వాతావరణం
విస్తారమైన భౌగోళిక, విభిన్న నైసర్గిక ఆకృతి వైవిధ్యమైన వాతావరణ పరిస్థితుల కారణంగా భారతదేశ వాతావరణాన్ని ఒకేలా వివరించలేము. దేశంలో వాతావరణం ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. అయితే మొత్తం మీద భారతదేశ వాతావరణాన్ని 4 ప్రధాన భాగాలుగా విభజించారు. శీతాకాలం (డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి), వేసవికాలం (మార్చి, ఏప్రిల్, మే), రుతుపవన వర్షాకాలం (జూన్ నుంచి సెప్టెంబరు), రుతుపవనాల అనంతర కాలం (అక్టోబర్ – నవంబర్)గా విభజించారు. వాతావరణ వార్తల్లో వర్షాలు, తుఫానులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. తుఫానులకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలను అందిస్తూ ప్రజలను అలర్ట్ చేస్తుంటారు.
వర్షాకాలం గురించి దేశంలో పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తారు. రైతులు సైతం పంటలను వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాట్లు వేస్తుంటారు. నైరుతి, ఈశాన్య రుతుపవనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటివల్లే దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. రెండు రుతుపవనాల ద్వారా వర్షాలు పడే ఏకైక ప్రాంతం ఈశాన్య భారతదేశం, దీని ఫలితంగానే ప్రపంచంలో ఎక్కువ వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది.
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రికార్డు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చలితో పాటు హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం నమోదవుతోంది. AQI 230 దాటింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనవరిలో కూడా చలి కొనసాగుతుంది.
- Phani CH
- Updated on: Dec 27, 2025
- 9:27 pm
Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. చాలా జాల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. విపరీతమైన చలితో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.. అయితే డిసెంబర్ 31 వరకు మాత్రమే ఈ చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో చూడండి..
- Shaik Madar Saheb
- Updated on: Dec 27, 2025
- 3:54 pm
Weather Update: బాబోయ్ చలి పులి.. వచ్చే 2 రోజులు గజ గజే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.. పగటిపూట ఎండ కాస్తున్నప్పటికీ.. సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడి రాత్రివేళల్లో రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది.. కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
- Shaik Madar Saheb
- Updated on: Dec 26, 2025
- 2:57 pm
Weather Alert: బాబోయ్ చలి.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్
అమ్మో చలి.. స్వెట్టర్లు ఆగడం లేదు. బ్లాంకెట్లు, దుప్పట్లు కప్పుకున్నా.. వణుకు తగ్గట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు. రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది.
- Shaik Madar Saheb
- Updated on: Dec 25, 2025
- 8:03 pm
Weather Alert: తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో 2 రోజుల వెదర్ రిపోర్ట్
Weather: తెలంగాణలో చలి చంపేస్తోంది.. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.. ఎముకలు కొరికే చలితో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చలిగాలులతో కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదయ్యాయి. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది..
- Shaik Madar Saheb
- Updated on: Dec 24, 2025
- 8:22 am
Weather Report: చలి పంజా.. వణుకుతున్న తెలంగాణ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను చలిగాలులు వణికిస్తున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. దట్టమైన పొగమంచుతో వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఐఎండీ 7 జిల్లాలకు ఆరెంజ్, 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న రోజుల్లోనూ చలి తీవ్రత కొనసాగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
- Phani CH
- Updated on: Dec 23, 2025
- 5:55 pm
ఇదేమి చలిరా బాబోయ్.. నెలాఖరు దాకా ఇంతేనట
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చలి తీవ్రత పెరిగి, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, దట్టమైన పొగమంచు జనజీవనాన్ని స్తంభింపజేస్తోంది. ఉత్తరాదిలోనూ హిమపాతం, తీవ్ర చలిగాలులు వీస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉంది.
- Phani CH
- Updated on: Dec 23, 2025
- 4:47 pm
Telangana: బాబోయ్ ఇప్పటికే చలి చంపేస్తుంది.. మరీ రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
తెలంగాణలో రోజురోజుకూ చలి తీవ్రత పెరిగిపోతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదవుతుంగా.. రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ తీవ్ర మరింత పెరగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి రానున్న మూడు రోజుల్లో, గడిచిన కొన్ని రోజుల్లో రాష్టరంలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూద్దాం.
- Anand T
- Updated on: Dec 23, 2025
- 11:15 am
తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ కి పడిపోయిన ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చలి తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. గత ఐదారు సంవత్సరాలలో ఎన్నడూ లేనంత చలి నమోదైందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఉత్తర భారత్ నుంచి వీస్తున్న శీతల గాలులు, తక్కువ తేమ, మేఘాలు లేకపోవడం దీనికి కారణాలని వివరించారు. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.
- Phani CH
- Updated on: Dec 22, 2025
- 7:45 pm
చంపేస్తోన్న చలి.. అత్యల్ప ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డ్
తెలుగు రాష్ట్రాలు, ఉత్తర భారతాన్ని చలిపులి గజగజ వణికిస్తోంది. తెలంగాణ, ఏపీలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోగా, హైదరాబాద్లోనూ 10 డిగ్రీల దిగువకు చేరాయి. సంగారెడ్డిలో 4.5°C నమోదైంది. పొగమంచు, హిమపాతంతో ఉత్తర భారతం ఉక్కిరిబిక్కిరవుతోంది. వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి, జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
- Phani CH
- Updated on: Dec 22, 2025
- 4:21 pm
దట్టమైన పొగమంచుతో నిండిన ఉత్తర భారతం.. పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ..!
ఉత్తర భారతం చలికి వణుకుతోంది. జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న మంచు చుక్కలు చూపిస్తోంది. ఎత్తైన భూభాగాల్లో హిమపాతం పెరిగి లోయలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జలవనరులు ఉన్న ప్రాంతాల్లోనైతే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చలికి నీళ్లే గడ్డ కట్టుకుపోతున్నాయి.
- Balaraju Goud
- Updated on: Dec 22, 2025
- 7:17 am
పెరుగుతున్న చలి తీవ్రత.. రానున్న రెండు రోజుల్లో మరింత పెరిగే అవకాశం
తెలుగు రాష్ట్రాలు, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా చలి తీవ్రత, పొగమంచు, కాలుష్యం పెరిగాయి. పటాన్చెరులో 7°, విశాఖ ఏజెన్సీలో 4°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
- Phani CH
- Updated on: Dec 20, 2025
- 7:40 pm