AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather: మండే ఎండలకు బ్రేక్.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన

మండే ఎండలకు బ్రేక్. అవును ఏపీకి వర్షసూచన వచ్చింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆ డీటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం...

AP Weather: మండే ఎండలకు బ్రేక్.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
Andhra Weather Report
Ram Naramaneni
|

Updated on: May 05, 2024 | 6:41 PM

Share

ఏపీ ప్రజలకు పిడుగులతో కూడిన వర్షాల అలెర్ట్ వచ్చింది. సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడుతుందన్నారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

సోమవారం 29 మండలాల్లో, ఎల్లుండి 15 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.సోమవారం శ్రీకాకుళం10, విజయనగరం 13, పార్వతీపురంమన్యం 6 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

ఆదివారం నంద్యాల జిల్లా మహానందిలో 45.8°C, కర్నూలు జిల్లా జి. సింగవరంలో 45.6°C, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో 45.5°C, ప్రకాశం జిల్లా వెలిగండ్లలో 45.2°C, తిరుపతి జిల్లా మంగనెల్లూరు, వైయస్సార్ జిల్లా ఉప్పలూరు, సింహాద్రిపురంలో 45.1°C, అన్నమయ్య జిల్లా టిసుండుపల్లె 44.7°C, పల్నాడు జిల్లా రావిపాడులో 44.4°C, చిత్తూరు జిల్లా పుంగనూరులో 43.6°C, ఎన్టీఆర్ జిల్లా వీరులపాడులో 43.3°C, అల్లూరి జిల్లా యెర్రంపేటలో 43.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 5 మండలాల్లో తీవ్రవడగాల్పులు,117 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు. ఎండతీవ్రత పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…