AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దేవుడా.. ఒక్క 10 నిమిషాలు ఆలస్యంగా వాన కురిస్తే మూడు ప్రాణాలు దక్కేవి..

ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వాన కురుస్తుండడంతో.. వాళ్లంతా చెట్టు కిందకు పరుగున వెళ్లారు.. వర్షం నుంచి కొంచెం తడవకుండా ఉంటే చాలనుకున్నారు. కానీ వారికి అదే శాపం అయింది.. తడవడం సంగతి పక్కన పెడితే.. పిడుగు పడి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. పిడుగుపాటుతో చెట్టు కింద ఉన్న ఒక మహిళ.. బాబు, అక్కడే ఉన్న మరో వ్యక్తి.. ఇలా ముగ్గురూ మరణించారు.

అయ్యో దేవుడా.. ఒక్క 10 నిమిషాలు ఆలస్యంగా వాన కురిస్తే మూడు ప్రాణాలు దక్కేవి..
Ap Rains
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Oct 03, 2024 | 9:46 PM

Share

ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వాన కురుస్తుండడంతో.. వాళ్లంతా చెట్టు కిందకు పరుగున వెళ్లారు.. వర్షం నుంచి కొంచెం తడవకుండా ఉంటే చాలనుకున్నారు. కానీ వారికి అదే శాపం అయింది.. తడవడం సంగతి పక్కన పెడితే.. పిడుగు పడి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. పిడుగుపాటుతో చెట్టు కింద ఉన్న ఒక మహిళ.. బాబు, అక్కడే ఉన్న మరో వ్యక్తి.. ఇలా ముగ్గురూ మరణించారు. ఈ ఘటన కడప జిల్లాలోని పెండ్లిమర్రి మండలం తుమ్మలూరు గ్రామంలో చోటుచేసుకుంది. పిడుగుపడి మహిళతో పాటు ఓ బాలుడు, యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కూలీ పని కోసం వెళ్ళగా.. వాతావరణం మారి వాన కురుస్తుండటంతో వాళ్లంతా చెట్టు కింద నిలబడదామని వెళ్లి ముగ్గురూ మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతులు శివపార్వతి (30) తేజేశ్వర్ రెడ్డి (10), మారుతి ప్రసాద్ రెడ్డి (30) గా పోలీసులు గుర్తించారు.

వాతావరణం ఒక్కసారిగా మారడంతోపాటు.. పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసిందని స్థానికులు తెలిపారు. ఒక పది నిమిషాలు వాన ఆలస్యంగా పడి ఉంటే ఈ ముగ్గురు ఇళ్లకు చేరుకునే వారని.. ఈ క్రమంలోనే.. పిడుగులతో వాన పడటంతో ఇలా జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. సాయంత్రం ఐదున్నరకు ఈ ఘటన జరిగిందని.. ఒక్క పది నిమిషాలు ముందు బయలుదేరి ఉంటే ఆ ముగ్గురు ప్రాణాలు కాపాడుకునేవారని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వాన పడిన సమయంలో చెట్టు కిందకు వెళ్లడం… చెట్టుపై పిడుగు పడటం అకస్మాత్తుగా జరిగిపోయిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామానికి చెందిన ముగ్గురూ పిడుగుపాటుతో మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది..

ఏది ఏమైనా ప్రజలందరూ వాన పడే సమయంలో చెట్లు కిందకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చెట్లు ఉన్న ప్రదేశంలో పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రజలందరూ గ్రహించి వాన పడే సమయంలో చెట్టు కిందకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని గ్రహించాలి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై కీలక అప్‌డేట్.. షెడ్యూల్
ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై కీలక అప్‌డేట్.. షెడ్యూల్
అయ్యబాబోయ్.. ఈ పాము ఎట్టా వేటాడుతుందో తెలిస్తే గుండెలు గుభేల్..
అయ్యబాబోయ్.. ఈ పాము ఎట్టా వేటాడుతుందో తెలిస్తే గుండెలు గుభేల్..
ఉగాది స్పెషల్.. మృదువైన, రుచికరమైన పప్పు బక్షాలు.. ఇంట్లోనే ఈజీగా
ఉగాది స్పెషల్.. మృదువైన, రుచికరమైన పప్పు బక్షాలు.. ఇంట్లోనే ఈజీగా
బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై కేంద్రం భారీ ఊరట.. ఇకపై 24 గంటలు
బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై కేంద్రం భారీ ఊరట.. ఇకపై 24 గంటలు
పిల్లల్లో ప్రోటీన్ లోపం లక్షణాలు, గుర్తించే మార్గాలు..
పిల్లల్లో ప్రోటీన్ లోపం లక్షణాలు, గుర్తించే మార్గాలు..
యూట్యూబ్‏లో దూసుకుపోతున్న దీవానా టీజర్..
యూట్యూబ్‏లో దూసుకుపోతున్న దీవానా టీజర్..
రైళ్ల చివరి బోగీ వెనుక ఉండే 'X' గుర్తు రహస్యమిదే.. ఎవరికీ తెలియదు
రైళ్ల చివరి బోగీ వెనుక ఉండే 'X' గుర్తు రహస్యమిదే.. ఎవరికీ తెలియదు
పాక్ స్పిన్నర్ వివాదంపై బీసీసీఐ సెన్సేషనల్ క్లారిటీ
పాక్ స్పిన్నర్ వివాదంపై బీసీసీఐ సెన్సేషనల్ క్లారిటీ
డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే..
డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే..
కొత్త ఏడాది ముందు గ్యాస్ కష్టాలు.. ఉగాది తర్వాత ధరల విలయతాండవమేనా
కొత్త ఏడాది ముందు గ్యాస్ కష్టాలు.. ఉగాది తర్వాత ధరల విలయతాండవమేనా