Tomato Price: సామాన్యులను కన్నీరు పెట్టిస్తున్న కూరగాయల ధరలు.. చికెన్‌తో పోటీపడుతున్న టమాటా.. కిలో వందకు చేరువలో..

Tomato Price: ఆంధ్ర ప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా ఉల్లిపాయ, టమాటా ధరలకు సామాన్యుల..

Tomato Price: సామాన్యులను కన్నీరు పెట్టిస్తున్న కూరగాయల ధరలు.. చికెన్‌తో పోటీపడుతున్న టమాటా.. కిలో వందకు చేరువలో..
Tomato Price
Follow us

|

Updated on: Nov 17, 2021 | 9:14 AM

Tomato Price: ఆంధ్ర ప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా ఉల్లిపాయ, టమాటా ధరలకు సామాన్యుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో పంటలు నీట మునిగాయి. దీంతో నాన్ వెజ్ ధరలతో టమాటా , ఉల్లిపాయ ధరలు పోటీ పడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లోనూ ఉండే టమాటా వైపు చూడాలంటే భయమేస్తుందని వాపోతున్నారు. గత నెల రోజులక్రితం రూ. 30 లు ఉండగా… తాజాగా రూ. 100 లకు చేరుకుంది. రిటైల్ మార్కెట్లోనే కాదు.. వ్యవసాయ మార్కెట్ లో కూడా ఎన్నడూ లేనంతగా టమాటా ధర ఆకాశాన్ని తాకుతుండడంతో ఏమి కొనాలి ఏమి తినాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఏపీలో టమాటాకు పుట్టినిల్లుగా భావించే చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా కిలో టమాటా ఏకంగా రూ. 100 పలికింది. దీనికి కారణం ఏపీలో కురుస్తున్న వర్షాలు అని వ్యాపారాలు చెబుతున్నారు.

మదనపల్లె వ్యవసాయ మార్కెట్ నుంచి తూర్పు, ఉత్తరాంధ్ర,  తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు టమాటాలు ఎగుమతి అవుతున్నాయి. నాణ్యమైన టమాటా ధరలు కిలో రూ.6 నుంచి రూ.14 వరకు హోల్‌సేల్‌లో విక్రయించేవారు. సెప్టెంబర్ చివరిలో మార్కెట్, గత వారంలో రూ. 50-70కి చేరుకుంది. అయితే ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా కిలో టమాటా ఏకంగా రూ. 100 పలికింది. మరోవైపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కూరగాయల మార్కెట్‌లోనూ టమాటా ధర భారీగా ఉంది. రెండు రోజుల క్రితం ఇక్కడ కిలో టమాటా ధర రూ. 50-60 మధ్య ఉండగా.. ఇప్పుడు రూ. 100కు చేరింది. 28 కిలోలు ఉండే క్రేట్ ధర మార్కెట్‌లో గరిష్ఠంగా రూ. 2,800 పలికింది.

నిన్నమొన్నటివరకూ కిలో రూ. 20 నుంచి రూ. 30 వరకూ ఉన్న కిలో కూరగాయలు వర్షాలతో ఒక్కసారిగా పెరిగిపోయాయి. కొన్ని కూరగాయల ధరలు కిలోకు వంద రూపాయలకు చేరువలో ఉన్నాయి. మరికొన్ని 50 రూపాయాలకు తక్కువ కాకుండా ఉన్నాయి. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఓ వైపు కరోనాతో అంతంత మాత్రంగా ఉన్న ఆర్ధిక పరిస్థితిలో సామాన్యులు, మధ్య తరగతివారు ఇప్పుడు పెరుగుతున్న కూరగాయల ధరలకు విలవిలలాడుతున్నారు. ఏమి కొనాలి, ఏమి తినాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలు తగ్గేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

‘‘ఈ ఏడాది మేం తీవ్రంగా నష్టపోయాం. ఇప్పుడు పెరిగిన ధరలు మాకు కొంత ఊరటనిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇతర రాష్ట్రాల్లో పంట తక్కువగా ఉండడంతో..  మదనపల్లె మార్కెట్‌లో టమాటాకు డిమాండ్‌ పెరిగింది. గత వారంలో కిలో ధర రూ.74కి చేరింది. ఇప్పుడు వందకు చేరుకుంది. తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన టమాటా వ్యాపారులు స్థానిక వ్యాపారులకు ఆర్డర్లు ఇస్తున్నారు’’ అని మదనపల్లెకు చెందిన రైతు తెలిపారు.

Also Read: టిప్పు సుల్తాన్ సింహాసనంలోని పులి తలను వేలానికి పెట్టిన యూకే.. దొంగిలించిన వాటిని అమ్మడమేంటి అంటూ నెటిజన్లు ఫైర్

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు