయం.. ఉబెర్‌ నుంచి ట్యాక్సీలే కాదు ఇక బస్సులు కూడా..
కీలక నిర్ణయం.. ఉబెర్‌ నుంచి ట్యాక్సీలే కాదు ఇక బస్సులు కూడా..
ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్‌ ప్రమాదం వెనక ఎవరి హస్తం ఉంది?
ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్‌ ప్రమాదం వెనక ఎవరి హస్తం ఉంది?
శ్రీశైలంలో ఉక్కపోత నుంచి ఉపశమనం.. దంచికొట్టిన వర్షం..
శ్రీశైలంలో ఉక్కపోత నుంచి ఉపశమనం.. దంచికొట్టిన వర్షం..
ఆపద వేళ ఆపన్న హస్తం.. ఆ యాప్ ద్వారా అంబులెన్స్ బుకింగ్స్ షురూ
ఆపద వేళ ఆపన్న హస్తం.. ఆ యాప్ ద్వారా అంబులెన్స్ బుకింగ్స్ షురూ
సూపర్ రీచార్జ్‌ ప్లాన్‌ ప్రకటించిన వీఐ..రూ.1కే బోలెడు లాభాలు
సూపర్ రీచార్జ్‌ ప్లాన్‌ ప్రకటించిన వీఐ..రూ.1కే బోలెడు లాభాలు