AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాతావరణం

వాతావరణం

విస్తారమైన భౌగోళిక, విభిన్న నైసర్గిక ఆకృతి వైవిధ్యమైన వాతావరణ పరిస్థితుల కారణంగా భారతదేశ వాతావరణాన్ని ఒకేలా వివరించలేము. దేశంలో వాతావరణం ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. అయితే మొత్తం మీద భారతదేశ వాతావరణాన్ని 4 ప్రధాన భాగాలుగా విభజించారు. శీతాకాలం (డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి), వేసవికాలం (మార్చి, ఏప్రిల్, మే), రుతుపవన వర్షాకాలం (జూన్ నుంచి సెప్టెంబరు), రుతుపవనాల అనంతర కాలం (అక్టోబర్ – నవంబర్)గా విభజించారు. వాతావరణ వార్తల్లో వర్షాలు, తుఫానులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. తుఫానులకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలను అందిస్తూ ప్రజలను అలర్ట్ చేస్తుంటారు.

వర్షాకాలం గురించి దేశంలో పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తారు. రైతులు సైతం పంటలను వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాట్లు వేస్తుంటారు. నైరుతి, ఈశాన్య రుతుపవనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటివల్లే దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. రెండు రుతుపవనాల ద్వారా వర్షాలు పడే ఏకైక ప్రాంతం ఈశాన్య భారతదేశం, దీని ఫలితంగానే ప్రపంచంలో ఎక్కువ వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది.

ఇంకా చదవండి

Weather Alert: చల్లని కబురంటే ఇది మావ.. అల్పపీడనంతో వచ్చే 4 రోజులు వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు పెరిగిపోయాయి. ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. వడగాలులు కూడా పెరగడంతో వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. ఉపరితల ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

Weather Alert: 48 గంటల్లో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా కోస్తాంధ్ర తీరప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుంది.. దీంతోపాటు.. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Weather Forecast: మండె ఎండల్లో చల్లటి కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తే ఛాన్స్

ఆంధ్రప్రదేశ్‌ వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఆదివారం భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నట్టు పేర్కొంది. కొన్ని జిల్లాలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైతే మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కరిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాబట్టి ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుందో చూద్దాం.

  • Anand T
  • Updated on: May 10, 2026
  • 6:49 am

Weather Alert: ఒక్కసారిగా మారిన వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వానలు.. వెదర్ రిపోర్ట్ చూశారా..?

తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండల నుంచి ఉపశమనం లభించింది.. చల్లని కబురు చెబుతూ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడనున్నాయి. శని, ఆదివారాల్లో వర్షాలు కురిస్తాయి.. ఆ తర్వాత తిరిగి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.

Weather Update: పగలు మండే ఎండలు.. సాయంత్రానికి చిరుజల్లులు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనుహ్యంగా మారుతోంది. ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు, మరోవైపు అధిక ఉష్ణోగ్రతలతో వడగాల్పులు ప్రజలను, రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాబోయే రెండు రోజులు ఈ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. పిడుగులు, వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

  • Phani CH
  • Updated on: May 9, 2026
  • 12:13 pm

Rain Alert: ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయి. అయితే గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు ఉండదు. మీ ప్రాంత వాతావరణ సూచనలు ఇక్కడ తెలుసుకోండి.

Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే

నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు. అయితే ప్రస్తుతం మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. పగటిపుట ఉష్ణోగ్రతలు ఏకంగా ఐదు డిగ్రీలు తగ్గాయి. దీంతో రాష్ట్రంలో 40 డిగ్రీలకే అత్యధిక ఉష్ణోగ్రతలు పరిమితమైనాయి. మరో రెండు మూడు రోజులపాటు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని

Rain Alert: అక్కడ వర్షాలు, ఇక్కడ ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఎండలు కొనసాగుతూనే వర్షాలు కురుస్తాయని నివేదిక పేర్కొంది.

Weather Alert: ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. ఈ క్రమంలో ఎండల ఉపశమనం లభించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన జల్లులు ఉంటాయని, ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు తగ్గుతాయని అంచనా.

Weather Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్‌.. భిన్న వాతావరణం తో అకాల వర్షాలు

ఏపీ, తెలంగాణలో విభిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు అకాల వర్షాలు పంటలను దెబ్బతీస్తున్నాయి, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు వడ్లు, మొక్కజొన్నలు నీట మునిగాయి. అయితే, ఈ వర్షాలు తాత్కాలికమేనని, రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మళ్లీ పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

  • Phani CH
  • Updated on: May 6, 2026
  • 5:43 pm

Weather Report: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగుపాటు హెచ్చరికలు జారీ..

తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రతతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణశాఖ క్యూల్ న్యూస్ అందించింది. రాబోయే నాలుగు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వానలు కొనసాగనున్నాయి. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు ఇచ్చారు.

Weather Report: మండే ఎండల్లో అకాల వర్షాలు.. ఈ జిల్లాల్లో వచ్చే 3రోజులు వానలే వానలు..

ఆంధ్రప్రదేశ్ వాసులకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని.. రాబోయే మూడు రోజులు కూడా కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం ఉండే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

  • Anand T
  • Updated on: May 5, 2026
  • 8:16 pm