AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాతావరణం

వాతావరణం

విస్తారమైన భౌగోళిక, విభిన్న నైసర్గిక ఆకృతి వైవిధ్యమైన వాతావరణ పరిస్థితుల కారణంగా భారతదేశ వాతావరణాన్ని ఒకేలా వివరించలేము. దేశంలో వాతావరణం ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. అయితే మొత్తం మీద భారతదేశ వాతావరణాన్ని 4 ప్రధాన భాగాలుగా విభజించారు. శీతాకాలం (డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి), వేసవికాలం (మార్చి, ఏప్రిల్, మే), రుతుపవన వర్షాకాలం (జూన్ నుంచి సెప్టెంబరు), రుతుపవనాల అనంతర కాలం (అక్టోబర్ – నవంబర్)గా విభజించారు. వాతావరణ వార్తల్లో వర్షాలు, తుఫానులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. తుఫానులకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలను అందిస్తూ ప్రజలను అలర్ట్ చేస్తుంటారు.

వర్షాకాలం గురించి దేశంలో పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తారు. రైతులు సైతం పంటలను వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాట్లు వేస్తుంటారు. నైరుతి, ఈశాన్య రుతుపవనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటివల్లే దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. రెండు రుతుపవనాల ద్వారా వర్షాలు పడే ఏకైక ప్రాంతం ఈశాన్య భారతదేశం, దీని ఫలితంగానే ప్రపంచంలో ఎక్కువ వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది.

ఇంకా చదవండి

వినాయక చవితి వస్తున్నా వాన లేదు. మబ్బులే తప్ప చినుకు కరువు.. వర్షాలు లేక రైతుల్లో ఆందోళన

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం విచిత్రంగా మారింది. సెప్టెంబరు రెండో వారంలోనూ ఏపీలో ఎండలు, ఉక్కపోత కొనసాగుతుండగా పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో సెప్టెంబరు 13 నుంచి 17 వరకు భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు వర్షాభావంతో పంటలు ఎండిపోవడం, తాగునీటి కొరత, విద్యుత్‌ కోతలు రైతులు, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

  • Phani CH
  • Updated on: Sep 9, 2026
  • 4:57 pm

Weather Update: ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు, కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాం ప్రాంతాల్లో బుధవారం నుంచి శుక్రవారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు కొనసాగనున్నాయి. సెప్టెంబర్‌ 11 నాటికి పశ్చిమ మధ్య-వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Andhra Weather: ఏపీలో వర్ష సూచన.. పలు జిల్లాల్లో పిడుగులు

ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుండగా.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Weather Report: హమ్మయ్య వాన కబురు వచ్చింది.. ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు వర్షాలు! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!

ఏపీ, తెలంగాణకు మరోసారి భారత వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది. పశ్చిమ మధ్య-వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

  • Anand T
  • Updated on: Sep 8, 2026
  • 3:00 pm

Andhra: ఏపీ రైతులకు ఊరట.. వాన కబురు వచ్చేసిందోచ్..

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది.

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

తెలుగురాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచనలు జారీ చేసింది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాబట్టి ఏ జిల్లాల్లో వర్షాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

  • Anand T
  • Updated on: Sep 7, 2026
  • 2:25 pm

Rains: తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న వర్షాల జోరు.. వాతావరణశాఖ నుంచి చల్లని కబురు.. రాబోయే రెండ్రోజులు జాగ్రత్త..

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండ్రోేజుల పాటు పలు జిల్లాలకు వర్షసూచన జారీ చేసింది. పలు ప్రాంతాల్లో విస్తరంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ నెలలో వర్షాల జోరు పెరగనుంది.

అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో సోమవారం వెదర్ రిపోర్ట్

అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్ సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు సమాచారం. ఏపీలో గంటకు 30–50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

Rain Alert: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్‌.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్‌!

వర్షాల కోసం ఎదరుచూస్తున్న రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 6 ఆదివారం నాడు దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల కదిలిక చురుగ్గా ఉందని.. ఈ ప్రభావంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాబట్టి వాతావరణ శాఖ ప్రకారం.. ఏ ఏ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయో చూద్దాం.

  • Anand T
  • Updated on: Sep 6, 2026
  • 11:43 am

Weather Report: రైతన్నలకు గుడ్‌ న్యూస్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు.. ఇదిగో లెటెస్ట్‌ వెదర్ రిపోర్ట్!

ఆంధ్రప్రదేశ్ వాసులకు ఏపి విపత్తు నిర్వహణ సంస్థ చల్లటి కబురు చెప్పింది. బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ఏ జిల్లాలో వర్షాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

  • Anand T
  • Updated on: Sep 6, 2026
  • 6:21 am

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం.. పగలు ఉక్కపోత.. రాత్రికి జల్లులు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మరోసారి మారుతున్నాయి. సెప్టెంబర్‌ 4న పగటి వేళల్లో ఎండ, ఉక్కపోత కొనసాగినా అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పలు జిల్లాల్లో సాయంత్రం జల్లులు పడొచ్చు. ఏపీలో బలమైన గాలులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. ఇదే సమయంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌, జూరాల, తుంగభద్ర జలాశయాల్లో నీటి పరిస్థితులు, రైతుల సాగునీటి సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.

  • Phani CH
  • Updated on: Sep 4, 2026
  • 8:05 pm