AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kakinada blast: కాకినాడలోని అదే ఫ్యాక్టరీలో మరోసారి ప్రమాదం.. బాయిలర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి..

వారం క్రితం ప్రమాదం జరిగినా... జిల్లా కలెక్టర్‌ సహా స్థానిక అధికారులెవ్వరూ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు కార్మికులు, స్థానికులు. దీంతో, మరోసారి ఇలాంటి పేలుడే జరిగి..

Kakinada blast: కాకినాడలోని అదే ఫ్యాక్టరీలో మరోసారి ప్రమాదం.. బాయిలర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి..
Blast
Jyothi Gadda
|

Updated on: Aug 29, 2022 | 3:09 PM

Share

Kakinada blast: కాకినాడలో మరోసారి భారీ పేలుడు జరిగింది. కాకినాడ రూరల్ వాకలపూడి పారీ షుగర్ ఫ్యాక్టరీలో మరో సారి బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పది రోజుల వ్యవధిలో ఇక్కడి ప్యారీ పరిశ్రమలో ఇది రెండో ప్రమాదం కావడం ఆందోళన కలిగిస్తోంది. పేలుడు ప్రమాదంలో చనిపోయినవారు గొల్లప్రోలుకు చెందిన రాగం ప్రసాద్ , వట్టపూడి కె. గంగవరానికి చెందిన పేరురి సుబ్రహ్మణ్యస్వరావుగా గుర్తించారు. ఈ పేలుడులో మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావటంతో… క్షతగ్రాతులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వారం క్రితం ప్రమాదం జరిగినా… జిల్లా కలెక్టర్‌ సహా స్థానిక అధికారులెవ్వరూ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు కార్మికులు, స్థానికులు. దీంతో, మరోసారి ఇలాంటి పేలుడే జరిగి.. ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసపోయాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నెల 19వ తేదీన ప్యారీ షుగర్స్ రిఫైనరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కన్వేయర్ బెల్ట్ పేలడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో తొమ్మిది మందికి కాలిన గాయాలయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి