AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆ మూడు గంటలు..! ఘాట్ రోడ్ లో ఆర్టీసీ ప్రయాణికుల నరకయాతన..!

Visakhapatnam: బస్సు ఆగిపోయిన విషయాన్ని డ్రైవర్.. విశాఖ డిపో ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారులు నర్సీపట్నం డిపోకు చెందిన బస్సును పంపించి బస్సులో ఉన్న ప్రయాణికులను భద్రాచలం తీసుకెళ్లారు. ఈ లోగా మరికొంతమంది ప్రైవేట్ వాహనాల్లో గమ్యస్థానాలకు వెళ్లారు. భద్రాచలం వెళ్లే మరికొంత మంది ప్రయాణికులు మాత్రం పాపం సుమారు మూడు గంటల పాటు బస్సులోనే నిరీక్షించారు.

Andhra Pradesh: ఆ మూడు గంటలు..! ఘాట్ రోడ్ లో ఆర్టీసీ ప్రయాణికుల నరకయాతన..!
Passengers Suffered
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Nov 15, 2023 | 2:06 PM

Share

విశాఖపట్నం, నవంబర్15;

అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో కండిషన్ లేని బస్సులను నడుపుతుండడంతో నిత్యం ఘాట్ రోడ్లో బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా మరోసారి ఏపీ ఆర్టీసీ బస్సు అడవిలో ఆగిపోయింది. దీంతో 3 గంటలపాటు ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అసలేం జరిగింది..

ఇవి కూడా చదవండి

– విశాఖపట్నం డిపోకు చెందిన విశాఖపట్నం- భద్రాచలం వయా సీలేరు మీదుగా నడిచే అల్ట్రా డీలక్స్ సర్వీస్ సప్పర్ల ఘాట్ రోడ్లో ఆగిపోయింది. దట్టమైన అటవీ ప్రాంతంలో సాంకేతిక లోపాలు తలెత్తి బస్సు నిలిచిపోయింది. ఈ బస్సులో సీలేరు , ధారకొండ, మోతిగూడెం, భద్రాచలం కు చెందిన దాదాపు 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. అడవిలో మూడు గంటల పాటు ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. బస్సులో మహిళలు పిల్లలు కూడా ఉన్నారు.

ఆ మూడు గంటలు..!

– బస్సు ఆగిపోయిన విషయాన్ని డ్రైవర్.. విశాఖ డిపో ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారులు నర్సీపట్నం డిపోకు చెందిన బస్సును పంపించి బస్సులో ఉన్న ప్రయాణికులను భద్రాచలం తీసుకెళ్లారు. ఈ లోగా మరికొంతమంది ప్రైవేట్ వాహనాల్లో గమ్యస్థానాలకు వెళ్లారు. భద్రాచలం వెళ్లే ఆరుగురు ప్రయాణికులు సుమారు మూడు గంటల పాటు బస్సులోనే నిరీక్షించారు.

– దట్టమైన అటవీ ప్రాంతంలో బస్సు ఆగిపోవడంతో నానా అవస్థలు పడ్డారు ప్రయాణికులు. సిలేరు వచ్చి భోజనాలు చేసి భద్రాచలం బయలుదేరారు.. ఘాట్ రోడ్ లో కండిషన్లో ఉన్న బస్సులను నడపాలని కోరుతున్నారు ప్రయాణికులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us