ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి
యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లి శివార్లలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు స్పాట్లోనే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వారిని హైదరాబాద్కు తరలించారు. మృతులు ఇబ్రహీంపట్నం శ్రీహిందూ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్గా గుర్తించారు. బొమ్మలరామారంలోని శ్రీబృందావన్ ఫామ్హౌస్లో ఏర్పాటు చేసిన వీడ్కోలు పార్టీకి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు […]
యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లి శివార్లలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు స్పాట్లోనే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వారిని హైదరాబాద్కు తరలించారు.
మృతులు ఇబ్రహీంపట్నం శ్రీహిందూ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్గా గుర్తించారు. బొమ్మలరామారంలోని శ్రీబృందావన్ ఫామ్హౌస్లో ఏర్పాటు చేసిన వీడ్కోలు పార్టీకి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు చైతన్య, ప్రణతి, స్ఫూర్తి, వినీత్లుగా పోలీసులు గుర్తించారు. వారిలో స్ఫూర్తి ఎల్బీనగర్కు చెందినదిగా.. చైతన్యది సరూర్నగర్లోని గాయత్రినగర్ అని పోలీసులు నిర్దారణకు వచ్చారు. వినీత్, ప్రణతి వివరాల కోసం పోలీసులు విచారణ చేపట్టారు. కాగా అతివేగంగా కారును నడపటం వలనే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.