AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KRMB meet: తెలుగు రాష్ట్రాల తాగు, సాగు నీటి సమస్యకు యాక్షన్‌ ప్లాన్‌ షురూ.. కేఆర్ఎంబీ కమిటీ భేటీలో కీలక చర్చ

తెలంగాణ, ఏపీ సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి యాక్షన్‌ ప్లాన్‌ షురువైంది. కృష్ణా నదీ యాజమాన్యపు బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ భేటీ అయ్యింది. ఈ వర్చువల్‌ సమావేశానికి రెండు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు.

KRMB meet: తెలుగు రాష్ట్రాల తాగు, సాగు నీటి సమస్యకు యాక్షన్‌ ప్లాన్‌ షురూ.. కేఆర్ఎంబీ కమిటీ భేటీలో కీలక చర్చ
Krmb
Balaraju Goud
|

Updated on: Dec 09, 2021 | 4:40 PM

Share

KRMB vartual Meet: తెలంగాణ, ఏపీ సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి యాక్షన్‌ ప్లాన్‌ షురువైంది. కృష్ణా నదీ యాజమాన్యపు బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ భేటీ అయ్యింది. ఈ వర్చువల్‌ సమావేశానికి రెండు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు. తెలంగాణ, ఏపీ సాగు, తాగునీటి అవసరాలపై అధికారులు చర్చించారు.

కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశంలో కీలకాంశాలపై చర్చ జరిగింది. యాసంగిలో సాగు, తాగునీటి అవసరాలకు నీటి విడుదలపై ప్రధానంగా చర్చించారు సభ్యులు. సమావేశంలో బోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఈఎన్సీలు, అధికారులు పాల్గొన్నారు. 15 రోజుల్లో ముగిసే ఖరీఫ్ పంట కోసం కాకుండా.. రాబోయే యాసంగి సీజన్ కోసం చర్చించాలని తెలంగాణ సూచించింది. తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ ప్రతిపాదనకు ఏపీ సుముఖత వ్యక్తం చేసింది. యాసంగి సీజన్‌కు సాగునీటి కోసం 150 టీఎంసీలు.. తాగునీటి కోసం 90 టీఎంసీలు అవసరమవుతాయని తెలంగాణ పేర్కొంది. ఖరీఫ్ 15 రోజుల సీజన్ కోసం 23 టీఎంసీలు కావాలని ఏపీ కోరింది. త్వరలో మరోసారి సమావేశమైన నిర్ణయం తీసుకుందామని కేఆర్‌ఎంబీ తెలిపింది.

ఇదిలావుంటే, ఖరీఫ్‌లో ఈనెల 15వ తేదీ దాకా నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ కింద 11.77 టీఎంసీలు, కుడికాలువ కింద 2.55 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ నుంచి 5.22 టీఎంసీలు, హంద్రీనీవా సుజల స్రవంతి కోసం 4.14 టీఎంసీల నీటిని శ్రీశైలం జలాశయం నుంచి కేటాయించాలని కోరుతూ కేఆర్‌ఎంబీకి లేఖ రాశారు ఏపీ ఈఎన్సీ. ఈ భేటీలో తెలంగాణ సైతం ఏ మేరకు నీళ్లు కావాలో వివరాలు అందించింది. సమావేశంలో నీటి కేటాయింపులపై చర్చించిన కమిటీ.. తుది ఉత్తర్వులు ఇవ్వనుంది.

గతంలో ఏపీకి 207 టీఎంసీలను కేటాయించగా.. ఇందులో నవంబర్‌ 30 వరకు ఈ రెండు ప్రాజెక్టుల నుంచి 183.32 టీఎంసీల నీటిని ఉపయోగించుకున్నామని ఏపీ తన ఇండెంట్‌లో వెల్లడించింది. ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తి నీళ్లు సముద్రంలోకి పోయే రోజుల్లో అదనంగా 32.16 టీఎంసీలు తీసుకున్నామని తెలిపింది.

Read Also… CM Jagan on Irrigation: ఏపీ నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు!

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?