AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాతావరణం

వాతావరణం

విస్తారమైన భౌగోళిక, విభిన్న నైసర్గిక ఆకృతి వైవిధ్యమైన వాతావరణ పరిస్థితుల కారణంగా భారతదేశ వాతావరణాన్ని ఒకేలా వివరించలేము. దేశంలో వాతావరణం ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. అయితే మొత్తం మీద భారతదేశ వాతావరణాన్ని 4 ప్రధాన భాగాలుగా విభజించారు. శీతాకాలం (డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి), వేసవికాలం (మార్చి, ఏప్రిల్, మే), రుతుపవన వర్షాకాలం (జూన్ నుంచి సెప్టెంబరు), రుతుపవనాల అనంతర కాలం (అక్టోబర్ – నవంబర్)గా విభజించారు. వాతావరణ వార్తల్లో వర్షాలు, తుఫానులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. తుఫానులకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలను అందిస్తూ ప్రజలను అలర్ట్ చేస్తుంటారు.

వర్షాకాలం గురించి దేశంలో పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తారు. రైతులు సైతం పంటలను వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాట్లు వేస్తుంటారు. నైరుతి, ఈశాన్య రుతుపవనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటివల్లే దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. రెండు రుతుపవనాల ద్వారా వర్షాలు పడే ఏకైక ప్రాంతం ఈశాన్య భారతదేశం, దీని ఫలితంగానే ప్రపంచంలో ఎక్కువ వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది.

ఇంకా చదవండి

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

తుఫాను ప్రభావం.. పలు జిల్లాల్లో భారీవర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడినా, తమిళనాడులో రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు. నెల్లూరు, తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయం, వాగులు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు దెబ్బతిన్నాయి, పాఠశాలలకు సెలవులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

  • Phani CH
  • Updated on: Dec 4, 2025
  • 6:43 pm

Weather Report: అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో మరో 2 రోజులు దంచికొట్టుడే! పిడుగులు పడే ఛాన్స్‌

దిత్వా తుపాను బలహీనపడి రెండు రోజుల క్రితం వాయుగుండంగా మారిన సంగతి తెలిసిందే. అది బుధవారం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో మరో రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గురువారం వాతావరణం ఎలా ఉంటుందంటే..

Weather Alert: మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

దిత్వా తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ వచ్చే మూడు రోజులు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం, వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి రోజున ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలు, పరిసర ప్రాంతాలలో నున్న వాయుగుండం ఈరోజు అల్పపీడనంగా అదే ప్రాంతంలో కొనసాగింది.

దిత్వా ప్రభావం.. ఏపీలో అత్యంత భారీ వర్షాలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు, మిచాంగ్ తుఫాన్ కారణంగా చెన్నై అతలాకుతలమైంది. భారీ వర్షాలతో రోడ్లు, మార్కెట్లు మూసివేశారు, జనజీవనం స్తంభించింది. రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై పూర్తి నివేదిక.

  • Phani CH
  • Updated on: Dec 2, 2025
  • 8:10 pm

వామ్మో.! తుఫాన్.. ఏపీలో ఆ జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్స్

నైరుతి బంగాళాఖాతంలో 'దిత్వా' తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. తీరం వెంబడి గంటకు 80 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. NDRF బృందాలు మోహరించి, అధికారులు సహాయక చర్యలకు సన్నద్ధమయ్యారు.

  • Phani CH
  • Updated on: Dec 1, 2025
  • 2:51 pm

AP Rain Alert: వామ్మో.. ఆ జిల్లాలో భారీ వర్షాలు.. అప్రమత్తమైన యత్రాంగం.. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు!

దిత్వా తుఫాను వేగం పెంచింది. సముద్ర తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తోంది. ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి, దక్షిణ కోస్తాకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ చేసింది. దీంతో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉంటుందన్న సంకేతం ఇచ్చింది. ఈ తుఫాన్ చెన్నైకి చేరువై సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉన్నా.. చలి తీవ్రతను పెంచింది. అయినా రాష్ట్రంలోని పలు జిల్లాలో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Weather Update: తెలుగు రాష్ట్రాలపై తుఫాన్ దిత్వ ఎఫెక్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులు

Cyclone Ditwa Updates: శ్రీలంకను తుడిచేసి, తమిళనాడును ముంచేసిన దిత్వా తుఫాన్‌ ఇప్పుడు ఏపీ దిశగా దూసుకొస్తోంది. ఈ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వర్ష ప్రభావిత జిల్లాల్లోని స్కూల్‌లు, పాఠశాలలకు సెలువు కూడా ప్రకటించారు అధికారులు. ఇక దిత్వా ఎఫెక్ట్ ఏపీ పైనే కాకుండా తెలంగాణ పై కూడా కొనసాగుతుంది. ఈ ప్రభావంతలో తెలంగాణలోనూ పలు జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

  • Anand T
  • Updated on: Dec 1, 2025
  • 7:25 am

Andhra: విద్యార్థులకు అలెర్ట్.. సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించిన అధికారులు

దిత్వా తుఫాన్ కారణంగా సముద్రం అలజడిగా ఉంటుందని.. ఏపీలోని మత్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. కోస్తాతీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాదు పలు జిల్లాలోని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రటించారు.

Rain Alert: తెలంగాణలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

Cyclone Ditwah Update: దిత్వా తుఫాను దూసుకొస్తుంది.. ఇప్పటికే అతలాకుతలం అవుతున్న తమిళనాడు, పుదుచ్చేరికి మరింత ముప్పు పొంచి ఉంది. ఏపీలో తెల్లారే సరికి ఎప్పుడైనా ఫ్లాష్ ఫ్లడ్ రావచ్చంటూ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. తెలంగాణలో వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది.