వాతావరణం
విస్తారమైన భౌగోళిక, విభిన్న నైసర్గిక ఆకృతి వైవిధ్యమైన వాతావరణ పరిస్థితుల కారణంగా భారతదేశ వాతావరణాన్ని ఒకేలా వివరించలేము. దేశంలో వాతావరణం ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. అయితే మొత్తం మీద భారతదేశ వాతావరణాన్ని 4 ప్రధాన భాగాలుగా విభజించారు. శీతాకాలం (డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి), వేసవికాలం (మార్చి, ఏప్రిల్, మే), రుతుపవన వర్షాకాలం (జూన్ నుంచి సెప్టెంబరు), రుతుపవనాల అనంతర కాలం (అక్టోబర్ – నవంబర్)గా విభజించారు. వాతావరణ వార్తల్లో వర్షాలు, తుఫానులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. తుఫానులకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలను అందిస్తూ ప్రజలను అలర్ట్ చేస్తుంటారు.
వర్షాకాలం గురించి దేశంలో పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తారు. రైతులు సైతం పంటలను వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాట్లు వేస్తుంటారు. నైరుతి, ఈశాన్య రుతుపవనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటివల్లే దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. రెండు రుతుపవనాల ద్వారా వర్షాలు పడే ఏకైక ప్రాంతం ఈశాన్య భారతదేశం, దీని ఫలితంగానే ప్రపంచంలో ఎక్కువ వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది.
ఎల్ నీనో ఎఫెక్ట్తో జాడలేని వర్షాలు.. ఈ సీజన్లో లాభాలు పండించే బెస్ట్ ఆరుతడి పంటలు ఇవే..
రుతుపవనాలు విస్తరించినా ఎల్ నీనో ప్రభావంతో వర్షాలు ఆలస్యమవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే ఆరుతడి పంటల సాగు ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిపుణులు సూచిస్తున్నారు. మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని అందించగలవని చెబుతున్నారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటల ఎంపిక, శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించడం ద్వారా రైతులు వర్షాభావ పరిస్థితులను అధిగమించి లాభాలు పొందవచ్చని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Jun 20, 2026
- 1:02 pm
తుఫాన్లు ఉదయం ఎందుకు రావో తెలుసా..? సాయంత్రం ముంచుకొచ్చే ముప్పు వెనుక అసలు రహస్యం ఇదే..!
Why Storms Happen in Evening: ఎండకాలం లేదా వర్షాకాలంలో అకస్మాత్తుగా వచ్చే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురు గాలులు మనల్ని వణికిస్తుంటాయి. అయితే, ఈ తుఫానులు ఎప్పుడూ మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లోనే ఎందుకు వస్తాయి? ఉదయం పూట ఎందుకు రావు? అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతుంది. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన శాస్త్రీయ కారణం ఇప్పుడు చూద్దాం.
- Venkata Chari
- Updated on: Jun 19, 2026
- 7:04 pm
Weather Report: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఇదే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని తెలిపింది. రుతువపనాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కాబట్టి ఏ స్టేట్లో వాతావరణం ఎలా ఉండబోతుందో చూద్దాం.
- Anand T
- Updated on: Jun 19, 2026
- 2:07 pm
AP Weather: ఏపీ ప్రజలకు వెదర్ అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
AP Weather Forecast: తూర్పు విదర్భ నుంచి తమిళనాడు వరకు ద్రోణి విస్తరించిన ప్రభావంతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటు కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుల హెచ్చరిక జారీ చేసింది. ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
- Janardhan Veluru
- Updated on: Jun 18, 2026
- 5:51 pm
నత్తనడకన రుతుపవనాలు.. పత్తాలేని వానదేవుడు..! వారం రోజులు వానల్లేవ్..
Telangana Weather Alert: నైరుతి రుతుపవనాలు దేవ వ్యాప్తంగా విస్తరించినా పురోగతి మందగించడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం నైరుతి రుతుపవనాలు హైదరాబాద్, భద్రాచలం, కోరాపుట్, రాంచీ, ముజఫర్పుర్ వరకూ విస్తరించాయి. రాబోయే నాలుగైదు రోజుల్లో మధ్య అరేబియా సముద్రం..
- Srilakshmi C
- Updated on: Jun 18, 2026
- 11:30 am
ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. గురువారం వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో ద్రోణి ప్రభావంతో Andhra Pradesh, Telangana రాష్ట్రాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఉత్తర తెలంగాణలో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో హీట్వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, పిడుగులు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jun 18, 2026
- 7:10 am
వర్షాలు కురుస్తాయా..? వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించినప్పటికీ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎండలు, ఉక్కపోత ఇబ్బంది పెడుతుండగా.. మరోవైపు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి.
- Shaik Madar Saheb
- Updated on: Jun 17, 2026
- 1:20 pm
ఆ 10 రాష్ట్రాల్లో ఎల్నినో ముప్పు.. ఖరీఫ్ సీజన్పై అప్రమత్తమైన కేంద్రం
దేశ వ్యవసాయంపై ఎల్నినో నీలినీడలు వ్యాపిస్తున్నాయి. దీనికి ప్రతిస్పందనగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ప్రభావిత రాష్ట్రాలన్నింటిలోనూ తక్షణ జిల్లా స్థాయి అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. ఖరీఫ్ సన్నాహాలపై వారపు సమీక్షా సమావేశానికి నిర్వహించారు. ఇందులో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు..
- Srilakshmi C
- Updated on: Jun 17, 2026
- 12:06 pm
Andhra: ఏపీలో బుధవారం వెదర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం పదండి..
దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో బుధవారం (జూన్ 17) ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి ..
- Ram Naramaneni
- Updated on: Jun 16, 2026
- 6:23 pm
Thunderstorm: ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు పొరపాటున కూడా ఈ 5 పనులు చేయకండి!
ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని అందనిరీ తెలుసు. కానీ ఆ సమయంలో మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న పనులు మనల్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయని మీకు తెలుసా? అవును మెరుపు మనల్ని నేరుగా తాకకపోయినా.. అది నీరు, వైర్లు, పైపులు, లోహపు వస్తువుల ద్వారా ప్రయాణించి మనల్ని గాయపరచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తు్నారు. మనం ఈ ప్రమాదాల బారీన పడకుండా ఉండాలంటే.. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు మనం చేయకూడని కొన్ని ముఖ్యమైన పనులు ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి అవేంటో ఇక్కడ చూద్దాం.
- Anand T
- Updated on: Jun 16, 2026
- 2:29 pm
Rains: నైరుతి ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్షసూచన.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్..
ఏపీకి వాతావరణశాఖ భారీ వర్షసూచన జారీ చేసింది. రానున్న మూడ్రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు జిల్లాలకు వర్షసూచన జారీ చేసింది. ఉరుములతో కూడిన జల్లులు పలుచోట్ల పడతాయని స్పష్టం చేసింది.
- Venkatrao Lella
- Updated on: Jun 16, 2026
- 1:36 pm
Monsoon Break : శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచిన ఉపగ్రహ ఫోటోలు.. దేశాన్ని వణికిస్తున్న మాన్సూన్ విరామం
దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన నైరుతి రుతుపవనాలు ఒక్కసారిగా బలహీనపడ్డాయి. జూన్ 4 నుంచి 15 వరకు కురవాల్సిన వర్షపాతంలో సగం కూడా నమోదు కాకపోవడంతో దేశంలో ఏకంగా 64 శాతం వర్షాల కొరత ఏర్పడింది. ఆకాశంలో నల్లటి మేఘాలు మాయమై, క్లియర్గా కనిపిస్తుండటంతో శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు. సముద్రంలో తేమ ఉన్నప్పటికీ వానలు ఎందుకు పడట్లేదు? వాతావరణంలో చోటుచేసుకున్న ఆ అసాధారణ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం.
- Anand T
- Updated on: Jun 15, 2026
- 9:17 pm