AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ChandraBabu: ఏపీ తుఫాన్ బాధిత రైతులను ఆదుకోండి.. ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ

మిచౌంగ్ తుఫాన్‌ 15 జిల్లాల్లోని రైతులను నిట్టనిలువున ముంచెత్తింది. రైతన్న కంట కన్నీరు మిగిల్చింది.  తుఫాను దాటికి చేతి కొచ్చిన పంటలు నీట మునిగాయి. వరి, మిర్చి వంటి అనేక పంటలు మోకాలు లోతు నీటిలో మునిగిపోయి కుళ్లిపోయాయి. ఎకరాలకు లక్ష రూపాయల పెట్టుబడిపెట్టి నిలువునా నష్టపోయామంటూ రైతులు కన్నీరు పెట్టుకున్నారు. తుపాన్ వలన నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి లేఖ రాశారు

ChandraBabu: ఏపీ తుఫాన్ బాధిత రైతులను ఆదుకోండి.. ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ
Cyclone Michaung
Surya Kala
|

Updated on: Dec 10, 2023 | 12:52 PM

Share

మిచౌంగ్‌ తుపాను ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది.  రైతులకు కన్నీరు మిగిల్చింది మిచౌంగ్‌ తుపాను. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఏపీ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మిచౌంగ్‌ తుపాన్ వలన నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి లేఖ రాశారు. ప్రధాని మోడీకి చంద్రబాబు రాసిన లేఖలో మిచాంగ్ తుఫాన్ ను జాతీయ‌విప‌త్తుగా ప్రక‌టించాల‌ని కోరారు. అందుకు తగిన విధంగా సాయం చేయాలనీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని సుమారు 15 జిల్లాల్లో తుఫాన్ తీవ్ర ప్రభావం చూపించిందని.. మొత్తం 22 ల‌క్షల ఎక‌రాల్లో 10 వేల కోట్ల మేర పంట‌ల‌కు న‌ష్టం వాటిల్లిందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అయితే మొత్తం తుఫాను సృష్టించిన న‌ష్టం అంచ‌నా వేసేంద‌కు కేంద్ర‌ బృందాన్ని పంపించాలని .. ఈ విపత్తుని జాతీయ‌ విప‌త్తుగా ప‌రిగ‌ణిస్తే బాధితుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లుగుతుందన్నారు చంద్రబాబు

మిచౌంగ్ తుఫాన్‌ 15 జిల్లాల్లోని రైతులను నిట్టనిలువున ముంచెత్తింది. రైతన్న కంట కన్నీరు మిగిల్చింది.  తుఫాను దాటికి చేతి కొచ్చిన పంటలు నీట మునిగాయి. వరి, మిర్చి వంటి అనేక పంటలు మోకాలు లోతు నీటిలో మునిగిపోయి కుళ్లిపోయాయి. ఎకరాలకు లక్ష రూపాయల పెట్టుబడిపెట్టి నిలువునా నష్టపోయామంటూ రైతులు కన్నీరు పెట్టుకున్నారు. ఇంట్లో ఉన్న బంగారమంతా తాకట్టు పెట్టి పొలం మీద పెట్టుబడి పెట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు రైతులు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌