TTD News: టీటీడీ షాకింగ్ నిర్ణయం.. ఆ ఉద్యోగులకు జీతాలు కట్

కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే ప్రధాన మార్గం. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే విషయాన్ని పదే, పదే చెబుతున్నాయి.

TTD News: టీటీడీ షాకింగ్ నిర్ణయం.. ఆ ఉద్యోగులకు జీతాలు కట్
TTD
Follow us

|

Updated on: Jul 01, 2021 | 1:37 PM

కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే ప్రధాన మార్గం. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే విషయాన్ని పదే, పదే చెబుతున్నాయి. అపోహలను వీడి 18 సంవత్సరాలు పైబడిన అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు అధికారులు.  దీంతో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయింది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత ప్రచారం చేస్తూ ప్రజలందరికీ ఫ్రీగానే వ్యాక్సిన్ అందిస్తున్నాయి.  ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. కార్పోరేట్ సంస్థలతో పాటు అనే కంపెనీలు తమ ఎంప్లాయిస్‌కు కార్యాలయాల్లోనే వ్యాక్సిన్లు వేయిస్తున్నాయి. ఈ కోవలోనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా తమ ఉద్యోగులకు వ్యాక్సిన్లు వేయిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఉద్యోగులకు ఊహంచని షాక్ ఇచ్చింది. టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 45 సంవత్సరాలు పైబడి ఇంకా వ్యాక్సిన్ వేయించుకోని వారికి జీతాలు నిలిపివేయాలని ఈవో జవహర్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. చాలామంది ఎంప్లాయిస్ ఇంకా వ్యాక్సిన్ వేయించుకోలేదని సమాచారం అందడంతో టీటీడీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

జులై 7 లోపు ఆ ఎంప్లాయిస్ అంతా వ్యాక్సిన్ వేయించుకుని సంబంధిత సర్టిఫికెట్లను ఆయా డిపార్ట్‌మెంట్లలో అందజేయాలని ఈవో ఆదేశించారు. జులై 7 లోపు వ్యాక్సిన్ వేసుకున్న ఉద్యోగులకు జూలై 8న శాలరీస్ చెల్లించాలని ఈవో అధికారులను ఆదేశించారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. త్వరలోనే సర్వదర్శనం కూడా అమలు చేయనున్న నేపథ్యంలో ఉద్యోగులందరూ వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు వేయించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆదేశించారు. అయినప్పటికీ కొందరు ఉద్యోగులు వ్యాక్సిన్ విషయంలో అపోహలకు లోనై.. అలసత్వం వహిస్తుండటంతో ఈవో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

Also Read:  కరోనా సమయంలో అయినవాళ్లు చనిపోతేనే పట్టించుకోవట్లేదు.. కానీ ఈ దంపతులు మాత్రం

‘రక్తం కావాలి’.. ఆంధ్రాలో తీవ్ర సమస్యగా బ్లడ్ షార్టేజ్

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??