AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rottela Panduga 2025: నెల్లూర్ రొట్టెల పండుగకు సర్వం సిద్ధం.. రేపట్నుంచే స్వర్ణాల చెరువులో వేడుకలు!

నెల్లూరులో ఒకరోజు ముందు నుంచే భక్తుల సందడి మొదలైంది. పెద్ద సంఖ్యలో భక్తులు బారా షాహిద్ దర్గాకు తరలివస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర పండుగ గుర్తింపు పొందిన రొట్టెల పండుగకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దర్గా ప్రాంగణం మొత్తం రంగు రంగుల విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు..

Rottela Panduga 2025: నెల్లూర్ రొట్టెల పండుగకు సర్వం సిద్ధం.. రేపట్నుంచే స్వర్ణాల చెరువులో వేడుకలు!
Nellore Rottela Panduga
Srilakshmi C
|

Updated on: Jul 05, 2025 | 7:33 PM

Share

నెల్లూరు, జులై 5: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన నెల్లూరు భారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏటా మోహరం సందర్భంగా రోజు రొట్టెల పండుగను నిర్వహిస్తారు. రేపటి నుంచి 11 వరకు ఐదు రోజుల పాటు రొట్టెల పండుగ జరగనుంది. దీంతో ఇప్పటికే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షల సంఖ్యలో భక్తులు స్వర్ణాల చెరువుకు తరలివస్తారనే ముందస్తు అంచనాలతో ఏర్పాట్లు చేశారు. ఒకరోజు ముందు నుంచే భక్తుల సందడి మొదలైంది. పెద్ద సంఖ్యలో భక్తులు బారా షాహిద్ దర్గాకు తరలివస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర పండుగ గుర్తింపు పొందిన రొట్టెల పండుగకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దర్గా ప్రాంగణం మొత్తం రంగు రంగుల విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. స్వర్ణాల చెరువులో భక్తులు రొట్టెలు వదులు కునేందుకు వీలుగా ప్రత్యేక ఫ్లాట్ ఫామ్ లు సిద్ధం చేశారు. పండుగకు వచ్చే భక్తులకు మంచి నీరు, భోజనం, పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి సారించారు.

కోర్కెలు తీర్చే రొట్టెలు..

ఇక్కడ పలు రకాల రొట్టెలు పంపిణీ జరుగుతుంది. ఆరోగ్య రొట్టె, కల్యాణ రొట్టె, విద్యా రొట్టె, వ్యాపార రొట్టె, ఉద్యోగ రొట్టె, సంతాన రొట్టె ఇలా అనేక రకాల రొట్టెలు ఉంటాయి.. ఏ కోర్కె కోరుకుంటే ఆరొట్టె తీసికుంటారు.. కోర్కె తీరిన వారు వచ్చే ఏడాది రొట్టెల పండుగ నాడు తిరిగి ఇదే రొట్టెను చెల్లిస్తారు.. ఎవరికైతే ఆ రొట్టె కావాలో వారు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.. ఇదే రొట్టెల పండుగ పద్ధతి.

బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 20 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారనే అంచనాలతో ఏర్పాటు చేయాలని అన్నారు. దర్గాలో ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన వసతులను మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. నిత్యం అధికారులు తనికీలు వుంటాయని ఎవరికి కేటాయించిన విభాగాల్లో వారు పనిచేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్ చేయండి.

మీరు కారు కొన్న డబ్బులో కొంత ప్రభుత్వం మీకు తిరిగి ఇస్తుంది!
మీరు కారు కొన్న డబ్బులో కొంత ప్రభుత్వం మీకు తిరిగి ఇస్తుంది!
మహాజాతరకు సర్వం సిద్ధం.. ఒక్క క్లిక్‌తో ఫుల్ అప్‌డేట్స్..
మహాజాతరకు సర్వం సిద్ధం.. ఒక్క క్లిక్‌తో ఫుల్ అప్‌డేట్స్..
పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' రివ్యూ
పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' రివ్యూ
అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న డ్రమ్స్ ప్లేయర్ శివమణి..
అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న డ్రమ్స్ ప్లేయర్ శివమణి..
మద్యం ప్రియులకు మత్తెంకించే కాంబో..! ఇలా తాగితే కిక్కే కిక్కు
మద్యం ప్రియులకు మత్తెంకించే కాంబో..! ఇలా తాగితే కిక్కే కిక్కు
అక్కడ పిజ్జా ఆర్డర్లు పెరిగాయా.. ప్రపంచంలో ఎక్కడో యుద్ధం ..
అక్కడ పిజ్జా ఆర్డర్లు పెరిగాయా.. ప్రపంచంలో ఎక్కడో యుద్ధం ..
జియోలో 36 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ వచ్చిందని మీకు తెలుసా?
జియోలో 36 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ వచ్చిందని మీకు తెలుసా?
జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు
జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్