Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాతావరణం

వాతావరణం

విస్తారమైన భౌగోళిక, విభిన్న నైసర్గిక ఆకృతి వైవిధ్యమైన వాతావరణ పరిస్థితుల కారణంగా భారతదేశ వాతావరణాన్ని ఒకేలా వివరించలేము. దేశంలో వాతావరణం ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. అయితే మొత్తం మీద భారతదేశ వాతావరణాన్ని 4 ప్రధాన భాగాలుగా విభజించారు. శీతాకాలం (డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి), వేసవికాలం (మార్చి, ఏప్రిల్, మే), రుతుపవన వర్షాకాలం (జూన్ నుంచి సెప్టెంబరు), రుతుపవనాల అనంతర కాలం (అక్టోబర్ – నవంబర్)గా విభజించారు. వాతావరణ వార్తల్లో వర్షాలు, తుఫానులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. తుఫానులకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలను అందిస్తూ ప్రజలను అలర్ట్ చేస్తుంటారు.

వర్షాకాలం గురించి దేశంలో పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తారు. రైతులు సైతం పంటలను వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాట్లు వేస్తుంటారు. నైరుతి, ఈశాన్య రుతుపవనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటివల్లే దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. రెండు రుతుపవనాల ద్వారా వర్షాలు పడే ఏకైక ప్రాంతం ఈశాన్య భారతదేశం, దీని ఫలితంగానే ప్రపంచంలో ఎక్కువ వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది.

ఇంకా చదవండి

Weather Alert: సూరీడుతో జర జాగ్రత్త.. ఇవ్వాల్టి నుంచి చుక్కలేనట..! తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. ఎండవేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే.. ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి..

Weather: అటు ఎండలు.. ఇటు వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. ఓ వైపు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి.. ఓ వైపు ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు.. రెండు మూడు రోజుల నుంచి తగ్గిన ఉష్ణోగ్రతలతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.

Rain Alert: మండే ఎండల్లో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపింది. ద్రోణి కారణంగా మరికొద్ది రోజులు ఈ రకమైన పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది. మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇవ్వాల్టి వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకోండి..

చల్ల చల్లని కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మండే ఎండాకాలంలో కురిసిన వానతో వెదర్‌ కూల్‌కూల్‌ అయిపోయింది. కానీ.. పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షం.. అన్నదాతలను ఆగమాగం చేసింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. కొన్ని ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పింది.

Telagana: తెలంగాణలో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం.. పలు చోట్ల వడగండ్ల వాన

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మండే ఎండాకాలంలో కురిసిన వానతో వెదర్‌ కూల్‌కూల్‌ అయిపోయింది. కానీ.. పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షం.. అన్నదాతలను ఆగమాగం చేసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం చాలా చోట్ల బీభత్సం సృష్టించింది. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

ఏపీలోని కొన్ని జిల్లాలో మండే ఎండలు.. ఇంకొన్ని జిల్లాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

ఏపీలో ఎండలు మండపోనున్నాయి. మధ్యలో వర్షాలు కూడా దంచి కొట్టనున్నాయి. అవును.. ఈ మేరకు వాతావరణ శాఖ వెదర్ అప్ డేట్ ఇచ్చింది. ఇంతకీ ఏ జిల్లాల్లో ఎండలు దంచికొట్టనున్నాయి..? ఏ జిల్లాల్లో వర్షాలు పడే చాన్స్ ఉంది.. డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

Weather: మండుటెండల్లో కూల్ న్యూస్.. ఈ ప్రాంతానికి వర్షసూచన.. ఏపీ, తెలంగాణ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. ఎండవేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారు.. వేడి గాలులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Weather: ఇదేం వాతావరణం బాబోయ్..! ఉదయం మంచు తెర… ఆ తరువాత భానుడి సెగ..!

ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటలకు ఉక్కపోత మొదలవుతోంది. వేకువ జామున పొగమంచు కమ్మేస్తుంది. ఉదయం ఎనిమిది గంటల కల్లా ఎండ తీవ్రత మొదలవుతుంది. ఒక్కసారిగా వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకోవడం.. ఉదయం దుప్పటి మంచు, ఆ తరువాత భానుడు తన ప్రతాపం చూపించటంతో మద్యాహ్నం12 గంటలకు ఎండ తీవ్రత పెరిగి రహదారులు నిర్మానుషంగా మారుతున్నాయి.

Heatwave: మార్చిలోనే మాడు పగులతోంది.. ఇక ఏప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

మార్చిలోనే మాడు పగులతోంది. ఇక ఏప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో. ఊహించుకుంటేనే భయం వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఎలా ఉన్నాయి. ఏ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు.? వాతావరణశాఖ హెచ్చరికలు ఏంటి..? తెలగు రాష్ట్రాల్లో వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది.. అనే వివరాలను ఒకసారి చూడండి..

ప్రజలకు సన్ అలర్ట్.. 40 డిగ్రీలు దాటేసింది.. ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు

భాస్కరుడు బెంబేలెత్తిస్తున్నాడు..! బయటకొచ్చారా… మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాడు. ఉదయం తొమ్మిది గంటల నుంచే చుక్కులు చూపిస్తుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రమైనా భూమి సెగలు పొగలు కక్కుతూనే ఉంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.