AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viveka Murder Case: వివేకా హత్య రోజు అసలేం జరిగిందంటే? వీడియో విడుదల చేసిన ఎంపీ అవినాష్‌

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో గంగిరెడ్డికి బెయిల్ రద్దు తర్వాత మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మర్డర్‌కి సంబంధించి తన వెర్షన్‌ వినిపిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి.

Viveka Murder Case: వివేకా హత్య రోజు అసలేం జరిగిందంటే?  వీడియో విడుదల చేసిన ఎంపీ అవినాష్‌
Avinash Reddy
Basha Shek
|

Updated on: Apr 27, 2023 | 1:29 PM

Share

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో గంగిరెడ్డికి బెయిల్ రద్దు తర్వాత మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మర్డర్‌కి సంబంధించి తన వెర్షన్‌ వినిపిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి. ఇందులో అసలు వివేకా హత్య రోజు ఏం జరిగింది? మర్డర్ తర్వాత ఎంపీకి కాల్ వెళ్లిందా? అవినాష్‌రెడ్డి పాత్రపై సీబీఐ చేస్తున్న ఆరోపణలు నిజమేనా? తదితర విషయాలపై తన వెర్షన్‌ వినిపించారు అవినాష్‌ రెడ్డి. ‘ శివప్రకాష్‌ రెడ్డి ((వివేకా బామ్మర్ది ) నాకు ఉదయం 6:30కి ఫోన్ చేశారు. నేను అప్పటికే జమ్మలమడుగుకు వెళ్తున్నా. సరిగ్గా పులివెందుల రింగ్‌రోడ్డులో ఉన్నప్పుడు నాకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. వివేకా నో మోర్ అని నాకు ఫోన్లో చెప్పారు. దీంతో వెంటనే నేను వివేకా ఇంటికి వెళ్లాను. వివేకా రాసిన లెటర్‌, ఫోన్‌ గురించి పీఏ కృష్ణారెడ్డి వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డికి చెప్పారు. అయితే ఆ లెటర్‌, ఫోన్‌ను దాచమని రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. డ్రైవర్‌ ప్రసాద్‌ను వదిలిపెట్టొద్దని లేఖలో రాశారు వివేకా. ఈ మొత్తం మర్డర్‌ కేసులో ఆ లెటరే చాలా కీలకం. ప్రసాద్‌ను ఏమైనా అంటారేమో అని లేఖ దాచామని సునీత చెప్పారు. మీ నాన్నను కాకుండా డ్రైవర్‌ ప్రసాద్‌నే నమ్ముతారా? లెటర్‌ విషయాన్ని నాకు , పోలీసులకు చెప్పలేదు. ఆ లెటర్‌ విషయంపై CBI ఎందుకు ఫోకస్ చేయడం లేదు? ఎవరిని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారు? మర్డర్‌ అని తెలిసిన తర్వాత కూడా లెటర్ ఎందుకు దాచారు? మీ వైపు తప్పు ఉంది కాబట్టే ఆ లెటర్‌ను దాచారు. ఇదే విషయం నేను CBIకి చెప్పాను’ అని వీడియోలో చెప్పుకొచ్చారు అవినాష్‌ రెడ్డి.

కాగా వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దయిన సంగతి తెలిసిందే. గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై  గురువారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది.  అనంతరం తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేసిన హైకోర్టు మే 5లోపు సీబీఐకి లొంగిపోవాలని ఆదేశించింది. ఒకవేళ  మే 5 వరకు లోంగిపోకుంటే గంగిరెడ్డిని అరెస్ట్ చేయాలని సీబీఐను ఆదేశించింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏడాదికి ఎన్నిసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి..?
ఏడాదికి ఎన్నిసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి..?
కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..
కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..
ప్రమాదం అంచున విలవిలలాడిన శునకం.. ఫైర్ సిబ్బంది వీడియో వైరల్
ప్రమాదం అంచున విలవిలలాడిన శునకం.. ఫైర్ సిబ్బంది వీడియో వైరల్
SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో
SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్