Janasena: వచ్చే ఎన్నికల్లో మంత్రి రోజా గెలిస్తే గుండు గీయించుకుంటా.. జనసేన నేత ఛాలెంజ్

ఏపీలో జనసేనాని పర్యటన వారాహి వాహనం పై ఆర్కే రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, అమరనాథ్ వంటివారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో జనసేన నేతలు మీడియా సమావేశం నిర్వహించారు.

Janasena: వచ్చే ఎన్నికల్లో మంత్రి రోజా గెలిస్తే గుండు గీయించుకుంటా..  జనసేన నేత ఛాలెంజ్
Roja
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 20, 2022 | 5:14 PM

ఎన్నికల వాడి వేడి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడో మొదలైపోయింది.. అధికార పార్టీ వైసీపీ నేతలు ప్రతి పక్ష పార్టీ జనసేన నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతూనే ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఏపీలో జనసేనాని పర్యటన వారాహి వాహనం పై ఆర్కే రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, అమరనాథ్ వంటివారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో జనసేన నేతలు మీడియా సమావేశం నిర్వహించారు.

తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. తమ అధినేత పవన్ కళ్యాణ్ వాహనం వారాహిని అడ్డుకునే దమ్ము వైసిపి కార్యకర్తలకు ఉందా అని ప్రశ్నించారు. మంత్రులు అంబటి రాంబాబు, రోజాలు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. అంతేకాదు మంత్రి రోజా గురించి ఏపీ ప్రజలు అందరికీ తెలుసని .. అసలు వైసీపీ కేబినెట్ లోనే అవినీతి మంత్రి రోజాని తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో రోజా గెలిచే ప్రసక్తే లేదని జోస్యం చెప్పారు. అంతేకాదు.. అసలు రోజా గెలిస్తే ఆమె ఇంటి ముందు గుండు గీయించుకుంటానని..అదే రోజా ఓడిపోతే గుండు గీయించుకుంటుందా అంటూ కిరణ్ రాయల్ మంత్రి ఆర్కే రోజాకు సవాల్ విసిరారు. అంతేకాదు అసలు వచ్చే ఎన్నికల్లో వైసిపి ఘోరంగా ఓడిపోవడం ఖాయం అంటూ సంచలన కామెంట్స్ చేశారు   తిరుపతి జనసేన ఇంచార్జ్  కిరణ్ రాయల్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles