వాతావరణం
విస్తారమైన భౌగోళిక, విభిన్న నైసర్గిక ఆకృతి వైవిధ్యమైన వాతావరణ పరిస్థితుల కారణంగా భారతదేశ వాతావరణాన్ని ఒకేలా వివరించలేము. దేశంలో వాతావరణం ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. అయితే మొత్తం మీద భారతదేశ వాతావరణాన్ని 4 ప్రధాన భాగాలుగా విభజించారు. శీతాకాలం (డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి), వేసవికాలం (మార్చి, ఏప్రిల్, మే), రుతుపవన వర్షాకాలం (జూన్ నుంచి సెప్టెంబరు), రుతుపవనాల అనంతర కాలం (అక్టోబర్ – నవంబర్)గా విభజించారు. వాతావరణ వార్తల్లో వర్షాలు, తుఫానులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. తుఫానులకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలను అందిస్తూ ప్రజలను అలర్ట్ చేస్తుంటారు.
వర్షాకాలం గురించి దేశంలో పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తారు. రైతులు సైతం పంటలను వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాట్లు వేస్తుంటారు. నైరుతి, ఈశాన్య రుతుపవనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటివల్లే దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. రెండు రుతుపవనాల ద్వారా వర్షాలు పడే ఏకైక ప్రాంతం ఈశాన్య భారతదేశం, దీని ఫలితంగానే ప్రపంచంలో ఎక్కువ వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ కి పడిపోయిన ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చలి తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. గత ఐదారు సంవత్సరాలలో ఎన్నడూ లేనంత చలి నమోదైందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఉత్తర భారత్ నుంచి వీస్తున్న శీతల గాలులు, తక్కువ తేమ, మేఘాలు లేకపోవడం దీనికి కారణాలని వివరించారు. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.
- Phani CH
- Updated on: Dec 22, 2025
- 7:45 pm
చంపేస్తోన్న చలి.. అత్యల్ప ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డ్
తెలుగు రాష్ట్రాలు, ఉత్తర భారతాన్ని చలిపులి గజగజ వణికిస్తోంది. తెలంగాణ, ఏపీలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోగా, హైదరాబాద్లోనూ 10 డిగ్రీల దిగువకు చేరాయి. సంగారెడ్డిలో 4.5°C నమోదైంది. పొగమంచు, హిమపాతంతో ఉత్తర భారతం ఉక్కిరిబిక్కిరవుతోంది. వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి, జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
- Phani CH
- Updated on: Dec 22, 2025
- 4:21 pm
దట్టమైన పొగమంచుతో నిండిన ఉత్తర భారతం.. పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ..!
ఉత్తర భారతం చలికి వణుకుతోంది. జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న మంచు చుక్కలు చూపిస్తోంది. ఎత్తైన భూభాగాల్లో హిమపాతం పెరిగి లోయలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జలవనరులు ఉన్న ప్రాంతాల్లోనైతే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చలికి నీళ్లే గడ్డ కట్టుకుపోతున్నాయి.
- Balaraju Goud
- Updated on: Dec 22, 2025
- 7:17 am
పెరుగుతున్న చలి తీవ్రత.. రానున్న రెండు రోజుల్లో మరింత పెరిగే అవకాశం
తెలుగు రాష్ట్రాలు, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా చలి తీవ్రత, పొగమంచు, కాలుష్యం పెరిగాయి. పటాన్చెరులో 7°, విశాఖ ఏజెన్సీలో 4°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
- Phani CH
- Updated on: Dec 20, 2025
- 7:40 pm
Weather Update: బాబోయ్ చలి.. గడపదాటాలంటే వణుకే
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత దారుణంగా పెరిగింది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, దట్టమైన పొగమంచు, చలిగాలులతో ప్రజలు వణికిపోతున్నారు. ఆదిలాబాద్లో పాఠశాల పనివేళలు మారాయి. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, పొగమంచులో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకీ దేశంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది.
- Phani CH
- Updated on: Dec 19, 2025
- 6:28 pm
Weather Update: వచ్చే రెండు రోజులూ జాగ్రత్త !! వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో నీళ్లు గడ్డకట్టేంత చలి, దట్టమైన మంచు పేరుకుపోతోంది. అరకు, పాడేరులలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోనూ పలుచోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్లు రికార్డయ్యాయి. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి.
- Phani CH
- Updated on: Dec 18, 2025
- 5:58 pm
Weather Alert: బాబోయ్.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వచ్చే 3 రోజుల వెదర్ అప్డేట్..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి చంపేస్తోంది.. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రతతో ప్రజలు గజ గజ వణికిపోపోతున్నారు. తెలంగాణలో దాదాపు అన్నిచోట్లా సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది..
- Shaik Madar Saheb
- Updated on: Dec 18, 2025
- 1:19 pm
Telangana: వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త.! బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలంగాణలో చలి చంపేస్తోంది. అన్ని ప్రాంతాల్లోనూ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కమ్మేసింది. పొగమంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. లైట్స్ వేసుకుని వెళ్తున్నా.. రహదారి కనిపించనంత స్థాయిలో పొగమంచు కమ్మేస్తోంది. ఆ వివరాలు ఇలా..
- Ravi Kiran
- Updated on: Dec 18, 2025
- 12:52 pm
Weather: బాబోయ్ చలి.. తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..
చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. హైదరాబాద్లో సైతం కోల్డ్ వేవ్స్ వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
- Shaik Madar Saheb
- Updated on: Dec 17, 2025
- 2:45 pm
గజ..గజ.. గజ.. ఇంత చలి ఎప్పుడూ లేదయ్యో..
తెలుగు రాష్ట్రాలను తీవ్రమైన చలి వణికిస్తోంది, ముఖ్యంగా తెలంగాణలో పదేళ్ల రికార్డులను బద్దలు కొడుతూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉత్తరాది గాలుల వల్ల ఈ పరిస్థితి నెలకొనగా, రాబోయే రెండు రోజులు పొగమంచుతో కూడిన చలి కొనసాగే అవకాశం ఉంది. ప్రయాణీకులు, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. గోరువెచ్చని నీరు, వెచ్చని ఆహారం తీసుకోవడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం.
- Phani CH
- Updated on: Dec 17, 2025
- 9:00 am
Weather Alert: వర్షాలు.. చలి.. బాబోయ్ వాతావరణం మొత్తం మారిపోయిందిగా.. ఇదిగో లేటెస్ట్ రిపోర్ట్..
గత 2 రోజులుగా ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల.. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని.. వాతావరణ శాఖ చెబుతోంది. రాబోయే రోజుల్లో అతిశీతల గాలులతోపాటు పొగమంచు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ లో వచ్చే మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై కీలక ప్రకటన చేసింది.
- Shaik Madar Saheb
- Updated on: Dec 16, 2025
- 3:30 pm
Telangana Cold Wav: వచ్చే రెండు రోజులు అలర్ట్… చలి తీవ్రతపై ఐఎండీ వార్నింగ్
తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ఉత్తర జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. కొమురంభీం ఆసిఫాబాద్లోని సిర్పూర్లో 8.9°C నమోదైంది. పశ్చిమ గాలులు, తేమ తగ్గడం కారణం. వృద్ధులు, పిల్లలకు ముప్పు హెచ్చరికలు. రాబోయే 2 రోజులు చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా. ప్రజలు వెచ్చని దుస్తులు, పానీయాలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
- Phani CH
- Updated on: Dec 15, 2025
- 9:37 pm