AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిడ్డకు జన్మనిచ్చి చెప్పాపెట్టకుండా పారిపోయిన తల్లి.. 5 నెలల తరువాత జరిగిందిదే..

గత ఏడాది అక్టోబర్ 21 జిజిహెచ్‎లోని గైనకాలజీ వార్డుకు నిండు నెలలతో కూడిన ఓ మహిళ చేరింది. ఆమె పేరు అలేఖ్య. ఆమెతో పాటు లక్ష్మీ అనే సహాయకురాలు వచ్చింది. చేరిన మరోసటి రోజే ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే ఆ శిశువు బరువు తక్కువుగా ఉంది. దీంతో లక్ష్మీ ఆ శిశువును పిడీయాట్రిక్ వార్డుకు తీసుకొచ్చింది.

బిడ్డకు జన్మనిచ్చి చెప్పాపెట్టకుండా పారిపోయిన తల్లి.. 5 నెలల తరువాత జరిగిందిదే..
Guntur Government Hospital
T Nagaraju
| Edited By: |

Updated on: Mar 24, 2024 | 2:00 PM

Share

గత ఏడాది అక్టోబర్ 21 జిజిహెచ్‎లోని గైనకాలజీ వార్డుకు నిండు నెలలతో కూడిన ఓ మహిళ చేరింది. ఆమె పేరు అలేఖ్య. ఆమెతో పాటు లక్ష్మీ అనే సహాయకురాలు వచ్చింది. చేరిన మరోసటి రోజే ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే ఆ శిశువు బరువు తక్కువుగా ఉంది. దీంతో లక్ష్మీ ఆ శిశువును పిడీయాట్రిక్ వార్డుకు తీసుకొచ్చింది. చిన్న పిల్లల వైద్యులు శిశువు గురించి వివరించే లోపే అక్కడ నుండి లక్ష్మీ వెళ్లిపోయింది. కొద్ది సేపటి తర్వాత లక్ష్మీ, అలేఖ్య ఇద్దరూ కలిసి జిజిహెచ్ నుండి వెళ్లిపోయారు. దీంతో శిశువు ఆలనా పాలనా జిజిహెచ్ సిబ్బందిపై పడింది.

పిడియాట్రిక్ వార్డులో ఉన్న శిశువును గత ఐదు నెలలుగా ఆసుపత్రి సిబ్బందే కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. బరువు తక్కువుగా పుట్టిన శిశువు ఇప్పుడు పూర్తిగా బరువు పెరిగి అందరి శిశువుల్లానే తయారైంది. అయితే ఆమె తల్లిని కనుగొనడం జిజిహెచ్ సిబ్బందికి గగనమై పోయింది. ఈ విషయాన్ని జిజిహెచ్ సూపరింటిండెంట్ కిరణ్ కుమార్ కొత్తపేట పోలీసులకు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అలేఖ్యను గుర్తించే పనిలో పడ్డారు. కేవలం ఆమె ఆధార్ కార్డు ఆధారంగానే గుర్తించాల్సి రావడంతో పోలీసులు ఐదు నెలలుగా ఆమె అడ్రస్ కోసం గాలిస్తున్నారు. ఆధార్ అడ్రస్ ప్రకారం వెళ్లిన పోలీసులకు ఆమె అక్కడ కనిపించలేదు. దీంతో ఆమె ఎక్కదుందా అన్నదానిపై దర్యాప్తు కొనసాగించారు. అయితే అలేఖ్యను గుర్తించి జిజిహెచ్‎కు తీసుకురావడానికి ఐదు నెలల సమయం పట్టింది.

చిట్ట చివరగా నర్సరావుపేటలో అలేఖ్యను గుర్తించిన పోలీసులు జిజిహెచ్‎కు తీసుకొచ్చారు. ఐదు నెలల వయస్సులో ఆరోగ్యంగా ఉన్న శిశువు చూసి తల్లి తల్లడిల్లిపోయింది. తప్పు తెలుసుకొని శిశువును తీసుకెళ్లేందుకు సిద్దమైంది. శిశువు తక్కువ బరువు ఉండటంతో వైద్య ఖర్చులు పెట్టుకోలేక ఆసుపత్రిలో విడిచి పెట్టి వెళ్లినట్లు ఆమె చెప్పింది. ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితి కూడా మెరుగుపడిందని శిశువును తీసుకెళ్తానని చెప్పడంతో అటు పోలీసులు, ఇటు ఆసుపత్రి సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తూ శిశువును అప్పగించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు