ఉదయాన్నే ఈ శబ్ధాలు వినిపిస్తున్నాయా?.. అయితే మీకు మంచి రోజులు వచ్చినట్లే!
ఉదయం అనేది మనసుకు ఎంతో హాయినిస్తుంది. ప్రతి ఉదయం ఒక కొత్త ప్రపంచంలా కనిపిస్తూ, కొత్త ఆరంభానికి నాంది పలుకుతుంది. అయితే ఉదయం లేచే సమయంలో కొన్ని శబ్ధాలు వినిపిస్తే అది చాలా మంచిదంట. కాగా ఉదయాన్నే ఏ శబ్ధాలు వినడం మంచిదో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
Updated on: Dec 22, 2025 | 8:43 AM

ఉదయం అనేది మనసుకు ఎంతో హాయినిస్తుంది. ప్రతి ఉదయం ఒక కొత్త ప్రపంచంలా కనిపిస్తూ, కొత్త ఆరంభానికి నాంది పలుకుతుంది. అయితే ఉదయం లేచే సమయంలో కొన్ని శబ్ధాలు వినిపిస్తే అది చాలా మంచిదంట. కాగా ఉదయాన్నే ఏ శబ్ధాలు వినడం మంచిదో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

కొంత మంది ఉదయాన్నే మొదట అల్లారం శబ్ధం వెంటే, మరికొంత మంది భక్తి గీతాలు, ఇంకొందరు ఎదుటి వారి మాటలు వంటి శబ్ధాలు వింటారు. ఇక కొంత మంది ఆలయ గంటల ధ్వని, శంఖం నాదం, వంటి వాటిని వింటుంటారు. ఎక్కువగా పల్లెల్లో పక్షుల కిలకిలలు వింటుంటారు. అయితే వీటిలో ఉదయాన్నే ఏది వినడం మంచిదంటే?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉదయాన్నే పక్షుల కిలకిలలు వినడం చాలా మంచిదంట. ఉదయాన్నే ఈ శబ్ధం వింటూ నిద్రలేవడం వలన ఆ రోజు చాలా ఆనందంగా గడిచిపోతుందంట. ప్రకృతితో మనకున్న అనుబంధం గుర్తు చేస్తూ, మనసుకు చాలా హాయినిస్తుంది. దీని వలన ఒత్తిడి, ఆందోళన, భయం , వంటివి తగ్గిపోయి, మానసిక ప్రశాంతత కలుగుతుందంట.

అదే విధంగా ఉదయాన్నే ఆలయంలోని గంటల శబ్ధం వినడం కూడా మంచిదంట. దీని వలన మనసులో పవ్రితత అనే భావన కలుగుతుంది. అలాగే ఇది మీ మనసును ఆధ్యాత్మికం వైపు మళ్లేలా చేస్తుంది. మీ మనసుకు హాయినిస్తుంది. మీ మనసులోకి చెడు ఆలోచనలు రాకుండా చేస్తుంది. అదేవిధంగా ధ్వని తరంగాల శబ్దం మీ మెదడులో ఏకాగ్రత కేంద్రాలను ఉత్తేజ పరిచి, ప్రశాంతతను అందిస్తుంది.

అలాగే ఉదయాన్నే శంఖం నాదం వినడం చాలా మంచిదంట. ఇది మనసుకు చాలా హాయినిస్తుంది. ఈ శబ్ధం వినడం వలన దుష్ట శక్తులు మీకు దూరంగా ఉండటమే కాకుండా, మీలో ఉన్న నెగిటివిటీ మొత్తం పోతుంది. ఈ శబ్ధం విన్న వారు ఆ రోజు మొత్తం చాలా ఆనందంగా, హాయిగా గడిపేస్తారు. చాలా ఉత్సాహంగా ఉంటారు.



