AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konaseema: గత పదిరోజులుగా విద్యుత్ కోతలు.. ఉక్కబోత తక్కుకోలేకపోతున్నాం అంటూ అర్ధరాత్రి బాధితుల ఆందోళన..

అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని పాశర్లపూడి సెంటర్లో అర్ధరాత్రి రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు నాలుగు గ్రాములు ప్రజలు. తమ గ్రామాల్లో గత పది రోజులుగా కరెంట్ లేక అంధకారంలోనే ఉంటున్నామని.. దీనికి తోడు ఎండ వేడికి తట్టుకో లేకపోతున్నామని.. మరోవైపు ఉక్క పోతతో అలమటిస్తున్నామని నాలుగు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Konaseema: గత పదిరోజులుగా విద్యుత్ కోతలు.. ఉక్కబోత తక్కుకోలేకపోతున్నాం అంటూ అర్ధరాత్రి బాధితుల ఆందోళన..
Konaseema
Surya Kala
|

Updated on: Jun 17, 2023 | 9:00 AM

Share

వేసావి కాలం నుంచి వర్షాకాలంలో అడుగు పెట్టె సమయం వచ్చినా ఎక్కడా భానుడు తన ప్రతాపాన్ని తగ్గించడం లేదు. రోజు రోజుకీ భానుడు భగభగలతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు వీలైనంత వరకూ ప్రజలు ఇంట్లోనే ఉంటున్నారు. అత్యవసరం అయితే తప్ప రోడ్డుమీదకు రావడం లేదు. ఓ వైపు వేసవి తాపంతో ఇబ్బంది పడుతున్న కోనసీమ వాసులను మరోవైపు కరెంట్ కష్టాలు వెంటాడుతున్నాయి. కరెంట్ కోతలతో ఉక్కపోతకు ఊపిరాడడం లేదంటూ జిల్లాలోని నాలుగు గ్రామ ప్రజలు అర్ధ రాత్రి రోడ్డు ఎక్కారు. వివరాల్లోకి వెళ్తే..

అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని పాశర్లపూడి సెంటర్లో అర్ధరాత్రి రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు నాలుగు గ్రాములు ప్రజలు. తమ గ్రామాల్లో గత పది రోజులుగా కరెంట్ లేక అంధకారంలోనే ఉంటున్నామని.. దీనికి తోడు ఎండ వేడికి తట్టుకో లేకపోతున్నామని.. మరోవైపు ఉక్క పోతతో అలమటిస్తున్నామని నాలుగు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము విద్యుత్ అధికారులకు ఎన్ని  సార్లు ఫోన్ చేసిమా ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందని ఆరోపిస్తున్నారు. తమ బాధను తాము పడుతున్న ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ స్థితికి చేరుకున్నామని.. అందుకనే అర్ద రాత్రి రోడ్డు ఎక్కామని కరెంటు కోతలు బాధితుల చెబుతున్నారు.

విద్యుత్ ఆఫీస్ వద్ద అధికారులను కలిసిన బాధితులు.. గత 10 రోజులుగా విద్యుత్ సరిగా లేకపోవడంతో ఉక్కపోతతో అలమటిస్తున్నామని ముఖ్యంగా వృద్దులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. తమకు తక్షణం విద్యుత్ సరఫరాను ఇవ్వాలంటూ ఎలక్రిక్ట్ అధికారులను మిలదీశారు నాలుగు గ్రామాల ప్రజలు. అంతేకాదు తమ గ్రామాలకు తక్షణం కరెంటు కోతలు లేకుండా చూడాలని లేని పక్షంలో ఆందోళనా తీవ్రతరం చేస్తామని ఎలక్ట్రికల్ అధికారులను హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ టాలీవుడ్ నటుడు ఒకప్పుడు చిరంజీవి ఇంటికి ఇటుకలు మోశాడని తెలుసా?
ఈ టాలీవుడ్ నటుడు ఒకప్పుడు చిరంజీవి ఇంటికి ఇటుకలు మోశాడని తెలుసా?
ఆ సినిమా ఇప్పుడు వస్తే సూపర్ హిట్ అయ్యేది..
ఆ సినిమా ఇప్పుడు వస్తే సూపర్ హిట్ అయ్యేది..
పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ
కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!
కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!
పాలక్ పన్నీరు కూర ఇలా వండి తింటే.. ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు
పాలక్ పన్నీరు కూర ఇలా వండి తింటే.. ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు
ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కోరోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు..ఏంటని ఆరా తీయగా
ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కోరోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు..ఏంటని ఆరా తీయగా
వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? బయట పడ్డ నమ్మలేని నిజాలు
వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? బయట పడ్డ నమ్మలేని నిజాలు
బాబర్‌తోపాటు పాక్ కెప్టెన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ?
బాబర్‌తోపాటు పాక్ కెప్టెన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ?
తెలంగాణ డీఈఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌
తెలంగాణ డీఈఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌