Andhra Pradesh: చిత్తూరులో కరెంటు తీగల ఉచ్చుకు మరో గజరాజు బలి.. మన్యం జిల్లాలో ఏనుగు దాడిలో..

సరిగ్గా పదిరోజులక్రితం ఇదే మండలం, ఇదే గ్రామంలో సేమ్‌ టు సేమ్‌ ఇలాగే విద్యుత్‌షాక్‌తో మరణించింది ఓ ఏనుగు. పొలంలో ఏర్పాటుచేసిన విద్యుత్‌ తీగలు తగిలి మృత్యువాతపడింది.

Andhra Pradesh: చిత్తూరులో కరెంటు తీగల ఉచ్చుకు మరో గజరాజు బలి.. మన్యం జిల్లాలో ఏనుగు దాడిలో..
Elephants
Follow us

|

Updated on: Nov 13, 2022 | 6:10 AM

చిత్తూరు జిల్లా వి.కోట మండలం నాగిరెడ్డిపల్లిలో మరో గజరాజు ప్రాణాలు కోల్పోయింది. వన్యప్రాణులను వేటాడేందుకు పెట్టిన విద్యుత్‌ తీగలు తగిలి ఓ ఏనుగు నేలకొరిగింది. దాంతో, పొలంలో విద్యుత్‌ తీగలను ఏర్పాటుచేసిన నిందితులు సురేష్‌, కృష్ణప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. సరిగ్గా పదిరోజులక్రితం ఇదే మండలం, ఇదే గ్రామంలో సేమ్‌ టు సేమ్‌ ఇలాగే విద్యుత్‌షాక్‌తో మరణించింది ఓ ఏనుగు. పొలంలో ఏర్పాటుచేసిన విద్యుత్‌ తీగలు తగిలి మృత్యువాతపడింది. పదిరోజుల గ్యాప్‌లో రెండు ఏనుగులు విద్యుత్‌ తీగలకు బలైపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.

ఏనుగుల నుంచి తమ పొలాలను కాపాడుకునేందుకు రైతులే విద్యుత్‌ తీగలను పెడుతున్నారా? లేక ఇది వేటగాళ్ల పనో? తేల్చేందుకు దర్యాప్తు మొదలుపెట్టారు ఫారెస్ట్‌ అధికారులు. మరో ఏనుగు విద్యుత్‌ తీగలకు బలైపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పొలాల్లో విద్యుత్‌ తీగలు ఏర్పాటుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయితే, ఆహారం కోసం అడవుల్లో నుంచి పొలాల్లోకి వస్తోన్న గజరాజులు.. తమకు తెలియకుండానే విద్యుత్‌ షాక్‌కి గురై మృత్యువాత పడుతున్నాయి.

పార్వతీపురం మన్యం జిల్లాలో..

ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం-మన్యం జిల్లా కొమరాడ మండలం కలికోట్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున 46 ఏళ్ల గోవింద అనే వ్యక్తి ఏనుగు దాడిలో మరణించాడు. సీతానగరం, బలిజిపేట, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఒక ఏనుగు గుంపు సంచరిస్తూ గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది.

ఇవి కూడా చదవండి

పార్వతీపురం-మన్యం జిల్లా అటవీశాఖ అధికారి జీఏపీ ప్రసూనతోపాటు సీనియర్ అటవీ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఘటనపై ఆరా తీశారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఆహారం, నీరు లేకపోవడంతో జంతువులు జనవాసాల్లోకి వస్తున్నాయని.. ఆటపట్టించవద్దని ప్రజలను కోరారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?