AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాతావరణం

వాతావరణం

విస్తారమైన భౌగోళిక, విభిన్న నైసర్గిక ఆకృతి వైవిధ్యమైన వాతావరణ పరిస్థితుల కారణంగా భారతదేశ వాతావరణాన్ని ఒకేలా వివరించలేము. దేశంలో వాతావరణం ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. అయితే మొత్తం మీద భారతదేశ వాతావరణాన్ని 4 ప్రధాన భాగాలుగా విభజించారు. శీతాకాలం (డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి), వేసవికాలం (మార్చి, ఏప్రిల్, మే), రుతుపవన వర్షాకాలం (జూన్ నుంచి సెప్టెంబరు), రుతుపవనాల అనంతర కాలం (అక్టోబర్ – నవంబర్)గా విభజించారు. వాతావరణ వార్తల్లో వర్షాలు, తుఫానులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. తుఫానులకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలను అందిస్తూ ప్రజలను అలర్ట్ చేస్తుంటారు.

వర్షాకాలం గురించి దేశంలో పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తారు. రైతులు సైతం పంటలను వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాట్లు వేస్తుంటారు. నైరుతి, ఈశాన్య రుతుపవనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటివల్లే దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. రెండు రుతుపవనాల ద్వారా వర్షాలు పడే ఏకైక ప్రాంతం ఈశాన్య భారతదేశం, దీని ఫలితంగానే ప్రపంచంలో ఎక్కువ వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది.

ఇంకా చదవండి

Weather Update: దంచికొడుతోన్న ఎండలు.. ఈ ఏడాది దబిడిదిబిడే

దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మార్చిలోనే అసాధారణ ఎండలు మండుతున్నాయి. భారత వాతావరణ శాఖ 12 రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. సాధారణంగా ఏప్రిల్, మేలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఇప్పుడే 40 డిగ్రీల వద్ద నమోదవుతున్నాయి. ఎల్ నినో ప్రభావంతో వడగాల్పులు పెరుగుతాయని ఐఎండీ తెలిపింది. ప్రజలు 11-3 గంటల మధ్య అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

  • Phani CH
  • Updated on: Mar 10, 2026
  • 12:16 pm

Weather Alert: అక్కడ వర్షాలు.. ఇక్కడ ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 38 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి.. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.

Telangana: తెలంగాణపై భానుడి ఉగ్రరూపం.. 6 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

తెలంగాణలో ఈసారి వేసవి ముందుగానే మొదలైంది. మార్చి ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫిబ్రవరి నుంచే తీవ్రత ప్రారంభం కావడం ఆందోళన కలిగిస్తోంది. ములుగులో 39°C నమోదు కాగా, పలు జిల్లాల్లో 40°C దాటే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ భద్రాద్రి, ఖమ్మం వంటి 7 జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర భారతం నుండి వీస్తున్న వేడి గాలులు ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణం.

  • Phani CH
  • Updated on: Mar 8, 2026
  • 5:20 pm

AP Weather: ఏపీకి ఎండల పై హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!

ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర వేసవి హెచ్చరికలు జారీ చేశాయి. ఈ ఏడాది రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, మార్చి నుంచే అధిక వడగాల్పులు ఉంటాయని అంచనా. శ్రీకాకుళం, ప్రకాశం, కృష్ణా, గుంటూరు సహా పలు జిల్లాలకు ముప్పు పొంచి ఉంది. ప్రజలు ప్రయాణాలు తగ్గించుకొని, తగినంత నీరు తాగుతూ అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

  • Phani CH
  • Updated on: Mar 7, 2026
  • 5:14 pm

Weather: అలర్ట్.. ఆదివారం ఈ ప్రాంతంలో వర్షాలు.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి.. మార్చి మొదటి వారంలోనే.. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనంతోపాటు.. ద్రోణి కొనసాగుతుందని.. వీటి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొంది.

Heatwave Alert: మండుతున్న సూర్యుడు.. మరి రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?

ఈ సారి ఎండాకాలం ముందే వచ్చేసింది. ఫిబ్రవరి చివరి వారం నుంచే మండిపోయే ఎండలు జనాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇక మార్చి మొదటి వారంలో అయితే మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థిలు నెలకొన్నాయి. అయితే రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉండనున్నాయని తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

  • Anand T
  • Updated on: Mar 7, 2026
  • 9:03 am

Summer Safety Tips: ఎండ వేడి నుంచి ఉపశమనం కావాలా.. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ టిప్స్‌ ఫాలో అవ్వాల్సిందే

వేసవిలోకి పూర్తిగా ప్రవేశించకుండానే భానుడి తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. మార్చి మొదటి వారంలోనే మాడు పగిలే ఎండలు జనాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అయితే రాబోయే ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత రికార్డ్ స్థాయిలో నమోదవుతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మనం ఎండ ప్రభావానికి గురికాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి వేసవిలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

  • Anand T
  • Updated on: Mar 5, 2026
  • 10:16 am

AP, TS Heatwave: అప్పుడే భగ్గుమంటున్న భానుడు.. మరి ఏప్రిల్, మేలో ఎండలు ఎలా ఉండనున్నాయంటే?

రాష్ట్రంలో ఎండలు నెమ్మదిగా ముదురుతున్నాయి. మార్చి మొదట వారం నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో బయటికెళ్తే చెమటలు కక్కిస్తున్నాడు. దీంతొ బయట అడుగు పెట్టేటాలంటేనే జనం భయపడుతున్నారు. ఇక ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో భానుడు ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం పదండి.

  • Anand T
  • Updated on: Mar 5, 2026
  • 9:15 am

మండుతున్న ఎండలు! మార్చి నెల మొదటి నుంచే మొదలైన వేడిగాలులు.. ముప్పు తప్పదా?

ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో కీలక మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. గత మూడు సంవత్సరాలలో అత్యంత వేడి నెలగా ఈ ఏడాది ఫిబ్రవరి నెల రికార్డు్ సృష్టించింది. అంతేకాకుండా, మార్చి కూడా మండే ఎండలు, తీవ్రమైన వేడితో ప్రారంభమైంది. ఈ సంవత్సరం వేడిగాలులు ఏ రికార్డులను బద్దలు కొడతాయో ఆందోళన వ్యక్తమవుతోంది.

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. మున్ముందు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.

Weather: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు, వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది..

Weather Alert: రేపట్నుంచే ఉక్కపోత.. మార్చి 1 నుంచి మాడు పగిలే ఎండలతో హఢల్!

అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజుల నుంచి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని మాఠ్వాడా వరకు వ్యాపించి ఉన్న ద్రోణి వాయువ్య దిశగా కదులుతుంది. దీని ప్రభావంతో శుక్రవారం సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని..