Balayya: సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్గా హిందూపురం..! బాలయ్య చెప్పేశారుగా
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రాల్లో పుట్టపర్తి ఒకటి. భగవాన్ శ్రీసత్యసాయిబాబా నడయాడిన నేల ఇది. అందుకే, కొత్త జిల్లాల ఏర్పాటులో పుట్టపర్తికి ప్రాధాన్యత దక్కింది. ఉమ్మడి అనంతపురం జిల్లాను రెండుగా విభిజిస్తూ పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది గత వైసీపీ ప్రభుత్వం.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రాల్లో పుట్టపర్తి ఒకటి. నాటి వైసీపీ ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం జిల్లాను రెండుగా విభిజిస్తూ పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే, కొత్త జిల్లాకు సత్యసాయి పేరు పెట్టడంపై ఎవరికీ అభ్యంతరం లేనప్పటికీ.. పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేయడంపై మాత్రం ఆందోళనలు జరిగాయ్. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నాడు స్వయంగా నిరసనల్లో పాల్గొన్నారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలంటూ పాదయాత్ర సైతం చేశారు. అవసరమైతే రాజీనామాకు కూడా సిద్ధమని ఆనాడు ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వస్తే హిందూపురంను జిల్లా కేంద్రంగా చేస్తామంటూ ప్రకటించారు బాలకృష్ణ. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ తన ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారు. బాలయ్య సీన్లోకి దిగారు కాబట్టి.. శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం… పుట్టపర్తి నుంచి హిందూపూర్కి మారుతుందా? లేదా? అన్న అంశంపై త్వరలోనే క్లారిటీ రాబోతోంది. హిందూపురంను జిల్లా కేంద్రంగా చేస్తే సత్యసాయి భక్తులు ఎలా రియాక్ట్ అవుతారు? మిగతా టీడీపీ నేతలు ఒప్పుకుంటారా? లేదా? అనేదానిపైనా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక ఇవాళ హిందూపురంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు బాలయ్య. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిందూపురంలో కొత్తగా నిర్మించిన జిమ్ను ప్రారంభించారు. కాసేపు వర్కవుట్లు చేసి అభిమానుల్ని ఉత్సాహపరిచారు. అంతకుముందు.. జిల్లా కలెక్టర్ చేతన్తో కలిసి హిందూపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు. స్వయంగా ప్రజలకు అల్పాహారం వడ్డించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..