AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాతావరణం

వాతావరణం

విస్తారమైన భౌగోళిక, విభిన్న నైసర్గిక ఆకృతి వైవిధ్యమైన వాతావరణ పరిస్థితుల కారణంగా భారతదేశ వాతావరణాన్ని ఒకేలా వివరించలేము. దేశంలో వాతావరణం ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. అయితే మొత్తం మీద భారతదేశ వాతావరణాన్ని 4 ప్రధాన భాగాలుగా విభజించారు. శీతాకాలం (డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి), వేసవికాలం (మార్చి, ఏప్రిల్, మే), రుతుపవన వర్షాకాలం (జూన్ నుంచి సెప్టెంబరు), రుతుపవనాల అనంతర కాలం (అక్టోబర్ – నవంబర్)గా విభజించారు. వాతావరణ వార్తల్లో వర్షాలు, తుఫానులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. తుఫానులకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలను అందిస్తూ ప్రజలను అలర్ట్ చేస్తుంటారు.

వర్షాకాలం గురించి దేశంలో పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తారు. రైతులు సైతం పంటలను వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాట్లు వేస్తుంటారు. నైరుతి, ఈశాన్య రుతుపవనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటివల్లే దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. రెండు రుతుపవనాల ద్వారా వర్షాలు పడే ఏకైక ప్రాంతం ఈశాన్య భారతదేశం, దీని ఫలితంగానే ప్రపంచంలో ఎక్కువ వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది.

ఇంకా చదవండి

Weather Update : ఏపీకి తప్పిన తుఫాను ముప్పు.. కానీ..

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా మారకపోయినా, అది శ్రీలంక వైపు కదులుతోంది. ఏపీకి తుపాను ముప్పు తప్పినప్పటికీ, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల కారణంగా ఏపీలో చలి తీవ్రత మరింత పెరగనుంది. ఇప్పటికే పొగమంచు, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

  • Phani CH
  • Updated on: Jan 10, 2026
  • 5:40 pm

సంక్రాతికి దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీలో ఆ జిల్లాలకు అలెర్ట్!

సంక్రాంతి వేళ ఏపీలో వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా పండుగ రోజుల్లో వర్షాలు, ఈదురు గాలులు, సముద్రం అలజడి ఉంటుందని తెలిపింది. ఇది తుఫాన్‌గా మారే అవకాశం ఉందని, తీరప్రాంతాలకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. నెల్లూరు, తిరుపతి జిల్లాలపై ప్రభావం ఉంటుంది.

  • Phani CH
  • Updated on: Jan 9, 2026
  • 9:54 pm

దక్షిణాది రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు.. ఏపీకి భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. శ్రీలంక, తమిళనాడులో భారీ వర్షాలు, జనవరి 10, 11 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రకు వర్ష సూచన. సంక్రాంతి పండుగకు ముందు ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పోర్టులకు ఒకటో నంబరు హెచ్చరిక జారీ చేయబడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

  • Phani CH
  • Updated on: Jan 9, 2026
  • 7:00 pm

Rain Alert: వాయుగుండం ముప్పు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం మధ్యాహ్నం నాటికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని.. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది.

ప్రయాణికులకు గుడ్​ న్యూస్.. సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ, టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాయి. వేల సంఖ్యలో బస్సులు నడపనున్నారు. ముందస్తు రిజర్వేషన్లు, పాఠశాల సెలవులతో డిమాండ్‌ భారీగా పెరిగింది. ఈ బస్సులు జనవరి 8 నుంచి 19 వరకు అందుబాటులో ఉంటాయి, సురక్షిత ప్రయాణానికి ఏర్పాట్లు పూర్తిచేశారు.

  • Phani CH
  • Updated on: Jan 8, 2026
  • 7:50 pm

Weather Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి.. శుక్రవారం రాత్రి నాటికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఒకవైపు చలి.. మరోవైపు అల్పపీడనం నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం..

Weather Alert: బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం.. భారీ వర్షాలు?

ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ప్రాంతమైన తూర్పు-భూమధ్యరేఖ హిందూ మహా సముద్రంలో మంగళవారం (జనవరి 6) అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. అదే ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం వాయు గుండంగా బలపడింది. ఈ మేరకు నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారినట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది..

Telangana: తెలంగాణలో మళ్లీ పెరగనున్న చలి తీవ్రత

తెలంగాణలో జనవరి 5 నుండి 12 వరకు తీవ్రమైన చలిగాలులు, పొగమంచు ఆవహిస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. డిసెంబర్ మొదటి వారపు కోల్డ్‌వేవ్ పరిస్థితులు పునరావృతమవుతాయి. జనవరి 9 నుండి ఆంధ్రప్రదేశ్‌లోని తీర, రాయలసీమ ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

  • Phani CH
  • Updated on: Jan 6, 2026
  • 7:38 pm

Weather: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మళ్లీ పెరిగింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పొడి వాతావరణం ఉన్నప్పటికీ.. రాత్రి వేళల్లో చలి పెరుగుతోంది.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని.. ఇది వచ్చే రెండు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని పేర్కొంది..

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో మంగళవారం వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మళ్లీ చలి పులి పంజా మొదలైంది.. ఇటీవల కొంచెం పెరిగిన ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుతున్నాయి.. అయితే.. చాలా జాల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. వాతావరణ శాఖ మళ్లీ అలర్ట్ జారీ చేసింది.. సోమవారం నుంచి వారం పాటు ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుందని పేర్కొంది.

Weather Report: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ చూశారా..

తెలుగు రాష్ట్రాల్లో రాత్రిపూట చలి వణికిస్తోంది. ఇటీవల చాలా జాల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. అయితే.. రెండు రోజుల నుంచి చలి తీవ్రత కొంత మేర తగ్గింది. జనవరి నెల ప్రారంభంలో సాధారణ శీతాకాలం ఉన్నా, సంక్రాంతికి మళ్లీ చలి పెరిగి, చివరి వారం నుంచి తగ్గుముఖం పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.. 

తెలుగు రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా జాల్లాల్లో ఇటీవల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. అయితే.. రెండు రోజుల నుంచి కొంత తీవ్రత తగ్గినా.. మళ్లీ చలి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.