AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala : బ్లాక్ మార్కెట్లో టీటీడీ క్యాలెండ‌ర్లు, డైరీలు..మండిపడుతోన్న శ్రీవారి భక్తులు..

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్లు, డైరీలను కొనుగోలు చేస్తారు.

Tirumala : బ్లాక్ మార్కెట్లో టీటీడీ క్యాలెండ‌ర్లు, డైరీలు..మండిపడుతోన్న శ్రీవారి భక్తులు..
Basha Shek
|

Updated on: Oct 28, 2021 | 1:24 PM

Share

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్లు, డైరీలను కొనుగోలు చేస్తారు. అందుకు తగ్గట్లే మార్కెట్లో వీటికి భారీగా డిమాండ్ ఉంది. అయితే భక్తుల నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు టీటీడీ క్యాలెండర్లు, డైరీలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీటి బ్లాక్‌ దందాపై టీటీడీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

తాజాగా దేవుళ్లు. కామ్‌ అనే ఓ నకిలీ వెబ్‌సైట్‌లో టీటీడీ క్యాలెండ‌ర్లు, డైరీలు దర్శనమిచ్చాయి. ఇందులో రూ.130 పలికే టీటీడీ డైరీని రూ.243లకు విక్రయిస్తున్నారు. అదేవిధంగా రూ.60 ధ‌ర క‌లిగిన క్యాలెండ‌ర్‌ను రూ.198లకు అమ్ముతున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు టీటీడీ డైరీలు, క్యాలెండర్లు అమ్మడంపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ అధికారులు స్పందించి బ్లాక్ మార్కెట్‌ దందాను అరికట్టాలని కోరుతున్నారు.

Also Read:

Nagarjuna-CM Jagan: ఈరోజు సీఎం జగన్ తో భేటీ కానున్న నాగార్జున… సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న సినీ బృందం

Pushpa Third Song: పుష్ప థర్డ్‌ సింగిల్‌ వచ్చేసింది..సామీ నా సామీ అంటోన్న పుష్పరాజ్‌, శ్రీవల్లి..

Papikondalu: పర్యాటకులకు గుడ్‌న్యూస్.. పాపికొండలు యాత్రకు గ్రీన్ సిగ్నల్.. బోటు సర్వీసులు ఎప్పటినుంచంటే..?